తీవ్ర అనిశ్చితిలో ఆర్థిక పరిస్థితి: కేసీఆర్‌

7 Dec, 2019 21:40 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తీవ్ర అనిశ్చితిలో ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ లేఖ రాశారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు రావడం లేదని తెలిపారు. ఈ ఏడాది రూ.2957కోట్లు రావాల్సి ఉందని పేర్కొన్నారు. కేంద్ర పన్నుల వాటా గణనీయంగా తగ్గిందని అన్నారు. కాగా అన్ని శాఖల్లో ఖర్చులు తగ్గించుకోవాలని ఆర్థిక మంత్రికి కేసీఆర్‌ సూచించారు. ఈ విషయమై త్వరలో ప్రధానిని కలిసి వివరిస్తానని కేసీఆర్‌ వెల్లడించారు. ఈ నెల 11న జరిగే తెలంగాణ కేబినెట్ సమావేశానికి పూర్తి సమాచారంతో రావాలని ఆర్థిక శాఖ అధికారులను సీఎం కేసీఆర్‌ ఆదేశించారు.

మరిన్ని వార్తలు