ఒలింపిక్స్ కు అర్హత సాధించిన యాదవ్

13 Sep, 2015 13:16 IST|Sakshi

లాస్ వెగాస్(అమెరికా): ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్ షిప్ లో భారత్ రెజ్లర్ నర్సింగ్ పంచమ్ యాదవ్ కాంస్య పతకం సాధించాడు. 74 కేజీల ప్రిస్టయిల్ విభాగంలో మూడో స్థానంలో నిలిచి ఇండియాకు పతకం తెచ్చిపెట్టాడు.  ఈ మెగా టోర్నిలో పతకం సాధించిన ఏకైక ఆటగాడిగా నిలిచాడు.

అంతేకాదు 2016లో రియోలో జరగనున్న ఒలింపిక్స్ కు అర్హత సాధించాడు. ప్రతి విభాగంలో మొదటి ఆరు స్థానాల్లో నిలిచిన వారికి ఒలింపిక్స్ లో పాల్గొనే అవకాశం కల్పిస్తారు. ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్ షిప్ లో పతకం సాధించడం ద్వారా భార త రెజ్లర్ ఒలింపిక్స్ కు అర్హత సాధించడం ఇదే మొదటిసారి.

>
మరిన్ని వార్తలు