గుండెపోటుతో వైఎస్సార్‌సీపీ నాయకుడు మృతి

11 Nov, 2016 23:17 IST|Sakshi

చాలకూరు (సోమందేపల్లి) : మండలంలోని చాలకూరు గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ ఎస్సీసెల్‌ విభాగపు నాయకుడు మైలారప్ప(58) గుండెపోటుతో గురువారం రాత్రి మృతి చెందారు. వైఎస్సార్‌సీపీ స్థానిక నాయకురాలు అశ్వర్థమ్మ, తుంగోడు సర్పంచ్‌ నారాయణరెడ్డి, నాయకులు నాయనిశ్రీనివాసులు, ఆది, జగదీష్, హరీష్‌ తదితరులు మృత దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గోరంట్ల మండలంలో గడపగడపకూ వైఎస్సార్‌ కార్యక్రమంలో ఉన్న శంకరనారాయణ విషయం తెలుసుకుని మృతుని కుటుంబానికి సానుభూతి వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు