పోరాడి ఓడిన కశ్యప్ 

6 Jun, 2015 21:28 IST|Sakshi

జకర్తా: ఇండోనేసియా ఓపెన్లో తెలుగుతేజం పారుపల్లి కశ్యప్ పోరాటం ముగిసింది. పురుషుల సింగిల్స్ సెమీస్లో కశ్యప్ ఓటమి చెందాడు. క్వార్టర్స్లో ప్రపంచ నెంబర్ వన్ చెన్ లాంగ్ (చైనా)ను ఓడించి సంచలనం సృష్టించిన కశ్యప్.. శనివారం హోరాహోరీగా సాగిన సెమీస్లో 21-12, 17-21, 19-21 స్కోరుతో జపాన్ షట్లర్ కెంటో మొమోట చేతిలో పోరాడి ఓడాడు.

ఆద్యంతం నువ్వా నేనా అన్నట్టు సాగిన సెమీస్ పోరులో కశ్యప్ తొలి గేమ్ను సునాయాసంగా గెల్చుకున్నాడు. కాగా రెండో గేమ్లో కశ్యప్ వెనుకబడటంతో మ్యాచ్ 1-1తో సమమైంది. చివరి, నిర్ణాయక మూడో గేమ్ హోరాహోరీగా సాగింది. కశ్యప్ చివరి వరకు పోరాడినా కొద్దిలో మ్యాచ్ను చేజార్చుకున్నాడు.

>
మరిన్ని వార్తలు