-
పోక్సో కేసు.. కర్నూలు కోర్టు సంచలన తీర్పు
కర్నూలు: ఏడేళ్ల బాలికపై జరిగిన అత్యాచార కేసులో కర్నూలు జిల్లా మహిళా స్పెషల్ సెషన్ కోర్టు సంచలమైన తీర్పునిచ్చింది. నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష తోపాటు రూ. 20 వేల రూపాయలు జరిమానా విధించింది. కాగా, 2021, ఆగస్ట 13వ తేదీన కర్నూలు జిల్లా హోళగుంద మండలం బి. హల్లీ గ్రామానికి చెందిన బోయ రంగన్న అనే వ్యక్తి ఈ అత్యాచారానికి పాల్పడ్డాడు. నిందితుడు అత్యాచారం చేసినట్లు దర్యాప్తులో తేలడంతో కోర్టు యావజ్జీవ కారాగార శిక్షవిధించింది . -
నల్లమలలో ఆశల వేట!
మహానంది: నల్లమల.. ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలకు, ప్రకృతి అందాలకు, చారిత్రక విశేషాలకు పెట్టింది పేరు. నంద్యాల నుంచి గిద్దలూరు వెళ్లే ఘాట్రోడ్డులో సర్వనరసింహ స్వామి ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందింది. ఆలయానికి సమీపంలో ఉల్లెడ మల్లేశ్వరస్వామి ఆలయంతో పాటు వజ్రాల వంక ఉంది. వర్షాలు పడితే వంకలో వజ్రాలు దొరుకుతుంటాయని ప్రజల నమ్మకం. దీంతో కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాలతో పాటు గుంటూరు, పల్నాడు, ప్రకాశం జిల్లాల నుంచి వందలాది మంది ప్రజలు తమ అదృష్టాన్ని పరిక్షించుకునేందుకు ఇక్కడికి వస్తున్నారు. తాజాగా వర్షాలు పడుతుండటంతో వజ్రాన్వేషణ సాగుతోంది. విలువైన రాళ్లతో ఆదాయం వజ్రాలు దొరుకుతున్నాయని వస్తున్న వారికి పలు రకాల రంగురాళ్లు దొరుకుతున్నాయి. రంగు రాయి నాణ్యతను బట్టి రూ. 20 వేల నుంచి రూ. లక్ష వరకు వస్తుందని పలువురు చెబుతున్నారు. వారం రోజుల క్రితం గుంటూరు జిల్లాకు చెందిన ఇద్దరికి రూ. లక్ష విలువైన వజ్రాలు దొరికాయని స్థానికులు చెప్పారు. దీంతో ఇక్కడికి వచ్చిన వారు ఉదయం నుంచి చీకటి పడేవరకు వజ్రాన్వేషణ చేసి అనంతరం దగ్గరలోని ఆంజనేయపురం గ్రామం వద్ద ఉన్న ఆంజనేయస్వామి ఆలయం వద్ద రాత్రి వేళల్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇటీవల వర్షాలు కురవడంతో వజ్రాన్వేషణ కోసం వస్తున్నవారి సంఖ్య గణనీయంగా పెరిగింది. -
Kurnool Diamond: కర్నూలు జిల్లాలో రైతుకు దొరికిన వజ్రం
కర్నూలు: తొలకరి చినుకులు పడగానే కర్నూలు జిల్లా మద్దికెర, తుగ్గలి మండలాల్లో వజ్రాల వేట మొదలవుతోంది. దూర ప్రాంతాల నుంచి జనం వచ్చి ఇక్కడ వజ్రాలు వెతుకుతూ తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. రైతులు తమ పొలాలు సాగు చేసేటప్పుడు కూడా వజ్రాలు లభ్యమవుతుంటాయి. శనివారం మద్దికెర మండలం హంప గ్రామంలో ఓ రైతు పొలం పనులు చేస్తుండగా రూ.5లక్షలు విలువైన వజ్రం దొరికింది. అలాగే మదనంతపురం గ్రామానికి చెందిన మరో రైతుకు రూ.15 లక్షలు విలువైన వజ్రం లభించింది. ఈ రెండు వజ్రాలను పెరవలి గ్రామానికి చెందిన వ్యాపారులు కొనుగోలు చేసినట్లు సమాచారం. -
నిమిషం ఆలస్యమైనా అనుమతి లేదు
● నేడు జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష ● జిల్లాలో రెండు పరీక్ష కేంద్రాలు ఎంపిక కర్నూలు సిటీ: జాతీయ స్థాయిలో పేరొందిన విద్యా సంస్థలలో ఇంజినీరింగ్ విద్యను అభ్యసించేందుకు ప్రవేశాల కోసం జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) అడ్వాన్స్డ్ – 2024 పరీక్ష నేడు (ఆదివారం) జరగనుంది. కంప్యూటర్ ఆధారితంగా నిర్వహించనున్న ఈ పరీక్షకు జిల్లాలో రెండు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ పరీక్షకు జిల్లా వ్యాప్తంగా సుమారు వెయ్యి మంది విద్యార్థులు హాజరుకానున్నారు. జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షను మద్రాసు ఐఐటీ నిర్వహిస్తోంది. అభ్యర్థులు పేపర్–1, పేపర్–2 పరీక్షలను కచ్చితంగా రాయాల్సి ఉంటుంది. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 గంటల వరకు రెండు సెషన్లలో పరీక్షలు జరగనున్నాయి. గత రెండేళ్ల కంటే ఈ ఏడాది అధికంగా జేఈఈ మెయిన్స్కు హాజరై మంది అర్హత పొందడంతో అడ్వాన్స్డ్ పరీక్ష రాసేందుకు ఎక్కువ మంది రిజిస్టర్ చేసుకున్నారు. పరీక్ష సమయానికి గంట ముందు నుంచే కేంద్రంలోకి అనుమతించనున్నారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా కేంద్రాల్లోకి అనుమతించరు. పరీక్షకు హాజరు అవుతున్న విద్యార్థులకు కచ్చితంగా డ్రస్ కోడ్ను అమలు చేయనున్నారు. బూట్లు, బంగారు ఆభరణాలు, దుస్తులకు పెద్ద సైజులో బటన్స్ ఉండకూడదు. ఫుల్ స్లివ్ దుస్తులను ధరించరాదు. పరీక్షలో బాల్ పాయింట్ పెన్నును మాత్రమే వినియోగించాలి. పెన్సిల్, ఎరేజర్, సాధారణ చేతివాచీని తెచ్చుకోవచ్చు. ఎలాంటి డిజిటల్ వస్తువులు తెచ్చుకోకూడదు. కేంద్రంలో కేటాయించిన సీటులో కూర్చున్న తరువాత అడ్మిట్కార్డులోని పేరు, పేపర్, పుట్టిన తేదీ, జెండర్ వంటి వివరాలను చెక్ చేసుకోవాలి. -
డిగ్రీ సెమిస్టర్ పరీక్షలకు 90 శాతం హాజరు
కర్నూలు కల్చరల్: రాయలసీమ విశ్వవిద్యాలయం పరిధిలో నిర్వహిస్తున్న డిగ్రీ సెమిస్టర్ పరీక్షల్లో భాగంగా శనివారం జరిగిన పరీక్షలకు 90 శాతం మంది విద్యార్థులు హాజరైనట్లు వర్సిటీ కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు. ఉదయం సెషన్లో జరిగిన డిగ్రీ రెండవ సెమిస్టర్ పరీక్షలకు 8,435 మందికి గాను 7,621 మంది, మధ్యాహ్నం సెషన్లో జరిగిన ఆరవ సెమిస్టర్ పరీక్షలకు 466 మందికి గాను 418 మంది విద్యార్థులు హాజరయ్యారని పేర్కొన్నారు. ఎమ్మిగనూరు సిద్దార్థ డిగ్రీ కళాశాలలో ఇద్దరు, నంద్యాల పీఎస్సీ అండర్ కేవీఎస్సీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఒకరు చొప్పున మొత్తం ముగ్గురు విద్యార్థులు చూచిరాతకు పాల్పడగా డిబార్ చేసినట్లు తెలిపారు. ఇంటర్లో ఇద్దరు డిబార్ కర్నూలు సిటీ: ఇంటర్మీడియెట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలో మాస్ కాపీయింగ్కు పాల్పడుతున్న ఇద్దరు విద్యార్థులు డిబార్ అయ్యారు. కర్నూలు నగరంలోని ప్రభుత్వ ఒకేషనల్ జూనియర్ కాలేజీలో శనివారం జరిగిన పరీక్షకు ఓ కార్పొరేట్ కాలేజీకి చెందిన ఇద్దరు విద్యార్థులు మాస్ కాపీయింగ్ పాల్పడుతుండగా చీఫ్ సూపరింటెండెంట్ గమనించి డిబార్ చేశారు. జిల్లా వ్యాప్తంగా ఫస్ట్ ఇయర్ పరీక్షకు 9,288 మంది విద్యార్థులకు గాను 8,970 మంది హాజరుకాగా, 315 మంది గైర్హాజరయ్యారు. సెకండ్ ఇయర్ పరీక్షకు 906 మందికి గాను 830 మంది హాజరు కాగా, 76 మంది గైర్హాజరైయినట్లు ఇంటర్మీడియెట్ ప్రాంతీయ కార్యాలయ అధికారి గురువయ్య శెట్టి తెలిపారు. టెన్త్ పరీక్షలకు 67 శాతం గైర్హాజరు.. పదవ తరగతి సప్లిమెంటరీ పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా 1,151 మంది విద్యార్థులకు గాను కే వలం 378 మంది మాత్రమే హాజరయ్యారు. 773 మంది గైర్హాజరు కావడం గమనార్హం. పరీక్షకు రిజిస్టర్ చేసుకున్న వారిలో 67 శాతం మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. డీఈఓ కె.శామ్యూ ల్ నాలుగు కేంద్రాలు, ఫ్లయింగ్ స్క్వాడ్ 16 కేంద్రాలను తనిఖీ చేశారు. ఎటువంటి మాల్ ప్రాక్టిస్ కేసులు నమోదు కాలేదని డీఈఓ తెలిపారు. దేవనకొండలో 62.2 మి.మీ వర్షపాతం కర్నూలు(అగ్రికల్చర్): జిల్లాలో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. మే నెల సాధారణ వర్షపాతం 40.1 మి.మీ ఉండగా 25 రోజుల్లోనే 97 మి.మీ వర్షపాతం నమోదైంది. 142 శాతం అధిక వర్షపాతం నమోదు కావడం విశేషం. శుక్రవారం సాయంత్రం నుంచి శనివారం ఉదయం వరకు 18 మండలాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిశాయి. అత్యధికంగా దేవనకొండలో 62.2 మి.మీ, అత్యల్పంగా కోడుమూరులో 0.4 మి.మీ వర్షం కురిసింది. చిప్పగిరిలో 42.8 మి.మీ, గోనెగండ్లలో 42.6, తుగ్గలిలో 42.4, క్రిష్ణగిరిలో 29.2, కర్నూలు అర్బన్లో 23.4, మద్దికెరలో 23.2, పత్తికొండలో 22.6, వెల్దుర్తిలో 20.2 మి.మీ వర్షపాతం నమోదైంది. కల్లూరు, కర్నూలు రూరల్, సీ.బెళగల్, ఆస్పరి, ఎమ్మిగనూరు తదితర మండలాల్లో ఒక మోస్తరు వర్షాలు కురిశాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రానున్నరోజుల్లో కూడా వర్షాలు పడే అవకాశం ఉంది. ఎన్నికల విధులకు నలుగురుపోలీసుఅధికారులు కర్నూలు (టౌన్ ): సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో డీజీపీ కార్యాలయం ఉమ్మడి జిల్లాకు నలుగురు పోలీసు అధికారులను నియమించింది. ఈ మేరకు శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. సీఐడీ విభాగంలో డీఎస్పీలు కె. సాయి ప్రసాద్, కేటీటీవీ. రమణరావు, షేక్ అబ్దుల్ కరీమ్తో పాటు ఏసీబీ విభాగంలో అడిషనల్ ఎస్పీ దేవప్రసాద్ను నియమించారు. కర్నూలు, నంద్యాల జిల్లా ఎస్పీలకు రిపోర్టు చేసుకోవాలని ఉత్తర్వులో వారికి సూచించారు. -
వావ్.. బసవా
● రూ.15 లక్షలు పలికిన ఎద్దుగోనెగండ్ల: సాధారణంగా ఒక ఎద్దు విలువ రూ.30 వేల నుంచి రూ.60 వేల వరకు పలుకుతుంది. కాని ఏకంగా గోనెగండ్ల మండలం చిన్న నేలటూరు గ్రామంలో ఓ ఎద్దు ధర రూ.15 లక్షలు పలికింది. ఇది జిల్లాలోనే అత్యధిక ధరగా ప్రజలు చర్చించుకుంటున్నారు. గ్రామానికి చెందిన గాజుల కుమారస్వామి, గాజుల అమరేశ్వరప్పకు చెందిన వృషభాలు రాష్ట్రంలో ఎక్కడ బండలాగుడు పోటీలు జరిగినా బరిలో నిలుస్తాయి. ఈ ఎద్దులకు ఈ ప్రాంతంలో మంచి క్రేజ్ ఉంది. ఇందులో ఒక ఎద్దును శనివారం అనంతపురం జిల్లా ఏ. నారాయణపురం గ్రామానికి చెందిన షేక్ నజీర్ బాషా రూ.15 లక్షలకు కొనుగోలు చేశాడు. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఆ ఎద్దును చూసేందుకు బారులుదీరారు. -
సమస్యాత్మక ప్రాంతాలపై నిఘా
కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తి చేయండి సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్కు నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లన్నీ ఈనెల 28వ తేదీలోపు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి/కలెక్టర్ డాక్టర్ జి.సృజన అధికారులను ఆదేశించారు. శనివారం సాయంత్రం ఆర్వోలు, ఏఆర్వోలు, కౌంటింగ్ నోడల్ అధికారులు, స్పెషల్ ఆఫీసర్లతో ఆమె టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కౌంటింగ్ కేంద్రాల హాళ్లలోని లోపల, బయట చేపట్టే అన్ని రకాల ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయాలన్నారు. పోలీసులతో సమన్వయం చేసుకొని ఏజెంట్లను గుర్తించే ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేయాలన్నారు. అలాగే మొబైల్ డిపాజిట్ సెంటర్, లంచ్ టెంట్లను కూడా ఏర్పాటు చేయాలని డీఆర్వో, ఆర్అండ్బీ ఎస్ఈలను ఆదేశించారు. జూన్ 3వ తేదీన జిల్లా ట్రెజరీ నుంచి పోస్టల్ బ్యాలెట్లను రాయలసీమ యూనివర్సిటీకి తరలించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. టెలీ కాన్ఫరెన్స్లో ఆర్వోలు నారపురెడ్డి మౌర్య, భార్గవ్తేజ, శివ్నారాయణ్ శర్మ పాల్గొన్నారు. కర్నూలు(సెంట్రల్): జూన్ 4వ తేదీన జరిగే పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, అల్లర్లు, ఘర్షణలు చోటు చేసుకోకుండా పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి/కలెక్టర్ డాక్టర్ జి.సృజన పోలీసులకు సూచించారు. ఇంటలిజెన్స్ హెచ్చరికల నేపథ్యంలో పోలీ సులు అప్రమత్తంగా ఉండి ప్రశాంతం వాతావరణం నెలకొల్పేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. శనివారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాలులో కౌంటింగ్ రోజున చేపట్టాల్సిన భద్రత పరమైన అంశాలపై చర్చించేందుకు కలెక్టర్ అధ్యక్షతన జిల్లా భద్రతా ప్రణాళిక కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా ఎస్పీ జి.కృష్ణకాంత్తోపాటు అన్ని నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో మే 13వ తేదీన ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరిగిందని, ఇందుకు పోలీసుల కృషియే కారణమని ఎస్పీ జి.కృష్ణకాంత్ను అభినందించారు. ఇదే స్ఫూర్తితో కౌంటింగ్ రోజున జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు సమన్వయంతో పనిచేయాలని కోరారు. ముందుగా గత ఎన్నికల సమయాల్లో అల్లర్లు జరిగిన సున్నతమైన ప్రాంతాలను గుర్తించి అక్కడ పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేయాలన్నారు. మండల హెడ్ క్వార్టర్స్లో ఎగ్జిక్యూటీవ్ మెజిస్ట్రేట్ అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. కౌంటింగ్ నిబంధనలు, నియమాలపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించి అవగాహన కల్పించాలని ఆర్వోలను ఆదేశించారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. పోలింగ్ రోజున జరిగిన సంఘటనల ఆధారంగా జిల్లాలో మొత్తం 188 సున్నితమైన ప్రాంతాలు గుర్తించి పోలీసు పికెట్ ఏర్పాటు చేశామన్నారు. కర్నూలు, ఎమ్మిగనూరు, ఆదోని, పత్తికొండ పట్టణాల నుంచి రాయలసీమ యూనివర్సిటీకి వచ్చే రహదారుల్లో 31 చెక్ పోస్టులను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. బాణసంచా పేల్చేందుకు అనుమతి లేదని, కౌంటింగ్ రోజున వాటిని విక్రయించడానికి వీలులేదని గోడౌన్ యజమానులను ఆదేశించినట్లు చెప్పారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీలు ఎన్.నాగరాజు, నాగబాబు, పోలీసు అధికారులు పాల్గొన్నారు. కౌంటింగ్ రోజు అల్లర్లు, ఘర్షణలను అడ్డుకోండి జిల్లా భద్రతా ప్రణాళిక కమిటీ సమావేశంలో జిల్లా ఎన్నికల అధికారి సృజన -
No Headline
కొత్త మొక్కలుగానే.. ● 50 ఏళ్ల వయస్సు పైబడి కాపునకు రాని చెట్లతో పాటు కొత్త తోటల్లోని పనికిరాని చెట్ల పునరుద్ధరణకు ఈ పద్ధతి ఎంతో ఉపయోగం. ● చెట్లను పూర్తిగా తొలగించకుండా భూమికి మీ టరున్నర ఎత్తు వరకు కొమ్మలను తొలగించాలి. ● కొమ్మలు తొలగించిన తర్వాత నీళ్లు కడితే సెప్టెంబర్, అక్టోబరు నెలలకు కొత్త చిగుళ్లు వస్తాయి. ● ఆ సమయంలో రైతుకు ఏ మామిడి రకంపై ఆసక్తి ఉందో ఆ రకం చెట్టులోంచి 15 నుంచి 20 చిన్న, చిన్న అంట్లు సిద్ధం చేసుకోవాలి. ● వీటి ఆకులను తొలగించి ఆరు రోజులకు కొత్త చిగుళ్లు వచ్చిన కొమ్మలపై పెన్సిల్ సైజులో రంధ్రాలు వేసి అంట్లను అందులో గ్రాపింగ్ చేసుకోవాలి. ● నాటిన కొద్ది రోజులకే చిగుళ్లు వస్తాయి. ఎక్కడైతే నాటామో అక్కడి నుంచే పెరుగుదల మొదలవుతుంది. ● కొత్తగా నాటిన మొక్కల తరహాలో ఇవి కూడా పెరుగుతాయి. అంటుకట్టు పద్ధతితో అభివృద్ధి చెందిన మామిడిఅంటుకట్టు పద్ధతి ద్వారా వచ్చిన కొమ్మలు -
వైద్యుల నిర్లక్ష్యంతోనే చనిపోయాడు
కర్నూలు(హాస్పిటల్): నగరంలోని కిమ్స్ హాస్పిటల్ వైద్యుల నిర్లక్ష్యం వల్లే తన కుమారుడు చనిపోయాడని రిటైర్డ్ ఉద్యోగి డి.పి. స్వామన్న వాపోయారు. న్యాయం కోసం ఆసుపత్రి యాజమాన్యం చుట్టు తిరిగినా పట్టించుకోవడం లేదని అధికారులు స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘కుమారుడు డి. సురేష్బాబు(50)ను 3వ తేది రాత్రి 9 గంటల సమయంలో స్పృహలేని పరిస్థితిలో చికిత్స నిమిత్తం కిమ్స్ ఆసుపత్రిలో చేర్చాను. అతనికి సిటీ స్కాన్, ఎక్స్రే తదితర పరీక్షలన్నీ చేశారు. అందులో ఊపిరితిత్తులకు జబ్బు ఉందని, వెంటనే ఊపిరితిత్తుల నిపుణులు డాక్టర్ వెంకటచలమయ్యను పిలిపిస్తామని, అందుకు ఫీజు రూ.8,250 అవుతుందంటే వెంటనే చెల్లించా. మెడిక ల్ ఐసీయూలో ఉంచి కుటుంబసభ్యులను ఎవ్వరినీ రానివ్వలేదు. మరునాడు (4వ తేది)ఉదయం10 గంటల వరకు కూడా నా కుమారుడిని చూసేందు కు డాక్టర్ వెంకటచలమయ్య రాలేదు. కానీ మందు లు మాత్రం తెప్పిస్తూనే ఉన్నారు.చివరకు నా కుమారుడు చనిపోయాడని ముగ్గురు డాక్టర్లు వచ్చి చెప్పారు’అని ఆవేదన వ్యక్తం చేశారు. వస్తానన్న డాక్టర్ వెంటనే రాకపోవడం, వైద్యులు సరిగా స్పందించకపోవడమే సురేష్బాబు మృతికి కారణమని ఆరోపించారు. ఈ విషయమై ఆసుపత్రి సీఈఓ సునీల్ను ‘సాక్షి’ వివరణ కోరగా రోగి ఆసుపత్రికి వచ్చిన సమయంలోనే సీరియస్ కండీషన్లో ఉన్నట్లు చెప్పారు. అవసరమైన అన్ని రకాల వైద్యసేవలు అందించినా కోలుకోలేక చనిపోయాడన్నారు. ఈ విషయంలో తమ వైద్యుల నిర్లక్ష్యం లేదని వెల్లడించారు. కుమారుడి మృతిపై తండ్రి ఆవేదన బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ -
మధ్యాహ్నం వరకు ఎండ.. సాయంత్రానికి వాన
కర్నూలు(అగ్రికల్చర్): ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. 10 రోజుల తర్వాత శుక్రవారం ఇటు కర్నూలు, అటు నంద్యాల జిల్లాల్లో ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరిగాయి. వడగాలుల తీవ్రత అధికమైంది. ఎండల వేడిమి, ఉక్కపోతతో అల్లాడిన ప్రజలకు సాయంత్రానికి ఉపశమనం దక్కింది. 6 గంటల ప్రాంతం నుంచి కర్నూలు సహా వివిధ మండలాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం కురిసింది. దీంతో వాతావరణం చల్లబడింది. కర్నూలు జిల్లా మంత్రాలయంలో 41.6 డిగ్రీలు, కర్నూలులో 41.4, కౌతాళంలో 41.2 డిగ్రీల ప్రకారం ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నంద్యాల జిల్లా బనగానపల్లిలో 42.2, మిడుతూరులో 41.7, పాణ్యంలో 41.4, డోన్లో 41.1 డిగ్రీల ప్రకారం ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మే నెలలో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. మే నెల సాధారణ వర్షపాతం 40.1 మి.మీ ఉండగా.. 83 మి.మీ వర్షం కురిసింది. 107 శాతం అధిక వర్షపాతం నమోదైంది. సాయంత్రం నుంచి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిశాయి. కర్నూలు నగరంతో పాటు వివిధ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిశాయి. -
సెబ్ అధికారుల స్పెషల్ డ్రైవ్
కర్నూలు: ఇసుక, అక్రమ మద్యం రవాణాపై సెబ్ అధికారులు విస్తృతంగా దాడులు కొనసాగిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా శుక్రవారం కూడా దాడులు నిర్వహించి 26 టన్నుల ఇసుకను స్వాధీ నం చేసుకుని ఒక టిప్పర్, రెండు ట్రాక్టర్లను సీజ్ చేసి రూ.45 వేల అపరాధ రుసుం వసూలు చేశారు. కర్నూలుకు చెందిన విజయ్కుమార్ తడకనపల్లె నుంచి ఇసుక అక్రమంగా కర్నూలులోకి తరలిస్తుండగా తనిఖీ చేసి పట్టుకున్నారు. అలాగే ఉల్చాలకు చెందిన చంద్ర దగ్గర అక్రమంగా నిల్వ ఉంచిన మద్యాన్ని పట్టుకున్నారు. మొత్తం 601 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకుని ఐదుగురిపై కేసు నమోదు చేశారు. అలాగే ఏపీకి చెందిన మద్యం కూడా ఒకరి వద్ద 20 బాటిళ్లు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు కర్నూలు సెబ్ స్టేషన్ సీఐ రాజేంద్రప్రసాద్ తెలిపారు. ఎంటీపీ యాక్ట్కు రిజిస్ట్రేషన్ చేయించాలి కర్నూలు(హాస్పిటల్): జిల్లాలో కాంప్రహెన్సివ్ అబార్షన్ కేర్ (ఎంటీపీ యాక్ట్) రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకోవాలని ఆసుపత్రుల యాజమాన్యాలకు డీఎంహెచ్ఓ డాక్టర్ వై.ప్రవీణ్కుమార్ సూచించారు. శుక్రవారం మెడికల్ కాలేజీలోని ఓల్డ్ లెక్చర్ గ్యాలరీలో కాంప్రహెన్సివ్ కేర్(ఎంటీపీ యాక్ట్), బేటీ బచావో బేటీ పడావో అంశాలపై ప్రైవేటు ఆసుపత్రులు, వైద్యులు, మేనేజర్లకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ మాట్లాడుతూ ఎంటీపీ యాక్ట్ కోసం దరఖాస్తు చేసుకున్న వాటిని జిల్లా స్థాయి కమిటీ ఆమోదం అనంతరం రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ జారీ చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా నిర్వహించాల్సిన రికార్డులు, రిపోర్ట్స్ గురించి వారికి తెలిపారు. అనంతరం బేటీ బచావో బేటీ పడావో నినాదంతో ఆడపిల్లలను పుట్టనిద్దాం.. బతకినిద్దాం, చదివిద్దాం, ఎదగనిద్దాం అని పిలుపునిచ్చారు. ఆడపిల్లల ప్రాముఖ్యతపై అవగాహన కార్యక్రమాలలో ఆసుపత్రులు కూడా భాగస్వాములు కావాలని సూచించారు. కార్యక్రమంలో డీపీఎంవో డాక్టర్ ఉమా, డీఎంఓ నూకరాజు, డెమో ప్రమీలాదేవి, డీపీహెచ్ఎన్ఓ ఇందిర, ఎస్ఓ హేమసుందరం, హెచ్ఈఈఓ శ్రీనివాసు లు, మానిటరింగ్ కన్సల్టెంట్ సుమలత, డిప్యూటీ డెమో చంద్రశేఖర్రెడ్డి, ఎపడమాలజిస్టు వేణుగోపాల్, హెచ్ఈ పద్మావతి, ప్రైవేటు ఆసుపత్రుల వైద్యులు పాల్గొన్నారు. డిగ్రీ సెమిస్టర్ పరీక్షల్లో ఐదుగురు డిబార్ కర్నూలు కల్చరల్: రాయలసీమ విశ్వవిద్యాలయం పరిధిలో నిర్వహిస్తున్న డిగ్రీ సెమిస్టర్ పరీక్షల్లో భాగంగా శుక్రవారం జరిగిన పరీక్షలకు 88 శాతం హాజరు నమోదైనట్లు వర్సిటీ కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు. ఉదయం సెషన్లో జరిగిన డిగ్రీ రెండవ సెమిస్టర్ పరీక్షలకు 3,452 మందికి 3,054 మంది, మధ్యాహ్నం సెషన్లో జరిగిన నాల్గవ సెమిస్టర్ పరీక్షలకు 8,306 మందికి 7,635 మంది విద్యార్థులు హాజరయ్యారన్నా రు. కర్నూలు డిగ్రీ కళాశాల, సెయింట్ జోసఫ్ డిగ్రీ కళాశాల, పత్తికొండ శ్రీ రాఘవేంద్ర డిగ్రీ కళాశాల, ఆళ్లగడ్డ అనంత డిగ్రీ కళాశాల, నంద్యాల ఎస్పీవై రెడ్డి డిగ్రీ కళాశాలల్లో ఒక్కొక్కరు చొప్పున మొత్తం ఐదుగురు విద్యార్థులు చూచిరాతలకు పాల్పడగా డిబార్ చేసినట్లు పేర్కొన్నారు. -
No Headline
కర్నూలు(సెంట్రల్): జూన్ 4వ తేదీన చేపట్టబోయే ఎన్నికల కౌంటింగ్ ఫలితాలను రౌండ్ల వారీగా ఏజెంట్ల సంతకాలు తీసుకున్న తరువాతే ప్రకటించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ జి.సృజన కౌంటింగ్ సిబ్బందికి సూచించారు. శుక్రవారం నగర శివారులోని జీఆర్సీ కన్వెన్షన్ హాల్లో కౌంటింగ్ విధులకు ఎంపిక చేసిన 1,174 మంది సిబ్బందికి హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ ఇచ్చారు. ఇందులో ఉదయం 600 మంది, సాయంత్రం 574 మంది శిక్షణకు హాజరయ్యారు. ఒక్కో సెషన్లో 60 టేబుళ్ల్లను ఏర్పాటు చేసి, టేబుల్కు 10 మంది చొప్పున కౌంటింగ్ సూపర్ వైజర్, కౌంటింగ్ అసిస్టెంట్లు, మైక్రో అబ్జర్వర్లకు శిక్షణ ఇచ్చారు. ఈవీఎంల ఓట్లను ఎలా లెక్కించాలి..పోస్టల్ బ్యాలెట్ ఓట్లను ఎలా లెక్కించాలనే అంశాలపై సుధీర్ఘంగా మాస్టర్ ట్రైనర్లతో శిక్షణ ఇప్పించారు. ఈ కార్యక్రమాన్ని కలెక్టర్ స్వయంగా పర్యవేక్షించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ రాయలసీమ యూనివర్సిటీలో అన్ని నియోజకవర్గాలకు సంబంధించి కౌంటింగ్ ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. ● ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గం కోసం 14, పార్లమెంట్ కోసం 14 టేబుళ్లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఒక్కో టేబుల్కు కౌంటింగ్ సూపర్వైజర్, ఇద్దరు అసిస్టెంట్లు, మైక్రో అబ్జర్వర్ ఉండి ఓట్లను లెక్కించాల్సి ఉంటుందన్నారు. ● పోస్టల్ బ్యాలెట్కు సంబంధించి గెజిటెడ్ ఆఫీసర్ అటెస్టెడ్ చేశారా? లేదా, సంతకం, డిక్లరేషన్, సీరియల్ నంబర్, ఓటరు సంతకం, సీరియల్ నంబర్ మ్యాచ్ అవుతుందా లేదా చూసుకొని వ్యాలిడ్, ఇన్ వ్యాలిడ్గా గుర్తించాలన్నారు. వ్యాలిడ్ బ్యాలెట్లను మాత్రమే లెక్కించాల్సి ఉంటుందన్నారు. ● ఈనెల 27వ తేదీన జరిగే మొదటి ర్యాండమైజేషన్ ద్వారా కౌంటింగ్ సూపర్వైజర్, కౌంటింగ్ అసిస్టెంట్లు ఎవరనేది తెలుస్తుందన్నారు. ● జూన్ 2వ తేదీన జరిగే రెండో ర్యాండమైజేషన్ ద్వారా ఏ అసెంబ్లీకి కేటాయించారో తెలుస్తుందన్నారు. జూన్ 4వ తేదీన ఉదయం 5.30 గంటలకు జరిగే మూడో ర్యాండమైజేషన్ ద్వారా ఏ టేబుల్కు కేటాయించారనే విషయం తెలుస్తుందన్నారు. కౌంటింగ్ రోజున ఉదయం 7 గంటలకే సిబ్బంది కౌంటింగ్ హాళ్లకు చేరుకోవాలన్నారు. ● ఈవీఎంలు, వీవీప్యాట్ యంత్రాల్లో అడ్రస్ ట్యాగ్, పింక్ పేపర్ సీల్, గ్రీన్ పేపర్ సీల్, కౌంటింగ్ ఏ విధంగా చేపట్టాలనే దానిపై పాణ్యం ఆర్వో, జేసీ నారపురెడ్డి మౌర్య, ఆదోని ఆర్వో/సబ్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ, కర్నూలు ఆర్వో/మునిసిపల్ కమిషనర్ భార్గవ్తేజ, టేబులేషన్పై పత్తికొండ ఆర్డీఓ రామలక్ష్మీ, పోస్టల్ బ్యాలెట్ల కౌంటింగ్పై డీఆర్డీఏ పీడీ సలీంబాషా, మైక్రో అబ్జర్వర్ల విధులపై ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ సోమశేఖరరెడ్డి శిక్షణ హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ ఇచ్చారు. ● కార్యక్రమంలో అసిస్టెంట్ ట్రైనీ కలెక్టర్ చల్లా కల్యాణి, డీఆర్వో మధుసూదన్రావు, కోడుమూరు, ఎమ్మిగనూరు, ఆలూరు, మంత్రాలయం ఆర్వోలు ఎం.శేషిరెడ్డి, చిరంజీవి, రామునాయక్, మురళీ పాల్గొన్నారు. స్ట్రాంగ్ రూమ్ల పరిశీలన రాయలసీమ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్లను జిల్లా ఎన్నికల అధికారి/కలెక్టర్ డాక్టర్ జి.సృజన శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కౌంటింగ్ హాళ్ల లోపల, బయట నిర్దేశించిన ఏర్పాట్లను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కౌంటింగ్ కోసం ఏర్పాటు చేయనున్న క్యాబిన్ల నుంచి ఏజెంట్లు సంతకాలు చేయడానికి అనువుగా చర్యలు తీసుకోవాలన్నారు. ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్ల నుంచి కౌంటింగ్ హాళ్లకు ఏజెంట్ల సమక్షంలో తీసుకోచ్చే విధంగా ఏర్పాట్లు చేయాలన్నారు. ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్ల నుంచి కౌంటింగ్ హాళ్లకు, తిరిగి కౌంటింగ్ హాళ్ల నుంచి స్ట్రాంగ్ రూమ్లకు తీసుకెళ్లే సిబ్బందికి టీషర్టుల కొనుగోలు చేయాలని ఆదేశించారు. పార్లమెంట్ ఈవీఎంలను తీసుకొచ్చే సిబ్బందికి తెలుపు, అసెంబ్లీ నియోజకవర్గాల ఈవీఎంలను తీసుకొచ్చే సిబ్బందికి పింక్ రంగు టీ షర్టులను కేటాయించాలన్నారు. కౌంటింగ్ ఏజెంట్లు బ్యాడ్జీలు ధరించేలా చూడాలని ఆమె సూచించారు. రౌండ్ల వారీగా ఫలితాలు ప్రకటించాలి పోస్టల్ బ్యాలెట్లో వ్యాలిడ్, ఇన్ వ్యాలిడ్ ఓట్లను పక్కాగా గుర్తించాలి కౌంటింగ్ సిబ్బంది శిక్షణలో జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ సృజన -
సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం
కర్నూలు సిటీ: ఇంటర్మీడియెట్, పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు శుక్రవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇంటర్ సంప్లిమెంటరీ పరీక్షలకు 57 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సంవత్సర పరీక్షలు, మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 గంటల వరకు ద్వితీయ సంవత్సర పరీక్షలు నిర్వహించారు. ఫస్ట్ ఇయర్ పరీక్షలకు 3,788 మంది విద్యార్థులకు గాను, 3,611 మంది హాజరైయ్యారు. 177 మంది గైర్హాజరయ్యారు. అదే విధంగా సెకండ్ ఇయర్ పరీక్షలకు 980 మంది విద్యార్థులకు గాను 897 మంది హాజరయ్యారు. 83 మంది గైర్హాజరు అయ్యారు. ఆర్ఐఓ గురవయ్య శెట్టి మూడు కేంద్రాలను, డీవీఈఓ జమీర్ పాషా 4, డీఈసీ సభ్యులు పరమేశ్వరరెడ్డి, లాలెప్ప, ప్రభు చరణ్ 4, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు 6, సిట్టింగ్ స్క్వాడ్ 8.. మొత్తం 25 కేంద్రాలను తనిఖీ చేశారు. ● పదవ తరగతి సప్లిమెంటరీ పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా 69 కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొదటి రోజు పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. 5,803 మంది విద్యార్థులకు గాను 4,231 మంది హాజరు కాగా 1,572 మంది గైర్హాజరయ్యారు. ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు 15 పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. జిల్లాలో మాల్ ప్రాక్టిస్ కేసులు నమోదు కాలేదని జిల్లా విద్యాశాఖ అధికారి కె.శామ్యూల్ తెలిపారు. -
నాణ్యత లేకపోతే విత్తన సంస్థలపై చర్యలు
● వేరుశనగ ప్రాసెసింగ్ యూనిట్లను తనిఖీ చేసిన డీఏవో కర్నూలు(అగ్రికల్చర్): వేరుశనగలో నిర్దేశించిన మేర నాణ్యత ప్రమాణాలు లేకపోతే సంబంధింత విత్తన సంస్థలపై చర్యలు తీసుకుంటామని జిల్లా వ్యవసాయ అధికారి (డీఏవో) పీఎల్ వరలక్ష్మి హెచ్చరించారు. సబ్సిడీపై పంపిణీ చేసేందుకు ఉద్దేశించిన వేరుశనగ ప్రాసెసింగ్ ప్రక్రియను గురువారం ఆమె తనిఖీ చేశారు. వేరుశనగ విత్తనం కాయల నాణ్యతను, మొలక శాతాన్ని కూడా పరిశీలించారు. వేరుశనగ విత్తనం కాయలను రాయితీపై పంపిణీ చేసేందుకు వ్యవసాయ శాఖ ఏపీసీడ్స్తో అవగాహన ఒప్పందం కుదర్చుకుంది. ఏపీ సీడ్స్ తెలంగాణలోని మహంకాలేశ్వర అగ్రీటెక్, కర్నూలు జిల్లాలోని శ్రీచక్రసీడ్స్, శ్రీకృష్ణసీడ్స్, శివసాయి సీడ్స్ కంపెనీల్లో వేరుశనగ ప్రాసెసింగ్ ప్రక్రియను కర్నూలు ఏడీఏ సాలురెడ్డి, కల్లూరు ఏవో శ్రీనివాసరెడ్డిలతో కలసి డీఏవో తనిఖీలు నిర్వహించారు. వేరుశనగలో నాణ్యత 100 శాతం ఉండాలని ఏపీ సీడ్స్ జిల్లా మేనేజర్ ధనలక్ష్మిని ఆదేశించారు. కేటాయించిన మేరకు ఆర్బీకేల వారిగా వేరుశనగను సిద్ధం చేయాలని సూచించారు. సీడ్ ప్రాసెసింగ్ యూనిట్లలో వ్యవసాయ విస్తరణ అధికారులు ఉండి నాణ్యతలోపం లేకుండా అనుక్షణం పరిశీలిస్తూ ఉండాలని సూచించారు. జిల్లాకు 13,969 క్వింటాళ్ల వేరుశనగ కేటాయించగా... ఇప్పటి వరకు 3,500 క్వింటాళ్ల వేరుశనగను ఆర్బీకేలకు తరలించినట్లు తెలిపారు. -
పురుషుల్లో శుక్రకణాల సంఖ్య తగ్గిపోతోంది
సంతానలేమి సమస్య కేవలం సీ్త్రలకే కాదు పురుషుల్లోనూ ఉంది. ఈ సమస్యతో బాధపడుతూ మా వద్ద చికిత్సకోసం వచ్చే వారి సంఖ్య ఇటీవల పెరిగింది. పెళ్లయి ఏడాది దాటినా సంతానం కలగలేదంటే భార్యాభర్తలిద్దరూ వైద్యుల వద్దకు వెళ్లి పరీక్ష చేయించుకోవాలి. పురుషునికి వెరికోసి ఏమైనా ఉంటే ఆపరేషన్ చేయించుకుంటే సమస్య తీరుతుంది. భార్యాభర్తలిద్దరూ వేర్వేరు ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తూ నెలలో ఒకటి, రెండుసార్లు కలవడం వల్ల కూడా ఈ సమస్య వస్తోంది. జీన్స్ ప్యాంట్ టైట్గా వేసుకోవడం వల్ల వృషణాలు ఒత్తిడికి లోనై శుక్రకణాలు తగ్గిపోతున్నాయి. – డాక్టర్ కేజీ. గోవిందరెడ్డి, యురాలజిస్టు, కర్నూలు అండాశయంలో గుడ్ల సంఖ్య తగ్గిపోతోంది గతంలో మా వద్దకు వచ్చే పది జంటల్లో ఒకరికి సంతానలేమి సమస్య ఉండేది. కానీ ఇప్పుడు ఆరు జంటల్లో ఒకరికి ఉంటోంది. కెరీర్పై దృష్టి సారించి వివాహం ఆలస్యంగా చేసుకోవడం, వివాహం చేసుకున్నా సంతానం కలగడాన్ని వాయిదా వేసుకోవ డం వల్ల అండంలో నాణ్యత తగ్గిపోతుంది. సాధారణంగా 30 ఏళ్ల తర్వాత అండాశయంలో గుడ్ల నాణ్యత, సంఖ్య తగ్గుతుంది. మారుతున్న జీవనశైలి, వ్యాయామం లేకపోవడం, ఆహారపు అలవాట్ల వల్ల స్థూలకాయం పెరగడం వల్ల అండాల్లో కొవ్వు శాతం ఎక్కువై నాణ్యత దెబ్బతింటోంది. దీనికితోడు హార్మోన్ల అసమతుల్యత కారణంగా నెలసరి సరిగ్గా రాకపోవడం వల్ల సంతానలేమి సమస్య వస్తోంది. వివాహమై ఏడాదైనా పిల్లలు కలుగలేదంటే వైద్యులను కలిసి చికిత్స తీసుకోవాలి. –డాక్టర్ విజయలక్ష్మి దాసరి,గైనకాలజిస్టు, కర్నూలు -
సారా స్థావరాలపై సెబ్ దాడులు
కర్నూలు: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో సారా రవాణా, తయారీ, విక్రయాలపై సెబ్ ప్రత్యేక దృష్టి సారించింది. స్పెషల్ డ్రైవ్ కార్యక్రమంలో భాగంగా ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ రవికుమార్ ఆదేశాల మేరకు గురువారం సెబ్ బృందాలు జిల్లా వ్యాప్తంగా విస్త్రృత దాడులు నిర్వహించారు. కర్నూలు, ఆదోని, ఆలూరు, పత్తికొండ నియోజకవర్గాల పరిధిలోని సారా స్థావరాల్లో దాడులు నిర్వహించి బట్టీలను ధ్వంసం చేసి సారా తయారీకి సిద్ధంగా ఉంచిన బెల్లం ఊటను ధ్వంసం చేశారు. కర్నూలు స్క్వాడ్ ఎస్ఐ వీరస్వామి, కోడుమూరు సెబ్ సీఐ రామాంజనేయులు ఆధ్వర్యంలో జరిపిన దాడులలో వెల్దుర్తి మండలం ఎల్బండ తండాకు చెందిన స్వామినాయక్, రామళ్ళకోటకు చెందిన మద్దిలేటి స్వామిని అదుపులోకి తీసుకుని 25 లీటర్ల నాటుసారాతో పాటు టీవీఎస్ ఎక్సెల్ మోపెడ్ను సీజ్ చేశారు. 480 లీటర్ల నాటుసారా తయారీకి సిద్ధం చేసిన బెల్లం ఊటను ధ్వంసం చేశారు. మొత్తం మూడు కేసులు నమోదు చేసి ఇద్దరిని అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరు పరచగా న్యాయమూర్తి రిమాండ్కు ఆదేశించినట్లు సెబ్ అధికారులు తెలిపారు. సెబ్ సిబ్బంది హనుమంతు, శంకర్నాయక్, గోపాల్ నాయక్, వెంకటరాముడు, బషీర్బాషా, కర్నా తదితరులు దాడుల్లో పాల్గొన్నారు. -
ఎస్ఐ అంటూ వీరంగం
● జిరాక్స్ నిర్వాహకుడిపై దాడి ● పోలీసుల అదుపులో ఇద్దరు బొమ్మలసత్రం: తనకు తాను ఎస్ఐగా చెప్పుకుంటూ ఓ వ్యక్తి ఓ జిరాక్స్ సెంటర్ నిర్వాహకుడిపై దాడి చేసి వీరంగం సృష్టించిన ఘటన గురువారం నంద్యాల పట్టణంలో చోటుచేసుకుంది. తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో ఉదయ్ అనే యువకుడు జిరాక్స్ సెంటర్ను నడుపుతున్నాడు. గురువారం ఉదయం ఇద్దరు వ్యక్తులు వచ్చి జిరాక్స్ చేయాలని, కాపీకి రూపాయి ఇస్తామన్నారు. అంత తక్కువకు తనకు గిట్టుబాటుకాదని ఉదయ్ వారికి తెలిపాడు. దీంతో వారిలో రామకృష్ణ అనే వ్యక్తి ‘నేను ఎస్ఐని.. నాకే ఎదురు చెప్తావా’ అంటూ దుర్భాషలాడుతూ యువకుడిపై దౌర్జన్యానికి పాల్పడ్డాడు. స్థానికుల సమాచారం మేరకు టూ టౌన్ పోలీసులు అక్కడికి చేరుకుని రామకృష్ణను ప్రశ్నించగా పొంతనలేని సమాధానాలు చెప్పడంతో ఇద్దరిని అదుపులోకి తీసుకుని పోలీసుస్టేషన్కు తరలించారు. రామకృష్ణ గతంలో ఓ ప్రభుత్వ రంగ సంస్థలో సెక్యూరిటీగా పనిచేసేవాడని, అక్కడ విధుల నుంచి తొలగించడంతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ తనని తాను ఎస్ఐగా చెప్పుకుంటూ, అనుచరులను ఏర్పాటు చేసుకుని దందాలు చేస్తున్నాడని పోలీసుల విచారణలో తేలింది. బాధిత యువకుడి ఫిర్యాదు మేరకు ఇద్దరి నిందితులపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
తమ్ముడిని చంపిన అన్న
● కల్లందొడ్డి విషయంలో ఘర్షణ కోడుమూరు రూరల్: ఆస్తి విషయంలో వివాదం చెలరేగి సొంత తమ్ముడినే అన్న హత్య చేశాడు. ఈ ఘటన కోడుమూరు మండలంలోని అనుగొండ గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. అన్నదమ్ములైన బోయ భాస్కర్, బోయ వెంకట్రాముడు(30) గతంలోనే ఆస్తులను పంపకాలు చేసుకుని అనుభవిస్తున్నారు. అయితే కల్లందొడ్డి పంపకం విషయంలో బుధవారం రాత్రి వారిద్దరి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో అన్న భాస్కర్ తమ్ముడు వెంకట్రాముడును ఎద్దుల బండికుండే ఇనుప మేడితోక తీసుకుని తలపై బలంగా కొట్టట్టాడు. తీవ్ర గాయాలతో వెంకట్రాముడు అక్కడికక్కడే మృతిచెందాడు. కోడుమూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వెంకట్రాముడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కోడుమూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గురువారం కేసు నమోదు చేశారు. మృతుడికి భార్య శోభతో పాటు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. బోయ భాస్కర్ పరారీలో ఉన్నట్లు ఎస్ఐ బాలనరసింహులు తెలిపారు. -
మంత్రాలయం.. భక్తజనసంద్రం
శ్రీమఠం ప్రాంగణంలో భక్తుల కోలాహలం మంత్రాలయం: ప్రసిద్ధ ఆధ్యాత్మిక కేంద్రం మంత్రాలయం భక్తులతో పోటెత్తింది. వివిధ రాష్ట్రాల నుంచి వేలాదిగా తరలివచ్చి స్వామి సేవలో తరించారు. వేసవి సెలవులు కలిసి రావడం, రాఘవేంద్రుల ప్రత్యే క దినం గురువారం కావడంతో రద్దీ విపరీతంగా పెరిగింది. స్వామి మూల బృందావన దర్శనానికి మూడు గంటల సమయం పట్టింది. తుంగాతీరం, కారిడార్, శ్రీమఠం ప్రాంగణం, ప్రధాన దారులు భక్తులతో కోలాహలంగా మారాయి. రాఘవేంద్రుల దర్శన క్యూలైన్లు, అన్నపూర్ణభోజన శాల, పరిమళ ప్రసాదం కౌంటర్లు భక్తుల తాకిడితో కిక్కిరిశాయి. వసతి నిలయాలు, ప్రైవేటు లాడ్జీలు, హోటళ్లు సందడిగా మారాయి. మఠం మేనేజర్లు శ్రీనివాసరావు, వెంకటేష్ జోషి, ఐపీ నరసింహమూర్తి ఏర్పాట్లను పర్యవేక్షించారు. -
పకడ్బందీగా ‘ఫ్యామిలీ డాక్టర్’
దేవనకొండ: ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహిస్తున్నట్లు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి (డీఎంహెచ్ఓ) డాక్టర్ ప్రవీణ్కుమార్ తెలిపారు. కరిడికొండ గ్రామంలో ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమాన్ని గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం ఆయన వైద్య సిబ్బందితో మాట్లాడారు. రక్తహీనత సమస్యలున్న హై రిస్క్ గర్భిణుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. మహిళలల్లో పోషకాహార లోపం తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆయన వెంట వైద్యాధికారి విజయభాస్కర్, వైద్య సిబ్బంది రంగస్వామి, శ్రీధర్, హనుమంతమ్మ ఉన్నారు. -
ఆ‘శక్తి’ తగ్గిపోయిందా!
● సీ్త్ర పురుషుల్లో సంతానలేమి సమస్యలు ● తీవ్రమైన మానసిక ఒత్తిడే కారణం ● సీ్త్రలలో ఊబకాయం, పీసీఓడీ సమస్యలు ● సంతానం కోసం వైద్యుల వద్ద క్యూ కర్నూలు(హాస్పిటల్): ఆధునిక అలవాట్లు, తీరిక లేని ఉద్యోగాలు, తీవ్ర మానసిక ఒత్తిడి కారణంగా పురుషుల్లో శుక్రకణాల సంఖ్య క్రమంగా తగ్గిపోతోంది. ఫలితంగా సంతానలేమి సమస్యల వారిని తీవ్రంగా వేధిస్తోంది. పెళ్లయి ఎంత కాలమైనా తమకు పిల్లలు కలగడం లేదని వైద్యుల వద్దకు వెళ్లే దంపతుల సంఖ్య ఇటీవల కాలంలో అధికమైంది. 50 ఏళ్ల క్రితం యువతలో శుక్రకణాల సంఖ్య పరీక్ష చేస్తే 50 మిలియన్లు ఉండేవి. కానీ ఇప్పుడు అవి 15 నుంచి 20 మిలియన్లకు పడిపోయాయి. యువతలో శుక్రకణాలు భారీ సంఖ్యలో తగ్గిపోతున్నాయని వైద్యులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికి రెండు తరాల ముందు వారు ఒక్కొక్కరు ఐదారుగురు పిల్లలను ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏడాదికి ఒకరు చొప్పున కనేవారు. కానీ ఇప్పుడు వివాహమై నాలుగేళ్లయినా సంతానానికి నోచుకోవడం లేదు. ఈ మేరకు వైద్యుల చుట్టూ తిరగడం, వారిచ్చిన మందులు మింగడంతోనే సరిపోతోంది. మారిన జీవనశైలి, వాతావరణ కాలుష్యం, ఆహారపు అలవాట్ల కారణంగానే ఈ పరిస్థితి నెలకొన్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఈ క్రమంలో జిల్లాలో వివాహమైన వారిలో 25 నుంచి 30 శాతం మంది దాకా సంతానలేమి సమస్యతో బాధపడుతున్నట్లు వారు పేర్కొన్నారు. సంతానలేమి సమస్య ఒకప్పుడు 10 జంటల్లో ఒక జంటకు ఉంటే ఇప్పుడు ఆరు జంటల్లో ఒక జంటకు ఉంటోంది. సంతానలేమి సమస్యలున్న వారు పెరుగుతుండటంతో డిమాండ్కు అనుగుణంగా కర్నూలు నగరంలో ఫెర్టిలిటీ కేంద్రాలు(సంతాన సాఫల్య కేంద్రాలు) సంఖ్య పెరుగుతోంది. జీవనశైలి మారడంతో ఇబ్బందులు మారుతున్న జీవనశైలి, పాశ్చాత్య పోకడల కారణంగా భారతీయుల్లోనూ సంతానలేమి సమస్యలు అధికమవుతున్నాయి. ఒకప్పుడు జన్యుపరంగా, వంశపారంపర్యంగా సంతానలేమి సమస్యలుండేవి. అది కూడా వెయ్యిలో ఒకరో ఇద్దరో ఇలాంటి ఇబ్బందులతో బాధపడేవారు. కానీ ప్రస్తుతం ప్రతి ఆరుగురు జంటల్లో ఒక జంటను ఈ సమస్య వేధిస్తోంది. ముఖ్యంగా మారిన జీవనశైలి కారణంగా ఆహారపు అలవాట్లు క్రమేపీ మారాయి. సంప్రదాయ ఆహారం స్థానంలో జంక్ఫుడ్, ఫాస్ట్ఫుడ్ను ఇష్టపడుతున్నారు. అందులో వేసే చైనా సాల్ట్, పలు రకాల నిషేదిత రంగులు, వాడిన నూనెను పలుమార్లు వాడటం, ఫ్రిడ్జ్లో నిల్వ చేసిన ఆహార పదార్థాలను మళ్లీ వేడి చేసుకుని తినడం వంటి కారణాల వల్ల సంతానలేమి సమస్యలు వస్తున్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. జంక్ఫుడ్, ఫాస్ట్ఫుడ్ను అధికంగా తీసుకోవడం, రాత్రిళ్లు ఎక్కువసేపు మేల్కోనడం, సరైన నిద్రలేకపోవడం, తీవ్ర మానసిక ఒత్తిడి తదితర కారణాలు సంతానలేమి సమస్యకు కారణాలుగా వారు పేర్కొంటున్నారు. యువతులకు అదో పెద్ద సమస్య యువతుల్లో సంతానలేమి సమస్యకు ప్రధాన కారణంగా పీసీవోడీ అని వైద్యులు చెబుతున్నారు. ఈ సమస్య కారణంగా గర్భాశయంలో నీటిబుడగలు(పీసీవోడీ) ఏర్పడటం వల్ల సంతానలేమికి పెద్ద అడ్డంకిగా మారుతోంది. మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా కొందరు చిన్న వయస్సులోనే రజస్వల అవుతుండగా మరికొందరు పదాహారేళ్లు దాటినా రజస్వల కాని పరిస్థితి నెలకొంది. పీసీవోడీ కారణంగా నెలసరి రావడంలో ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. నెలనెలా నెలసరి కాకపోవడంతో పాటు నెలసరి వచ్చిన సమయంలో తీవ్ర రక్తస్రావం కూడా జరుగుతూ యువతులను ఇబ్బంది పెడుతోంది. మరికొందరికి గర్భాశయంలో సమస్యలు, లోపాలు ఉంటున్నాయి. ఇందులో ప్రధానంగా అండం పెరుగుదల, అండం విడుదల సక్రమంగా లేకపోవడం, అది ప్రయాణించే మార్గం మూసుకుపోవడం, గర్భాశయ గోడలు పిండం ఎదుగుదలకు అనువుగా లేకపోవడం, గర్భాశయ ముఖద్వారం వీర్యకణాలు లోనికి వెళ్లేందుకు అనువుగా లేకపోవడం వంటి కారణాలు ఉన్నాయి. పురుషుల్లోనూ సమస్యలు ఎక్కువే! ఒకప్పుడు సంతానం కలగలేదంటే కేవలం సీ్త్రల వైపు మాత్రమే దృష్టి సారించేవారు. ఎక్కడికి వెళ్లినా ఆమెకే వేధింపులు ఎదురయ్యేవి. మూడు, నాలుగు తరాల క్రితం పిల్లలు కలగడం లేదని ఆత్మహత్య చేసుకున్న మహిళలు కూడా ఉన్నారు. కానీ ప్రస్తుతం పరిస్థితి మారింది. ఆధునిక వైద్యం కారణంగా సీ్త్ర, పురుషులిద్దరికీ పరీక్షలు చేసే వీలు కలిగింది. దీంతో ఎవరిలో లోపం ఉందో ఇట్టే తెలిసిపోతోంది. ఇటీవల కాలంలో పురుషుల్లోనూ వీర్యకణాల సంఖ్య తక్కువగా ఉంటున్నాయి. ఇవి పూర్తిస్థాయిలో లేకపోవడం వల్ల సంతానలేమి సమస్య ఉత్పన్నమౌతోందని వైద్యులు చెబుతున్నారు. వీర్యకణాలు తగ్గడం వల్ల దీర్ఘకాలిక వ్యాధులు, వృషణాల క్యాన్సర్కు దారి తీయడంతో పాటు ఆయువు కూడా తగ్గుతుందని వారు హెచ్చరిస్తున్నారు. దీంతో పాటు వీర్యకణాల కదలిక, సారూప్యంలో అధికంగా తేడాలుండటం, వీర్యకణాలు ప్రయాణించే నాళాలు మూసుకుపోవడం, హార్మోన్ల శాతంలో అసమతుల్యత, ధూమపానం, మద్యపానం, డ్రగ్స్కు అలవాటు పడి ఉండటం, జంక్ఫుడ్ ఎక్కువగా తినడం, నిద్రలేకుండా పనిచేయడం, జన్యుపరమైన లోపాలు, ఎక్కువసేపు కూర్చుని పనిచేయడం వల్ల స్థూలకాయం, ల్యాప్టాప్ ఒళ్లో పెట్టుకుని పనిచేయడం వల్ల అధిక వేడి ఉత్పన్నమై సంతానలేమి సమస్యకు దారి తీస్తోందని వైద్యులు పేర్కొంటున్నారు. ఈ సమస్య ఎక్కువగా సాఫ్ట్వేర్ ఉద్యోగుల్లోనూ కనిపిస్తోందని వారు చెబుతున్నారు. నివారణకు ఇలా చేయాలి వీలైనంత వరకు సంప్రదాయ దుస్తులు ధరించాలి. ఇంట్లో వండిన సంప్రదాయ పిండి వంటలు, ఆహార పదార్థాలను తినాలి. జంక్ఫుడ్, ఫాస్ట్ఫుడ్కు దూరంగా ఉండాలి. గంటల తరబడి ల్యాప్టాప్ను ఒళ్లో పెట్టుకుని పనిచేయకూడదు. బీపీ, షుగర్, థైరాయిడ్ వంటి సమస్యలు ఉంటే నియంత్రణలో ఉంచుకోవాలి. ప్రతిరోజూ సమతుల ఆహారం తీసుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. -
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
ఆళ్లగడ్డ: పట్టణ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. సీఐ రమేష్బాబు తెలిపిన వివరాల మేరకు.. పట్టణంలోని శ్రీనివాసనగర్కు చెందిన ప్రేమ్కుమార్ (25) మాజీ మంత్రి భూమా అఖిలప్రియ కారు డ్రైవర్గా ఉన్నాడు. బుధవారం అర్ధరాత్రి పట్టణ శివారులోని ఓ హోటల్లో భోజనం చేసి తిరిగి బైక్పై ఇంటికి వెళ్తున్న క్రమంలో మహాలక్ష్మి ఫంక్షన్ హాలు సమీపంలో అదుపుతప్పి రోడ్డు డివైర్ను ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ ప్రేమ్కుమార్ను స్థానిక వైద్యశాలకు తరలించగా కోలుకోలేక మృతి చెందాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు. -
దుప్పిపై కుక్కల దాడి
● రక్షించిన అటవీ అధికారులు ఆత్మకూరురూరల్: అరణ్యంలో స్వేచ్ఛగా సంచరించే చుక్కల దుప్పి దారితప్పి జనారణ్యంలోకి వచ్చి ప్రమాదం బారిన పడింది. ఆత్మకూరు అటవీ డివిజన్ పరిధిలోని ముష్టపల్లె గ్రామ శివార్లలోని పంట పొలాల్లోకి గురువారం దారి తప్పిన ఒక పొడ దుప్పి వచ్చింది. ఊర కుక్కలు వెంట పడడంతో ఆ దుప్పి ప్రాణ భయంతో గ్రామంలోకి పరుగులు తీసింది. అప్పటికే కుక్కలు దుప్పి వెనుక భాగంలో గాయపరిచాయి. పారిపోతున్న దుప్పి గ్రామంలోని ఒక బాత్ రూంలోకి జొరబడింది. దీన్ని గమనించిన గ్రామస్తులు బాత్ రూం తలుపు వేసి అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. గ్రామానికి చేరుకున్న అటవీ అధికారులు వన్యప్రాణి వైద్యనిపుణులు అయిన జుబేర్ ఆధ్వర్యంలో సంరక్షణ చర్యలు చేపట్టారు. బైర్లూటిలోని వన్యప్రాణి డిస్పెన్సరీకి తరలించి చికిత్స అందించారు. పరిశీలనలో ఉంచి అడవిలో వదిలేస్తామన్నారు. -
నేటి నుంచి పాలిసెట్ కౌన్సెలింగ్
కర్నూలు సిటీ: పాలిసెట్–2024లో అర్హత సాధించిన విద్యార్థులకు శుక్రవారం నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియను యస్జిపిఆర్ ప్రభుత్వ పాలీటెక్నిక్(బి.తాండ్రపాడు)కాలేజీలో నిర్వహించనున్నట్లు ఆ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ యం.వి.ఎస్.ఎస్.ఎస్ ప్రసాద్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జూన్ 2వ తేదీ వరకు ఆన్ౖలైన్లో https://appolycet.nic.in అనే వెబ్సైట్లో ఫీజులు చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.250, ఓసీ, బీసీ విద్యార్థులు రూ.700 ప్రకారం ఫీజు చెల్లించాలని తెలిపారు. ఫీజు చెల్లించిన విద్యార్థుల విద్యార్హత ధ్రువ పత్రాల పరిశీలన ఈ నెల 27 నుంచి జూన్ 3వ తేదీ వరకు ఉంటుందని, 31 నుంచి జూన్ 5వ తేదీ వరకు కాలేజీ ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చునని పేర్కొన్నారు. జూన్ 5న ఆప్షన్ మార్చుకునే అవకాశం ఉంటుందని, జూన్7న కాలేజీలను కేటాయిస్తారని తెలిపారు. స్పెషల్ క్యాటగిరీ(ఎన్సీసీ, పీహెచ్, క్యాప్, స్పోర్ట్స్) వారికి షెడ్యూల్ ప్రకారం విజయవాడ బెంజి సర్కిల్లోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో కౌన్సెలింగ్ జరుగుతుందన్నారు. విద్యార్హత ధ్రువ పత్రాల పరిశీలన ఇలా.. తేదీ ర్యాంకులు 27 1 నుంచి 12 వేలు 28 12,001 నుంచి 27 వేలు 29 27,001 నుంచి 43 వేలు 30 43,001 నుంచి 59 వేలు 31 59,001 నుంచి 75 వేలు జూన్1 75,001 నుంచి 92 వేలు జూన్2 92,001 నుంచి 1,08,000 జూన్3 1,08,001 నుంచి చివరి ర్యాంకు వరకు -
ఘనంగా జియారత్ వేడుకలు
కౌతాళం: జగద్గురు ఖాదర్లింగ స్వామి ఉరుసులో భాగంగా గురువారం జియారత్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఉదయం దర్గాలో ధర్మకర్త సయ్యద్ మున్నపాషా వుసేని చిష్తీ ఆధ్వర్యంలో ప్రత్యేక ఫాతెహాలు, ప్రార్థనలు చేశారు. ధర్మకర్త ఇంటి నుంచి వచ్చిన గంధంను స్వామి సమాధికి పూశారు. అనంతరం స్థానికంగా ఉన్న పక్కీర్లతో ప్రత్యేక ఖవ్వాలి పోటీలను నిర్వహించారు. పక్కీర్లు విన్యాసాలు అందరిని ఆకట్టుకున్నాయి. అనంతరం బ్యాండు మేళాలు, డప్పు వాయిద్యాల మధ్య వారిని కట్టా వద్దకు ఊరేగింపు తీసుకుని వెళ్లి వదిలి వచ్చారు. సలాముల ఆలపన చేశారు. వేడుకల్లో పలువురు పాల్గొన్నారు.
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
పెళ్లి చేసి పల్లకిలో పంపాలనుకున్నాం.. కానీ : పుణే బాధితులు కన్నీరుమున్నీరు
● జిల్లాలో వరుస చోరీలు ● తాళాలు వేసిన ఇళ్లే టార్గెట్ ● ఆందోళన చెందుతున్న ప్రజలు ● నిఘా పెంచిన పోలీసులు
వసతులు కల్పించాలని హిందూవాహిని వినతి
ఏటా రెండులారీల కోడి ఎరువు
సేంద్రియ ఎరువులకు డిమాండ్
ప్యాసింజర్ రైళ్లు.. నిర్లక్ష్యం ఎన్నేళ్లు?
‘బీజేపీపై బురదజల్లే ప్రయత్నం’
జీవన సాఫల్య పురస్కారం అందుకున్న ‘నలిమెల’
పత్తి విత్తనం.. ధరలకేదీ కళ్లెం?
రైతులకు జీలుగ విత్తనాల కష్టాలు
వామ్మో.. హోటల్ ఫుడ్
తప్పక చదవండి
- పోక్సో కేసు.. కర్నూలు కోర్టు సంచలన తీర్పు
- హై రిటర్న్స్ కోసం ఆశపడితే మీకూ ఇదే జరగొచ్చు..!
- శ్రీదేవికి ఇష్టమైన ఆలయంలో జాన్వీ కపూర్.. ఫోటోలు వైరల్!
- సీఎం రేవంత్పై మంత్రి ఉత్తమ్కు అనుమానం: బీజేఎల్పీ మహేశ్వర్ రెడ్డి
- Anant-Radhika Pre Wedding : ఇటలీకి పయనమైన సెలబ్రిటీలు, ఫోటోలు వైరల్
- IPL 2024: వారికి భారీ నజరానా.. బీసీసీఐ కీలక ప్రకటన
- ఈవీఎం ట్యాంపర్ అయిందా? లేదా?.. చెక్ లిస్ట్తో చూసుకోండిలా..
- గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉపఎన్నిక: కొనసాగుతున్న పోలింగ్
- ఎవరు చంపారు..? ఎందుకీ దారుణం..?
- మౌంట్ ఎవరెస్ట్పై భారీగా ట్రాఫిక్జామ్!
Advertisement