31 ఓవర్లలో జింబాబ్వే స్కోరు 128/4

10 Jul, 2015 18:51 IST|Sakshi

హరారే: మూడు వన్డేల సిరీస్ లోభాగంగా ఇక్కడ భారత్ తో జరుగుతున్న తొలి వన్డేలో జింబాబ్వే 31 ఓవర్లు ముగిసే సరికి నాలుగు వికెట్లు కోల్పోయి 128 పరుగులు చేసింది.భారత్ విసిరిన 256 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన జింబాబ్వే ఆచితూచి  ఆటను కొనసాగిస్తోంది. చిగుంబరా(36), సికందర్ రాజా(29) పరుగులతో క్రీజ్ లో ఉన్నారు.

 

అంతకుముందు సిబందా(20), చిబాబా(3), మసకజ్జా(34), విలియమ్స్(0)లు పెవిలియన్ కు చేరారు. టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 255 పరుగులు చేసింది. అంబటి రాయుడు(124), స్టువర్ట్ బిన్నీ(77) లు ఆదుకుని భారత్ గౌరవప్రదమైన  స్కోరు చేయడంలో తోడ్పడ్డారు.

మరిన్ని వార్తలు