ఆస్ట్రేలియా పార్లమెంటులో ప్రసంగించిన మోదీ

18 Nov, 2014 06:15 IST|Sakshi
ఆస్ట్రేలియా పార్లమెంటులో ప్రసంగించిన మోదీ

ఆస్ట్రేలియా: ఆస్ట్రేలియా పార్లమెంటులో ప్రసంగించడం గౌరవంగా భావిస్తున్నాట్లు భారత్ ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. ఈ రోజు ఆయన ఆస్ట్రేలియా పార్లమెంటును ఉద్దేశించి ప్రసంగించారు. ముందుగా జీ20 సదస్సును విజయవంతం చేసిన ఆస్ట్రేలియా ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు.

ప్రజాస్వామ్య భావనలో ఐక్యంగా ముందుకు వెళ్దామని పిలుపునిచ్చారు. భారతీయ యువత మార్పు కోరుకుంటోందన్నారు.30 ఏళ్ల తర్వాత భారత్‌లో స్థిర ప్రభుత్వం ఏర్పడిందన్నారు. ఇరుదేశాల మధ్య వాణిజ్య సంబంధాలు బలపడాలి అన్నారు.
 

మరిన్ని వార్తలు