గుండెపోటుతో రైతు మృతి

19 Oct, 2015 15:34 IST|Sakshi

వీణవంక (కరీంనగర్) : సాగులో నష్టపోయిన ఓ రైతన్న అదే ఆందోళనతో గుండెపోటుకు గురై మృతి చెందాడు. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం బొంతుపల్లిలో ఈ ఘటన జరిగింది. బాబు రాజకొమరయ్య (52) రెండేళ్లుగా సాగులో దిగుబడి లేక నష్టపోయాడు. రూ.5 లక్షల వరకు అప్పులు చేయడంతో అవి తీర్చడం తన వల్ల కాదని మానసికంగా కుదేలయ్యాడు. ఈ క్రమంలో కొమరయ్యకు ఆదివారం రాత్రి గుండెపోటు వచ్చింది. కుటుంబ సభ్యులు కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లగా అర్ధరాత్రి మృతి చెందాడు.

మరిన్ని వార్తలు