కమ్మర్‌వాడీలో చోరీ

2 Aug, 2016 20:14 IST|Sakshi

ఓ ఇంట్లో దొంగలు పడి బంగారు, వెండి ఆభరణాలను దొంగలించిన సంఘటన మంగళవారం భవానీనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై వి. రమేశ్ తెలిపిన వివరాల ప్రకారం... ఈదిబజార్ కుమ్మర్‌వాడీ ప్రాంతానికి చెందిన మహ్మద్ గౌస్ ఖాన్ (26) కారు డ్రై వర్‌గా పని చేస్తున్నాడు. మంగళవారం తెల్లవారుజామున 3 గంటలకు ఇంట్లో దొంగలు పడి అల్మారాలో ఉన్న ఒక బంగారం రింగు, రెండు వెండి రింగులను ఎత్తుకెళ్లారు. దీంతో జరిగిన చోరిపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


 

>
మరిన్ని వార్తలు