'కృష్ణా' వివాదంపై బ్రిజేష్‌ ట్రైబ్యునల్‌లో విచారణ

6 Apr, 2016 18:39 IST|Sakshi

ఢిల్లీ: కృష్ణా జలాల వివాదంపై బ్రిజేష్‌ కుమార్‌ ట్రైబ్యునల్‌లో బుధవారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా కర్ణాటకకు చెందిన న్యాయమూర్తిని ట్రైబ్యునల్‌లో నియమించడంపై అభ్యంతరం లేదని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసినట్టు తెలిసింది. అయితే ఈ విషయంలో ట్రైబ్యునలే సమాధానం చెప్పాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కోరినట్టు తెలిసింది. 

ఇదిలా ఉండగా, కర్ణాటక అభ్యంతరాలను బ్రిజేష్‌ కుమార్‌ ట్రైబ్యునల్‌ తోసిపుచ్చింది. ఈ నేపథ్యంలో కర్ణాటక అభ్యంతరాలను పక్కనపెట్టి వాదనలు కొనసాగించాలని కేంద్రం సూచించినట్టు సమాచారం.

>
మరిన్ని వార్తలు