-
Summer Special: పిల్లల్లో... వ్యాధి నిరోధకత పెంచండిలా!
వేసవి సెలవలు ఇచ్చేశారు. పిల్లలందరూ ఇంటి దగ్గరే ఉంటారు. ఈ సమయంలోనే వారికి వ్యాధినిరోధక శక్తి అంటే ఇమ్యూనిటీ పెరిగే ఆహారాన్ని అందించడం వల్ల స్కూళ్లు తిరిగి తెరిచి, వర్షాలు పడినా కూడా చిన్నా చితకా వ్యాధులు రాకుండా ఉంటాయి. పిల్లలకు ఎలాంటి ఆహారం అందించాలో తెలుసుకుందాం...సాధారణంగా పోషకాలన్నీ ఉన్న సమీకృత ఆహారం అందించడం వల్ల వ్యాధినిరోధకత పెరుగుతుంది. అందుకు ఏం చేయాలో చూద్దాం...గుడ్డు: కోడిగుడ్డులో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. పిల్లలకు రోజూ ఒక ఉడికించిన గుడ్డు తినిపించాలి. కండరాలు, చర్మం, గుండె ఆరోగ్యానికి గుడ్డు మంచిది. పిల్లల ఎదుగుదలకు అవసరమైన విటమిన్ ఎ, బి2 (రైబోఫ్లేవిన్) కోడిగుడ్డులో లభిస్తాయి.ఆకుకూరలు: ఆకుపచ్చటి ఆకుకూరలు, కొత్తిమీర, పాలకూర, ఈ సీజన్లో సమృద్ధిగా లభించే మునగకాడలు వంటివి తప్పనిసరిగా పెట్టాలి. వీటిలో ఫైబర్తోపాటు ఐరన్, జింక్, మినరల్స్ లభిస్తాయి.పెరుగు, మజ్జిగ: పెరుగులో ప్రొబయోటిక్స్, విటమిన్ బి12 లభిస్తాయి. ఇది పొట్టలో చెడు బ్యాక్టీరియా వృద్ధి చెందకుండా కాపాడుతుంది. ఇమ్యూనిటీని పెంచుతుంది. కాబట్టి పిల్లలు ఇష్టంగా తినేలా ఫ్రూట్ యోగర్ట్, వెజిటబుల్స్ రైతా, బూందీ రైతా రూపంలో ఇవ్వొచ్చు.పసుపు: పసుపులో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలుంటాయి. పిల్లలకు రోజూ ఇచ్చే ఆహారంలో చిటికడు పసుపును చేర్చడం వల్ల ఆస్తమా, అలర్జీకి సంబంధించిన సమస్యలు దరిచేరకుండా ఉంటాయి. పాలల్లో పసుపు వేసి తాగించడం అలవాటు చేయవచ్చు.బాదం, జీడిపప్పు, ఎండుద్రాక్ష, వాల్నట్స్, అప్రికాట్స్ వంటివి ఎక్కువగా తినిపించడం వల్ల మెదడు ఎదుగుదలకు అవసరమైన పోషకాలు లభించడంతో పాటు పిల్లల్లో ఇమ్యూనిటీ పెరుగుతుంది.ఇంకా సీజనల్ ఫ్రూట్స్ అయిన మామిడి, జామ, తాటిముంజలు, సపోటా వంటివి ఇవ్వాలి. పిల్లలకు స్వీట్స్, పంచదార ఎక్కువగా ఉండే ఇతర పదార్థాలైన ఫ్రూట్జ్యూస్లు, చాక్లెట్స్, ΄్యాకేజ్డ్ స్నాక్స్ను ఎక్కువగా తినిపించకూడదు. ఇవి ఇమ్యూనిటీని తగ్గిస్తాయి. ముఖ్యంగా పిల్లలు రోజూ తగినంత నిద్రపోయేలా చూడాలి. గంటసేపైనా బయట ఆడుకునేలా ్రపోత్సహించాలి. ఈ జాగ్రత్తలు పాటించడం మంచిది.ఇవి చదవండి: Health: ఇంతకీ.. పనీర్ స్వచ్ఛమైనదేనా? ఏం కొంటున్నామో! ఏం తింటున్నామో!! -
చిన్నారులు బరువు పెరుగుతున్నారా? అయితే జాగ్రత్త!
మన దేశంలో అప్పుడే పుట్టిన ఆరోగ్యకరమైన పిల్లలు రెండున్నర కిలోల నుంచి 3 కిలోల వరకు బరువుంటారు. పిల్లల బరువు అనేక అంశాల మీద ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు.. తల్లిదండ్రుల జీన్స్, తల్లి ఆహారపు అలవాట్లు, గర్భవతిగా ఉన్నప్పుడు తల్లికి వచ్చిన రుగ్మతలు, తల్లి బరువు వంటి అంశాలపై పిల్లల బరువు ఆధారపడి ఉంటుంది. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటే.. ఎక్కువ తేడా లేకుండా.. ఈ బరువుకు కాస్త అటు ఇటుగా ఉన్న పిల్లలూ ఆరోగ్యంగా పుట్టినట్టే. కొన్ని సూచనలతో చిన్నారులు ఆరోగ్యంగా బరువు పెరుగుతున్నారో లేదో తెలుసుకోవచ్చు. పిల్లలు పుట్టాక మొదటి వారంలో– పుట్టినప్పుడు ఉన్న బరువు కంటే మొదట్లో కాస్త తగ్గుతారు. నిర్దిష్టంగా చెప్పాలంటే మొదటి వారం పదిరోజుల్లో పుట్టిననాటి బరువులో 5 శాతం నుంచి 10 శాతం బరువు తగ్గుతారు. ఇక రెండోవారం నుంచి క్రమేణా బరువు పెరుగుతూపోతారు. మొదటి మూడు నెలల్లో దాదాపు రోజుకు 20 నుంచి 30 గ్రాములు పెరుగుతూ పోతే... మూడు నెలల నుంచి ఆరు నెలల వరకు రోజుకు 10 నుంచి 15 గ్రాముల వరకు పిల్లలు బరువు పెరుగుతారు. ఇలా చూస్తే మొదటి ఐదునెలల్లో పుట్టినప్పటికంటే రెట్టింపు (డబుల్) బరువు, ఏడాదికి మూడు రెట్ల (ట్రిపుల్) బరువు పెరగాలి. కానీ పాపలందరూ ఇలాగే పెరగాలని లేదు. కాస్త అటు ఇటుగా ఉన్నా అది ఆరోగ్యకరమైన బరువే. అయితే ఈ లెక్కకు దూరంగా ఉంటే మాత్రం తగినంత బరువు పెరగడం లేదని అర్థం చేసుకోవాలి. తల్లి నుంచి రెండు రకాల పాలు.. బిడ్డ పాలు తాగేప్పుడు తల్లి నుంచి రెండు రకాల పాలు వస్తాయి. మొదట వచ్చే పాలను ఫోర్ మిల్క్ అంటారు. రెండోసారి పాలను హైండ్ మిల్క్గా పేర్కొంటారు. అంటే ఈ హైండ్ మిల్క్ పాప కాసిన్ని పాలు తాగాక వస్తాయి. నిజానికి ఫోర్ మిల్క్ కంటే.. హైండ్ మిల్క్ చాలా బలవర్ధకమైనవి. బరువు పెరగడానికి ఇవే ఎక్కువగా ఉపయోగపడతాయి. ఇక్కడ ఒక విషయం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఫోర్ మిల్క్ను ప్రసవం కాగానే స్రవించే ముర్రుపాలతో ΄÷రబాటు పడవద్దు. ముర్రుపాలు వేరు, ఫోర్ మిల్క్ వేరు. పుట్టగానే స్రవించే ముర్రుపాలు శిశువుకు చాలా మంచివి. రోగనిరోధకతను ఇస్తాయి. ఫోర్ మిల్క్ అంటే... పాలు పట్టడం మొదలు పెట్టగానే మొదట స్రవిస్తాయి. ఓ పది–పదిహేను గుటకల తర్వాత హైండ్ మిల్క్ స్రవిస్తాయి. తగినంత బరువు పెరగడం లేదంటే.. తల్లి పాలు సరిపోక పోవడం లేదా బిడ్డ సరిగా తాగకపోవడం, బిడ్డ పూర్తిగా తాగకుండా మధ్యలోనే నిద్రపోవడం, పాలు తాగకపోవడానికి కొన్నిసార్లు తల్లి వైపునుంచి, మరికొన్నిసార్లు బిడ్డ వైపు నుంచి కూడా కారణాలు ఉండవచ్చు. తల్లి బిడ్డకు పాలు సరిగా పట్టకపోవడం జరగవచ్చు. పాలు పడుతున్నప్పుడు చిన్నారి దృష్టి పాల నుంచి పక్కకు మళ్లవచ్చు. పాలపీక అలవాటు చేయడం వల్ల చిన్నారులు పాలు సరిగా తాగరు. ఎనీమియా, యూరినరీ ఇన్ఫెక్షన్స్, చెవిలో ఇన్ఫెక్షన్స్, అలర్జీల వంటిఆరోగ్యపరమైన సమస్య ఉన్నా బరువు పెరగకపోవచ్చు. బరువు పెరగడానికి.. రెండు మూడు గంటలకు ఓమారు పాలు పట్టించాలి. ∙ఓ రొమ్ము పట్టించాక ఆ రొమ్ము నుంచి పాలు పూర్తిగా తాగిందో లేదో నిర్ధారణ చేసుకోవాలి. ఇందుకు చేయాల్సింది... బిడ్డ పూర్తిగా పాలు తాగాక చిన్నారికి అదే రొమ్మును అందిస్తే ముఖం తిప్పుకోవడం, రొమ్ము అందుకోకపోవడం చేస్తుంది. ఓ రొమ్ములోని పాలు పూర్తిగా పట్టించాక రెండో రొమ్ము కూడా అందించాలి. అప్పుడు ఆ రెండో రొమ్ము పాలు తాగకపోయినా– బిడ్డ సంతృప్తిగా ఉంటే పూర్తిగా పాలు తాగినట్లే. బిడ్డకు పాలు సరిపోతున్నాయో లేదో తెలుసుకోడానికి రోజులో ఎన్నిసార్లు పక్క తడుపుతోందన్న అంశం కూడా ఓ సూచన. పాప పగటిపూట కనీసం నాలుగయిదుసార్లు పక్క తడుపుతుంటే.. పాలు సరిపోతున్నాయని అనుకోవచ్చు. చికిత్స ఎప్పుడంటే..? పైన పేర్కొన్న అంశాలను జాగ్రత్తగా గమనిస్తూ, పాప బరువును ప్రతివారం పరీక్షిస్తూ ఉండాలి. అప్పటికీ బిడ్డ బరువు వయసుకు తగి నంతగా పెరగడం లేదంటే... ఏవైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయేమో వైద్యపరీక్షల ద్వారా తెలుసుకుని, దానికి అనుగుణంగా చికిత్స అందించాల్సి ఉంటుంది. — డా. శివనారాయణరెడ్డి వెన్నపూస, నియోనేటాలజిస్ట్ అండ్ పీడియాట్రిస్ట్ ఇవి చదవండి: చల్లచల్లని కూల్ కూల్ -
National Deworming Day: చిన్ని బొజ్జలకు కావాలి ఈ రక్ష
నులిపురుగులు చిన్న సమస్య కాదు. అలాగని పెద్ద సమస్యా కాదు. చిన్న పిల్లలను బాధించే చికాకు సమస్య. ఆరోగ్యంగా పిల్లలు ఎదగాలంటే ఆరోగ్యకరమైన జీర్ణ వ్యవస్థ ఉండాలి. మన దేశంలో 65 శాతం మంది చిన్నారులు నులిపురుగులతో బాధ పడుతున్నారు. పూర్వం అమ్మమ్మలు, నానమ్మలు పిల్లల ప్రవర్తనలో మార్పు గమనించి నులిపురుగుల మందు వేసే వారు. ఇప్పుడు తల్లులకు వ్యవధి ఉండటం లేదు. కాని తప్పదు జాగ్రత్త. నులిపురుగులు పిల్లలను బాగా ఇబ్బంది పెడతాయి. అవి కడుపులో ఉన్నాయంటే పిల్లలు మలద్వారం వద్ద దురద ఉందని చెబుతుంటారు. పదేపదే అక్కడ గీరుకునే ప్రయత్నం చేస్తారు. అలాగే ముక్కు ఎక్కువగా దురద పెడుతున్నా ‘కడుపులో నులిపురుగులున్నాయేమో’ అని పెద్దలు అనేవారు. ఇంతకు మునుపు పిల్లలు ఆరుబయలులో విసర్జన చేసేవారు కాబట్టి పెద్దలు నులిపురుగులు గమనించేవారు. ఇప్పుడు ఇళ్లల్లో టాయిలెట్లు వాడి ఫ్లష్ చేయడం వల్ల నులి పురుగులను గమనించే అవకాశం లేదు. పెద్దల కంటే పిల్లలకు నులి పురుగుల బెడద ఎక్కువగా ఉంటుందని గ్రహించాలి. నులి పురుగులంటే? నులి పురుగులు పేగుల్లో చేరి మన ΄ోషకాలను దొంగిలించి తినే పరాన్న జీవులు. వీటివల్ల వచ్చే ఇన్ఫెక్షన్ని ‘అస్కారియాసిస్’ అంటారు, మన దేశంలోదాదాపు 85 శాతం మంది పిల్లల్లో ఈ సమస్య స్పష్టంగా కనిపిస్తోందని ఆరోగ్య సంస్థలు ప్రకటించాయి. నులిపురుగుల వల్ల పిల్లల్లో రక్తహీనత, నీరసం, కడుపులో నొప్పి వంటి అనారోగ్య సమస్యలు కనిపిస్తాయి. అకలి మందగిస్తుంది. ‘మా పిల్లవాడు ఇంతకుముందు బాగా తినేవాడు ఇప్పుడు తినడం లేదు’ అని తల్లులు కంప్లయింట్ చేస్తారు. పిల్లల ఎదుగుదల దెబ్బతింటుంది. కొందరు పిల్లలు నులిపురుగుల వల్ల సరిగా నిద్ర΄ోలేక ఇబ్బంది పడతారు. ఎలా ప్రవేశిస్తాయి? చిన్నపిల్లలు మట్టిలో ఆడుకోవడం సర్వసాధారణం. మట్టిలో ఆడుకొని చేతులు శుభ్రం చేసుకోకుండా తింటే నోటి ద్వారా ΄పొట్ట, పేగుల్లోకి నులి పురుగులు ప్రవేశిస్తాయి. అలాగే బహిరంగ ప్రదేశాల్లో మలవిసర్జన చేయడం, కాళ్లకు చెప్పులు వేసుకోకుండా తిరగడం, వ్యక్తిగత శుభ్రత ΄ాటించక΄ోవడం, దుమ్ము ధూళి చేరిన కలుషిత ఆహారాన్ని తీసుకోవడం వల్ల నులిపురుగుల సమస్య తలెత్తవచ్చు. ఏం చేయాలి? ప్రధానంగా చిన్నపిల్లల చేతి గోళ్లను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచాలి. గోళ్లు కొరికే అలవాటును మాన్పించాలి. ప్రతిరోజూ వేడి చేసి చల్లార్చిన మంచినీటిని మాత్రమే తాగించాలి. వైద్యుల సలహాతో అల్బెండజోల్ మాత్రలు వాడాలి. ప్రకృతి వైద్యంలో ఎనిమా ద్వారా కూడా ఈ నులి పురుగుల బెడద తొలగిస్తారు. కొన్ని సులువైన చిట్కాల ద్వారా కూడా నులిపురుగుల సమస్యను అధిగమించవచ్చు. వెల్లుల్లిలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు అధికంగా ఉండటం వల్ల నులిపురుగులను నివారించడంలో కీలక ΄ాత్ర ΄ోషిస్తుంది. రెండు వెల్లుల్లి రెబ్బలను బాగా దంచి ఆ రసంలో గ్లాసు నీటిని కలిపి తాగించడం ద్వారా కడుపులో నులిపురుగులను నివారించవచ్చు. రెండు లవంగాలను ఒక గ్లాసు నీటిలో వేసి ఆ నీటిని తాగించడం వల్ల కడుపులో నులి పురుగులను నివారించవచ్చు. బొప్పాయి పండును తినిపించడం, సన్నగా ఉండే ఆవాలను వేయించి ΄పొడిచేసి మజ్జిగలో కలిపి తాగించడం వంటి వాటి ద్వారా నులిపురుగుల బెడదను అధిగమించేలా చేయవచ్చు. అన్నింటికీ మించి వ్యక్తిగత పరిశుభ్రతను అలవాటు చేయడం అవసరం. -
Jaipur Literature Festival 2024: చిల్డ్రన్ ఫస్ట్
‘మన దేశంలో అన్నింటికీ కోర్సులు ఉన్నాయి... పేరెంటింగ్కి తప్ప. పిల్లల మానసిక సమస్యల గురించి చాలా తక్కువ పట్టింపు ఉన్న దేశం. పిల్లల్లో మానసిక సమస్యలు అధికంగా ఉన్న దేశం మనదే. పిల్లల గురించిన ఆలోచనే అందరికీ ప్రధానం కావాలి’ అన్నారు జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్లో పాల్గొన్న చైల్డ్ సైకియాట్రిస్ట్లు డాక్టర్ శేఖర్ శేషాద్రి, డాక్టర్ అమిత్ సేన్, పిల్లల మానసిక చికిత్సా కేంద్రం నిర్వాహకురాలు నేహా కిర్పాల్. ఇంకా వారేమన్నారు? ‘మన దేశంలో పదికోట్ల మంది బాల బాలికలు మానసిక సమస్యలతో బాధ పడుతున్నారు. వారిలో కేవలం ఒక్కశాతం మందికి మాత్రమే నాణ్యమైన మానసిక చికిత్స, థెరపీ అందుతున్నాయి. తల్లిదండ్రుల ప్రపంచం, పిల్లల ప్రపంచం వేరు వేరుగా ఉంది. చాలా కుటుంబాలలో సభ్యుల మధ్య కనెక్టివిటీ లేదు. దానివల్ల అనేక సమస్యలు వస్తున్నాయి’ అని తెలిపారు పిల్లల మానసిక ఆరోగ్యరంగంలో పని చేస్తున్న నేహా కిర్పాల్, శేఖర్ శేషాద్రి, అమిత్ సేన్.జైపూర్లో జరుగుతున్న జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్లో ‘రీక్లయిమింగ్ హోప్’ అనే సెషన్లో వీరు పాల్గొన్నారు. చదువుల ఒత్తిడి – ఆత్మహత్యలు పోటీ పరీక్షల ఒత్తిడి పిల్లలను ఆత్మహత్య లకు ఉసిగొల్పుతోంది. రాజస్థాన్లోని ‘కోటా’లో కోచింగ్ సంస్థల వ్యాపారం 12 వేల కోట్లకు చేరుకుంది. ఏటా లక్షమంది విద్యార్థులు అక్కడ జెఇఇ, నీట్ ర్యాంకుల కోసం చేరుతున్నారు. తీసుకున్న ఫీజు కోసం నిర్వాహకులు తల్లిదండ్రులను సంతృప్తిపరచడానికి పిల్లలపై ఒత్తిడి పెంచుతున్నారు. రోజుకు 12గంటల రొటీన్ వల్ల పిల్లలకు కొద్దిగా కూడా రిలీఫ్ లేదు. రోజువారీ పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకున్నవారికి ఒకరకమైన ట్రీట్మెంట్, మార్కులు రాక స్ట్రగుల్ చేస్తున్నవారికి ఒక ట్రీట్మెంట్ ఉంటోంది. పిల్లలు తమ మీద తాము విశ్వాసం కోల్పోతున్నారు. చెప్పుకుందామంటే తల్లిదండ్రుల నుంచి కనీస సానుభూతి దొరకడం లేదు. దాంతో ఆత్మహత్యల ఆలోచనలు, చర్యలు పెరుగుతున్నాయి. పిల్లలకు ఏం కావాలో తెలుసుకోకుండా వారు చదువుకునే గదుల్లో ఫ్యాన్లు తీసేసినంత మాత్రాన ఆత్మహత్యలు ఆగవు. పిల్లలే మనకు ప్రధానం అనుకోక΄ోవడం వల్ల ఈ దారుణ స్థితి ఉంది’ డాక్టర్ అమిత్ సేన్ అన్నారు. ఢిల్లీకి చెందిన ఈ చైల్డ్ సైకియాట్రిస్ట్ పిల్లలకు ఎలాగైనా మానసిక చికిత్స అందించాలని ‘చిల్డ్రన్ ఫస్ట్’ అనే ఆన్లైన్ క్లినిక్ని నడుపుతున్నారు. కాని పల్లెటూరి పిల్లలకు ఇలాంటి సాయం ఉంటుందని కూడా తెలియడం లేదు అని వా΄ోయారాయన. వందమంది పిల్లల్లో ఒక్కరే ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నారు అని తెలిపారు. పరీక్షల మేళాలు జరగాలి ‘పరీక్షలంటే మార్కులు అని పిల్లల బుర్రల్లో ఎక్కించాం. కాని పరీక్ష రాస్తున్నాం అంటే ఏదో ఒకటి నేర్చుకునే అవకాశం వచ్చింది అనే భావన పిల్లల్లో ఎక్కించాలి. నేర్చుకుని, ఆ నేర్చుకున్నది చూపుదాం అని పిల్లలు అనుకోవాలి తప్ప మార్కులు చూపిద్దాం అనుకోకూడదు. నా దృష్టిలో పిల్లలు పరీక్షలు ఎంజాయ్ చేయాలంటే పరీక్షల మేళాలు జరగాలి. మైదానాల్లో రకరకాల పరీక్షలు రాసేందుకు పిల్లలను ఆహ్వానించాలి. అక్కడే ఆ పరీక్షలకు సంబంధించిన మెటీరియల్ ఉంచాలి. పురాణాలు, క్రీడలు, భౌగోళిక ్రపాంతాలు, ఆరోగ్యం... ఇలా అనేక అంశాల మీద పరీక్షలు అక్కడికక్కడ రాయించాలి. దాంతో పరీక్షల భయంపోతుంది’ అన్నారు నిమ్హాన్స్ (బెంగళూరు) సీనియర్ చైల్డ్ సైకియాట్రిస్ట్ శేఖర్ శేషాద్రి. ‘పిల్లలు ఏదైనా సమస్య చెప్పుకోవాలనుకున్నప్పుడు ముగ్గురు వారితో సున్నితంగా వ్యవహరించాలి. ఒకరు కుటుంబ సభ్యులు... రెండు స్కూల్ టీచర్లు... మూడు సమాజం అనే చుట్టుపక్కలవారు, బంధువులు. పిల్లలకు గౌరవం ఇవ్వాలి అని కూడా చాలామంది అనుకోరు’ అన్నారాయన. ‘చైల్డ్ అబ్యూజ్ జరిగినప్పుడు పిల్లలు వచ్చి చెప్పుకుంటే వారిని దగ్గరకు తీసుకోవాల్సిందిపోయి... నువ్వే దీనికి కారణం అని నిందించే స్థితి ఉంది’ అన్నారాయన. కోవిడ్ చేసిన మేలు ‘కోవిడ్ వల్ల తల్లిదండ్రులు, పిల్లలు ఇంట్లో ఎక్కువ రోజులు కలిసి ఎక్కువసేపు గడిపే వీలు వచ్చింది. అప్పటికి గాని మన దేశంలో పిల్లలు, తల్లిదండ్రులు ఒకరికి ఒకరు సంబంధం లేకుండా ఎలా జీవిస్తున్నారో పరస్పరం అర్థం కాలేదు. కోవిడ్ వల్ల బంధాలు బలపడ్డాయి. అది జరిగిన మేలు. అదే సమయంలో పిల్లల మానసిక సమస్యలు, ప్రవర్తనలు తల్లిదండ్రులకు తెలిసి వచ్చాయి. కాని వాటికి సరైన చికిత్స చేయించాలని మాత్రం అనుకోవడం లేదు’ అన్నారు నేహా కిర్పాల్. ఈమె పిల్లల మానసిక చికిత్స కోసం ‘అమాహహెల్త్’ అనే క్లినిక్ల వరుసను నడుపుతున్నారు. ‘పిల్లల మానసిక ఆహ్లాదానికి కళలు చాలా ముఖ్యమని తెలుసుకోవాలి. ఇటీవల పిల్లల మానసిక సమస్యలకు ఆర్ట్స్ బేస్డ్ థెరపీలు బాగా ఉనికిలోకి వచ్చాయి’ అని తెలిపారు వారు. – జైపూర్ నుంచి సాక్షి ప్రతినిధి -
ఈ జంగ్...గిటార్ కింగ్!
ఆ కుర్రవాడు సరదాగా గిటార్ వాయించడం మొదలుపెట్టాడు. ఆస్ట్రియాకు చెందిన థామస్ లీబ్, ఇంగ్లండ్కు చెందిన మార్టిన్ టేలర్... వీరంతా ఆ కుర్రవాడి గిటార్ ప్రదర్శన యూట్యూబ్లో చూసి ‘ఆసమ్’ అంటూ చప్పట్లు కొట్టారు. వినసొంపైన అతడి గిటార్ విన్యాసం ప్రపంచాన్ని సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది... తన శరీరంతో సమానంగా ఉన్న గిటార్తో ప్రపంచాన్ని సమ్మోహనపరచిన ఆ వ్యక్తి పేరు సుంఘాజంగ్. అతడిని చూసినవారంతా చైల్డ్ ప్రాడిజీ అంటుంటారు. జంగ్ తన గురించి ఇలా వివరించాడు... ‘‘మా నాన్నగారు అప్పుడప్పుడు గిటార్ వాయిస్తుండేవారు. బహుశ అది చూసే నాకు దాని మీద ఆసక్తి కలిగిందో ఏమో, మూడవతరగతి చదువుతున్నప్పు డే, మా నాన్నగారిని గిటార్ నేర్పించమని అడిగాను. ఆయన బేసిక్స్ నేర్పారు. ఆ తరవాత నాకు నేనుగా నేర్చుకున్నాను. మా ఇంట్లో ఉన్న గిటారు చాలా పెద్ద గిటారు కావడం వల్ల వాయించేటప్పుడు చాలా ఇబ్బందిపడేవాడిని. తీగెలను నొక్కుతుంటే చేతులు బాగా నొప్పి చేసేవి. అయినప్పటికీ ఎంతో కష్టపడి పాటలు నేర్చుకునేవాడిని. ఒక పాట పూర్తిగా వచ్చిన వెంటనే మరో పాట వాయించాలనిపిం చేది. అప్పుడే అనుకున్నాను, నేను ఎప్పటికీ గిటార్ని విడిచిపెట్టకూడదని. గిటార్ మీద వచ్చే విదేశీగీతాలు విని వాటినే ప్రాక్టీస్ చేయడం వలన, కొరియన్ పాప్ సాంగ్స్, సింగర్స్ నాకు పెద్దగా తెలియదు. నాకు ఫింగర్స్టయిల్ పాటలే బాగా నచ్చుతాయి. క్లాసికల్ అంతగా ఇష్టపడను. అలాగే లిరికల్ మెలడీ ట్యూన్స్ అంటే చాలా ఇష్టం. బ్రైట్ ట్యూన్స్ కూడా ఇష్టమే. గిటార్ మీద వేరేవాళ్లు వాయించిన మెలోడియస్ ట్యూన్స్ విని నేర్చుకుంటున్నాను. ఈ మధ్యే ‘నైట్ ఫ్లయిట్’ అనే ఆల్బమ్ కంపోజ్ చేసి, యూట్యూబ్లో అప్లోడ్ చేశాను. దానికి పెద్దపెద్ద వారి దగ్గర నుంచి మంచి ప్రశంసలు వచ్చాయి. నేను ప్రతి రోజూ మూడుగంటల పాటు సాధన చేస్తాను. చదువు ప్రధానం కనుక, హోమ్వర్క్ పూర్తయ్యాకే ప్రాక్టీస్ ప్రారంభిస్తాను. ప్రాక్టీస్ చేయనప్పుడు స్నేహితులతో ఆడుకుంటాను. సెల్మా గిటార్ (సెల్మా బ్రాండ్ గిటార్లు తయారుచేసే సంస్థ) కంపెనీ నా వీడియోలు చూసి, నా పాటలను స్పాన్సర్ చేయడానికి ముందుకొచ్చింది. నేను వాయించే పెద్ద గిటార్ చూసి, నా సైజ్కి సరిపడా గిటార్ను తయారుచేసి ఇచ్చారు. కొరియాలో మంచి గిటార్ కళాకారుడిగా పేరు సాధించాలన్నది నా ఆశయం.’’ - డా.వైజయంతి సముద్రమంటే ఇష్టం... కొరియాలో 1996, సెప్టెంబర్ 2వ తేదీన పుట్టిన సుంఘాజంగ్ ఎకోస్టిక్ ఫింగర్స్టయిల్ గిటారిస్ట్. యూట్యూబ్ ద్వారా అత్యున్నతస్థాయికి ఎదిగాడు. మే, 2013 నాటికి ఇతని గిటార్ విన్యాసాన్ని 687 మిలియన్ల మంది వీక్షించారు. 1,950,000 మంది సబ్స్క్రైబ్ చేశారు. అల్టిమేట్ గిటార్.కామ్ పేజీలో అతని ట్యూన్స్ని రింగ్టోన్స్గా డౌన్లోడ్ చేసుకోవడానికి అనువుగా ఉంచారు. యూ ట్యూబ్లో ఇతడికి 15 అవార్డులు వచ్చాయి. ‘పైరేట్స్ ఆఫ్ ద కరీబియన్’ మ్యూజిక్ని కొన్ని మిలియన్లమంది వీక్షించారు. ఏ పాటనైనా కేవలం మూడు రోజులు ప్రాక్టీస్ చేసి, తనకు తానే రికార్డ్ చేసుకుని, యూ ట్యూబ్లో అప్లోడ్ చేస్తాడు. 2010లో నార్షా సోలో ఆల్బమ్కి చేశాడు. ట్రేస్ బండీతో కలిసి అమెరికా, స్కాండినేవియా, జపాన్లలో ప్రదర్శనలిచ్చాడు. ఇప్పటివరకు మొత్తం 18 ఆల్బమ్స్ స్వరపరిచాడు జంగ్. 2010లో ‘పర్ఫెక్ట్ బ్లూ’ 2011లో ‘ఐరనీ’ 2012లో ‘ద డ్యూయెట్స్’ 2013లో పెయింట్ ఇట్ ఇకోయిస్టిక్ అనే ఆల్బమ్లు విడుదల చేశాడు. 2011లో ‘ది సూయిసైడ్ ఫోర్కాస్ట్’ అనే ఒక కొరియన్ సినిమాలో నటించాడు. కొరియన్ టెలివిజన్లో పాపులర్ టీవీ షో అయిన ‘స్టార్ కింగ్’లో ఇతడితో ఇంటర్వ్యూ చేసినప్పుడు... గిటార్ ప్రాడి జీ, అగస్ట్ రష్ ఇన్ కొరియా... అని పిలిచారు. 2007లో సుమారు 50 గంటల క్లాసికల్ గిటార్ లెసన్స్ చెప్పాడు జంగ్. ఈ మధ్యనే డ్రమ్స్, జాజ్, పియానో కూడా నేర్చుకుంటున్నాడు. జంగ్కి సముద్రమంటే చాలా ఇష్టం కావడం వల్ల తన బ్లాగ్కి ‘బ్లూ సీ’ అని పేరు పెట్టుకున్నాడు.
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
గ్రాండ్గా జరిగిన 'డర్టీ ఫెలో' ప్రీ రిలీజ్ ఫంక్షన్
మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణితో సీఎం రేవంత్ భేటీ
సెల్ఫోన్స్ రికవరీలో రెండో స్థానంలో తెలంగాణ
ఫ్లాట్గా ముగిసిన స్టాక్మార్కెట్ సూచీలు
లవ్ ఫర్ లగ్జరీ కార్ : నాగ చైతన్య కొత్త కారు, ధర తెలిస్తే!
ఈ ఫోటోలో వ్యక్తి కనబడుట లేదు: జోగి రమేష్
Sushmita Sen Throwback Photos: అందానికి పట్టాభిషేకం.. మిస్ యూనివర్స్గా 'సుస్మితా సేన్' 30 ఏళ్ల నాటి ఫోటోలు
పెళ్లిరోజు గిఫ్ట్తో రూ.8.2 కోట్లు సంపాదించిన భార్య
ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ భద్రతా చర్యలపై చర్చ
మిస్సవుతున్నందుకు బాధగా ఉంది.. సుధీర్ బాబు ట్వీట్!
తప్పక చదవండి
- మాజీ జడ్జి గంగోపాధ్యాయ ప్రచారంపై ‘ఈసీ’ బ్యాన్
- IPL 2024: ధోనిని అవమానించిన ఆర్సీబీ ప్లేయర్లు!.. తప్పు ‘తలా’దేనా?
- కెనడాలో భారతీయ విద్యార్థుల నిరసన.. ఎందుకంటే?
- Allu Arjun: ఊహించని ప్లేసులో కనిపించిన అల్లు అర్జున్.. ఫొటో వైరల్
- కొన్ని గంటల్లోనే నిర్ణయం వెనక్కి తీసుకున్న బీఐఏఎల్
- T20: ఆస్ట్రేలియా ప్రపంచకప్ జట్టులో కొత్తగా ఇద్దరు.. స్మిత్కు మరోసారి!
- 'ఫ్యామిలీస్టార్'ను వాళ్లు కావాలనే టార్గెట్ చేశారు: ఆనంద్
- బరువు తగ్గాలనుకుంటే..ఆ ఆహారాలకు దూరంగా ఉండాలంటున్న నిపుణులు!
- తెలంగాణ డీజీపీ పేరుతో వ్యాపారవేత్త కూతురికి బెదిరింపులు
- AP: అంతా ప్రీ ప్లాన్డ్గానే.. సిట్ నివేదికలో సంచలన విషయాలు!
Advertisement