బుజ్జి పిల్లికి ఎంతకష్టం!

2 Jun, 2016 11:08 IST|Sakshi
బుజ్జి పిల్లికి ఎంతకష్టం!

బీజింగ్: చైనాలోని గ్వాంగ్డాంగ్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఇంట్లో పెంచుకునే పిల్లికి అస్వస్థత కలగటంతో దానిని ఆసుపత్రికి తీసుకెళ్లిన యజమానికి డాక్టర్లు షాకింగ్ విషయం చెప్పారు. పిల్లి అస్వస్థతకు కారణం ఏంటని తెలుసుకునే క్రమంలో డాక్టర్లు దాని ఎక్స్-రేను పరిశీలించగా.. శరీరంలో 43 నీడిల్స్ ఉన్న విషయం గుర్తించారు. సుమారు 4 గంటల పాటు ఆపరేషన్ నిర్వహించి నీడిల్స్ను తొలగించారు.

పిల్లిని టార్గెట్గా చేసుకొని ఎయిర్ రైఫిల్తో దాడి చేయడం మూలంగానే దాని బాడీలోకి ఆ నీడిల్స్ వెళ్లాయని భావిస్తున్నారు. ఈ ఘటనకు పాల్పడింది ఎవరనే విషయం మాత్రం తెలియరాలేదు. దీనిపై జంతుప్రేమికులు పెద్ద ఎత్తున నిరసన తెలుపుతున్నారు. ప్రస్తుతం పిల్లి కోలుకుంటోంది.

 

>
మరిన్ని వార్తలు