-
లోక్ అదాలత్ సద్వినియోగం చేసుకోవాలి
నారాయణపేట: జాతీయ లోక్ అదాలత్ను జూన్ 8న నిర్వహించనున్నామని.. కక్షిదారులు సద్వినియోగం చేసుకుంటే కేసులు త్వరగా పరిష్కారమై సత్వర న్యాయం అందుతుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి మహ్మద్ అబ్దుల్ రఫీ సూచించారు. శనివారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లా కోర్టులో జరిగిన కో–ఆర్డినేషన్ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొని జిల్లాలోని పోలీస్ స్టేషన్ల పరిధిలో పెండింగ్లో ఉన్న సివిల్, క్రిమినల్, సైబర్ క్రైమ్, హిట్ అండ్ రన్ కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. రాజీమార్గంలో అధిక కేసులను పరిష్కరించాలని, కోర్టులో పెండింగ్లో ఉన్న కేసులను కూడా త్వరితగతిన పరిష్కరించాలని పోలీసు అధికారులను ఆదేశించారు. సుమారు 6,500 కేసుల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. ఈ సందర్భంగా డీఎస్పీ లింగయ్య మాట్లాడుతూ.. 90 శాతం కేసులను రాజీమార్గంలో పరిష్కరించాలని అధికారులకు సూచించారు. సమావేశంలో సీనియర్ సివిల్ న్యాయమూర్తి జి.శ్రీనివాస్, జూనియర్ సివిల్ న్యాయమూర్తి మహ్మద్ ఉమర్, లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సెల్స్ లక్ష్మీపతిగౌడ్, నాగేశ్వరి, జిల్లాకు చెందిన సీఐలు, అన్ని ఠాణాల పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి మహ్మద్ అబ్ధుల్ రఫీ -
No Headline
మరికల్: ఆంధ్రా ప్రాంతానికి చెందిన కొందరు వ్యాపారులు రెండు నెలల క్రితమే కర్ణాటక నుంచి రహస్యంగా నకిలీ పత్తి విత్తనాలు తీసుకొచ్చి గుట్టుగా రైతులకు విక్రయించినట్లు సమాచారం. ప్రతి ఏటా అధికారుల కళ్లుగప్పి రహస్యంగా నకిలీ పత్తి విత్తనాలతో పాటు ప్రమాదకరమైన గ్లైకోసిన్ (కలుపు నివారణ) మందును జిల్లాలో స్థిరపడ్డ ఆంధ్రా వ్యాపారులకు చేరవేస్తున్నారు. వీటిని అదునుచూసి తెలిసిన రైతులకు కిలో లెక్కన అంటగడుతూ దర్జాగా తమ వ్యాపారం సాగిస్తున్నారు. ఇప్పటికే ఈ విత్తనాలు రైతులు కొనుగోలు చేసినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. రాయచూర్ నుంచి.. కర్ణాటకలోని రాయచూర్లో పత్తికి అధిక డిమాండ్ ఉండటంతో అక్కడి వ్యాపారులు నకిలీ పత్తి విత్తనాలు తయారు చేయడంలో ప్రావీణ్యం సాధించారు. ఈ విత్తనాలతో పాటు గ్లైకోసిన్ అనే కలుపు నివారణ మందు కూడా జిల్లాకు దిగుమతి అవుతోంది. ఈ వ్యవహారమంతా మార్చి, ఏప్రిల్ నెలలోనే పూర్తిచేసి ఇక్కడి వ్యాపారులకు అప్పగిస్తారు. రాష్ట్ర సరిహద్దు చెక్పోస్టులో తనిఖీలు సక్రమంగా చేపట్టకపోవడంతోనే జిల్లాకు వస్తున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నారు. విత్తనాలు, కలుపు నివారణ మందులు వచ్చిన వెంటనే ఇక్కడి వ్యాపారులు బైక్లపై తీసుకెళ్లి ఇంతకుముందు విత్తనాలు నాటిన రైతులకు మాత్రమే రహస్యంగా విక్రయిస్తున్నారు. పెట్టుబడి తక్కువ అవుతుందనే ఆశతో ఎక్కువ మంది రైతులు విత్తనాలు నాటి కలుపు నివారణ మందులు పిచికారీ చేసి ప్రమాదకర వ్యాధుల బారిన పడుతున్నారు. -
ఉత్తమ సేవలతోనే గుర్తింపు
నారాయణపేట: పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు జిల్లా పోలీసు యంత్రాంగం నిర్విరామంగా కృషి చేసిందని.. అంకితభావంతో విధులు నిర్తరిస్తే గుర్తింపు లభిస్తుందని ఎస్పీ యోగేష్ గౌతమ్ తెలిపారు. శనివారం జిల్లా పోలీసు అధికారులు, స్పెషల్ పార్టీ, ఎస్బీ, టాస్క్ఫోర్స్ పోలీసులను ఎస్పీ అభినందించి రివార్డులు అందజేసి మాట్లాడారు. సిబ్బంది శాంతిభద్రతలను పరిరక్షిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందించాలని సూచించారు. ఇదే ఉత్సాహంతో బాగా పనిచేసి జిల్లాకు, పోలీసుశాఖకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ నాగేంద్రుడు, ఎస్బీ సీఐ రాంలాల్, సీఐ నర్సింహ, ఎస్ఐలు సునీత, శివశంకర్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ఎస్పీ యోగేష్ గౌతమ్ -
ఆన్లైన్లో దరఖాస్తుల ఆహ్వానం
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: కాన్పూర్, బెంగళూరులలోని భారత వాయుసేన విభాగంలో సంగీతకారుడి నియామకానికి అర్హులైన అభ్యర్థులు ఈనెల 22 నుంచి వచ్చే నెల 5వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని జిల్లా ఉపాధి కల్పన అధికారి మహ్మద్ జానీపాషా ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు http://agnipathvayu.cdac.in ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. 2004 జనవరి 2 నుంచి 2007 జూలై 2 మధ్య జన్మించిన అవివాహిత పురుషులు, మహిళలు అర్హులని పేర్కొన్నారు. తాత్కాలికంగా అడ్మిట్ కార్డు జారీ చేసిన నమోదిత అభ్యర్థులు మాత్రమే రిక్రూట్మెంట్ ర్యాలీలో పాల్గొనేందుకు అనుమతి ఇస్తారని, ముఖ్యంగా రిక్రూట్మెంట్ ర్యాలీ తేదీ, సమయం తాత్కాలిక అడ్మిట్ కార్డులో ఉంటుందని తెలిపారు. -
రహస్య ప్రాంతాల్లో నిల్వచేసి..
ఇక్కడి రైతులకు నకిలీ పత్తి విత్తనాలను మొదట పరిచయం చేసింది ఆంధ్రా వ్యాపారులే. పలు మండల్లాలో స్థిరపడి మూడో కంటికి కనిపించకుండా వ్యాపారం నడిపిస్తున్నారు. వీరు విత్తనాలు, మందులను రహస్య ప్రాంతాల్లో నిల్వచేసి విక్రయాలు చేపడతారు. గతేడాది జిల్లాలోని మరికల్ మండలం ఎక్లాస్పూర్, ధన్వాడ, మక్తల్, ఊట్కూర్, కోస్గి, మద్దూరు తదితర మండలాల్లో టాస్క్ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించగా నకిలీ విత్తనాలతో పాటు నిషేధిత గ్లైకోసిన్ మందు డబ్బాలు భారీగా పట్టుబడ్డాయి. ఇదే సమయంలో కొందరు వ్యాపారులు అనుమానం రాకుండా వీటిని ప్యాకెట్ల రూపంలో కూడా రైతులకు విక్రయించారు. పోలీసులు మరింత లోతుగా విచారణ చేపడితే ఒక్కో గ్రామంలో ఇద్దరు, ముగ్గురు నకిలీ వ్యాపారులు పట్టుబడుతారు. -
నకిలీ ముఠా!
నారాయణపేటఆదివారం శ్రీ 19 శ్రీ మే శ్రీ 2024●ఎక్లాస్పూర్లో ఓ ఇంట్లో పట్టుబడిన గ్లైకోసిన్ మందులు, నకిలీ విత్తనాలు (ఫైల్) ● అదునుచూసి నాటేందుకు సిద్ధమవుతున్న రైతులు ● రాష్ట్ర సరిహద్దులో నిఘా వైఫల్యమే కారణం ● అదే తరహాలో గ్లైకోసిన్ మందు.. ● చక్రం తిప్పుతున్న ఆంధ్రా వ్యాపారులు -
నిర్మాణాల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలి
నారాయణపేట: ప్రభుత్వ పాఠశాలల్లో అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా చేపడుతున్న నిర్మాణాలు నాణ్యతగా చేపట్టాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మయాంక్ మిత్తల్ ఆదేశించారు. శనివారం సాయంత్రం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో సంబంధిత అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మండలాల వారీగా పనుల వివరాలను ఆయా మండలాల ఏఈలను అడిగి తెలుసుకున్నారు. నిర్మాణ పనులను నిర్లక్ష్యం చేయొద్దని.. పాఠశాలలు తెరిచే నాటికి పూర్తి చేయాలన్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న పనుల ఫొటోలను ఎంపీడీఓ గ్రూప్లో నమోదు చేయాలని సూచించారు. గ్రామాల్లో పారిశుద్ధ్య సేవలు మందగించాయని.. దృష్టి సారించాలని కోరారు. రహదారులకు ఇరువైపులా ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాలు తొలగించడంతో పాటు నెలలో మూడుసార్లు ప్రధాన రహదారులను శుభ్రం చేయాలన్నారు. ముఖ్యంగా ఊట్కూర్ నుంచి మక్తల్, నారాయణపేట నుంచి మరికల్ వెళ్లే ప్రధాన రహదారులకు ఇరువైపులా పరిశుభ్రత చర్యలు చేపట్టాలన్నారు. ధన్వాడలో ప్రధాన రహదారి పక్కనున్న పెద్ద డ్రెయినేజీలోని మురుగును పొక్లెయిన్తో తొలగించాలని సూచించారు. దుకాణదారులు వ్యర్థాలను కాల్వలో పడేస్తున్నారని.. వారికి నోటీసులు ఇవ్వాలని, ప్లాస్టిక్ కవర్లను విక్రయించే వ్యాపారులకు జరిమానాలు విధించాలని ఆదేశించారు. ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమంలో ఏమేమి పనులు చేస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. వారం రోజుల్లో గ్రామాలన్నీ స్వచ్ఛంగా మారాలని.. ఎంపీడీఓలు గ్రామాల్లో పర్యటించి పారిశుద్ధ్య పనులను పర్యవేక్షించాలన్నారు. డ్రెయినేజీల నిర్మాణాలు అత్యవసరమైతే వాటికి సంబంధించిన అంచనాలు రూపొందించి పంపించాలని కోరారు. సమావేశంలో జిల్లా పంచాయతీ అధికారి అనిత, డీఆర్డిఓ రాజేశ్వరి, డీఈఓ అబ్దుల్ ఘనీ, పీఆర్ ఈఈ హీర్యానాయక్, విద్యాశాఖ ఎస్ఎంఓ శ్రీనివాస్, అన్ని మండలాల ఎంపీడీవోలు, ఎంపీఓలు, ఏఈలు పాల్గొన్నారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మయాంక్ మిత్తల్ -
రోజు రూ.2 కోట్లకుపైగానే..
ఈ నెల 10 నుంచి 15వ తేదీ వరకు బస్టాండ్లలో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా కనిపించింది. ఈ నెల 12 మినహాయించి మిగతా రోజుల్లో మహబూబ్నగర్ ఆర్టీసీ రీజియన్ నిత్యం రూ.2 కోట్లపైగా ఆదాయం వచ్చింది. ఆర్టీసీ రీజియన్ అధికారులు ప్రజలకు ఇబ్బందులు లేకుండా తగిన చర్యలు తీసుకోవడంతో బస్సులన్నీ ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. ముఖ్యంగా అన్ని డిపోల నుంచి హైదరాబాద్ రూట్లో అధిక ఆదాయం సమకూరింది. ఈ మార్గంలోని బస్సులు ప్రయాణికులతో కనిపించాయి. మహాలక్ష్మి పథకం ప్రయాణికులతోపాటు ఇతరులు అధిక సంఖ్యలో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేశారు. ఈ రోజుల్లో ఆర్టీసీ రీజియన్ మెరుగైన ఆక్యుపెన్షి రేషియోను పొందింది. ఈ ఐదు రోజుల్లో రీజియన్లోని పది డిపోలు 100కుపైగా ఓఆర్ను సాధించింది. -
కల్లాల కథ కంచికేనా..?
ఎన్ఐసీ సాఫ్ట్వేర్లో కానరాని కల్లాల ఆప్షన్ కల్లం లేక నేలపైనే.. వ్యవసాయం చేసే ప్రతి రైతుకు కల్లం ఎంతో అవసరం. సరైన స్థలం లేక నేలపైనే వరి ధాన్యం ఆరబెడుతున్నాం. ఇందుకోసం టార్పాలిన్ కోసం ప్రతి ఏడాది ఖర్చు చేయాల్సి వస్తుంది. ఈ సారి అకాల వర్షంతో తీవ్రంగా నష్టపోయాం. ప్రభుత్వమే కల్లాల నిర్మాణం చేపట్టితే బాగుటుంది. – లక్ష్మయ్య, వర్కూరు గ్రామం, మాగనూర్ మండలం ● మరికొన్ని చోట్ల మధ్యలోనే నిలిచిన నిర్మాణాలు ● రోడ్లపైనే వ్యవసాయ ఉత్పత్తులు ఆరబెట్టుకుంటున్న రైతులు ● ఆకాల వర్షాలతో ఆందోళన మద్దూరు: ఇటీవల కురిసిన అకాల వర్షాలతో జిల్లాలో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ముఖ్యంగా వరి కోతలు పూర్తి చేసినవారు ధాన్యాన్ని ఆరబెట్టుకునేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్ని చోట్ల రోడ్డుపైనే వరిధాన్యం ఆరోబెట్టుకోవడంతో రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో వ్యవసాయ కల్లాల ఆవశ్యకత మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఆరుగాలం కష్టపడి రైతులు పండించిన పంటను ఆరబెట్టేందుకు కల్లాల ఆవశ్యకత ఎంతో ఉంటుంది. దీనిని దృష్టిలో ఉంచుకొని గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఈజీఎస్ నిధులతో సబ్సిడీ అందించి కల్లాల నిర్మాణానికి రైతులను ప్రోత్సహించింది. ప్రారంభంలో రైతులు ఆసక్తి చూపకపోయినా.. ఆ తర్వాత అవసరాల దృష్ట్యా అనేక మంది ముందుకొచ్చారు. అయితే కేంద్ర ప్రభుత్వం ఈజీఎస్లో తెచ్చిన సంస్కరణలతో కల్లాల కథ కంచికి చేరినట్లయింది. కొత్త సాఫ్ట్వేర్లో వీటి నిర్మాణం ఆంశమే లేకుండా పోయింది. గత రాష్ట్ర ప్రభుత్వం ఈజీఎస్ నిధులను కల్లాల నిర్మాణం పేరిట పక్కదారి పట్టించిందని, వాటిని తిరిగి చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరడంతో జిల్లాలో వివిధ దశల్లో ఉన్న కల్లాల నిర్మాణాలు మధ్యలోనే నిలిచిపోయాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విషయంపై స్పష్టత నివ్వకపోవడంతో రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. అకాల వర్షాలతో తడిసి ముద్దవుతున్న ధాన్యం వరి, కంది, పెసర, తదితర వంటలను ఆరబెట్టేందుకు కల్లాలు తప్పనిసరి. గతంలో రైతులు పొలాల్లోనే ఖాళీ ప్రదేశాన్ని చదును చేసి నేలపై పంటలు ఆరబెట్టుకునేవారు. కొంత ధాన్యం మట్టిలో కలిసిపోయి నష్టపోయేవారు. దీనికి తోడు ఆకాల వర్షాలు కురిసిన ప్రతిసారి ధాన్యం తడిసి ముద్దయ్యేది. ఈ పరిస్థితిని గుర్తించిన గత రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి హామీ నిధులు రూ.14.49 కోట్లతో 1,904 కల్లాల మంజూరు చేసింది. వాటిలో కేవలం 151 కల్లాలు మాత్రం పూరి చేశారు. మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయి. గతేడాది కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీలో తీసుకువచ్చిన ఎన్ఐసీ సాఫ్ట్వేర్లో కల్లాల నిర్మాణ పనులకు సంబంధించి ఎలాంటి ఆప్షన్ ఇవ్వలేదు. సొంత ఖర్చులతో నిర్మాణాలు పూర్తి చేసుకున్న వారికే ప్రభుత్వం డబ్బులు చెల్లించింది. వివిధ దశల్లో ఉన్న వాటికి నిర్మాణం బట్టి డబ్బులు చెల్లించినట్లు అధికారులు తెలిపారు. ప్రాథమిక దశలో ఉన్నవాటికి మాత్రం ఒక్క రూపాయి కూడా రాలేదు. పూర్తి స్థాయిలో డబ్బులు రాలేదు అధికారులు చెప్పడంతో కల్లాల నిర్మాణం చేపట్టాం. కల్లం పూర్తి చేసినా పూర్తి స్థాయిలో డబ్బులు రాలేదు. కల్లం నిర్మాణం కోసం వ్యవసాయాధికారులు 6 ట్రిప్పుల ఇసుక కోసం ఆన్లైన్లో డబ్బులు కట్టించారు. ఇప్పటి వరకు డబ్బులు తిరిగి రాలేదు. ఇసుక రాలేదు. అలాగే ర్యాంప్ నిర్మాణం చేయించారు. దాని డబ్బులు కూడా రాలేదు. – ప్రమీల, మహిళా రైతు, దమ్గాన్పూర్, మద్దూరు మండలం ప్రభుత్వాలే నిర్మించాలి వ్యవసాయ రంగంలో కల్లాల అవసరం ఎంతో ఉంటుంది. అలాంటి వాటిని ప్రభుత్వాలే పూర్తి ఖర్చును భరించి రైతులకు నిర్మించి ఇవ్వాలి. పంట ఉత్పత్తులు ఆరబెట్టుకునేందుకు వసతులు లేకపోవడంతో జిల్లాలోని రైతులు ఇబ్బందులకు గురవుతున్నారు. – ఆశప్ప, జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు రైతులకు తప్పని పాట్లు జిల్లాలో వరి పంట అధికంగా సాగు చేస్తారు. ధాన్యంలో ప్రభుత్వం నిర్ణయించిన తేమశాతం వచ్చే వరకు తప్పనిసరిగా ఆరబెట్టాల్సి ఉంటుంది. ఖాలీ ప్రదేశాల్లో ఆరోబోసిన ధాన్యం అకాల వర్షాలతో తడిసిపోతుండటంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటన్నారు. దీంతో చేసేదేమి లేక రోడ్డుపైనే ప్రమాదభరితంగా వరిధాన్యాన్ని ఆరోబోస్తున్నారు. ఇటీవల జిల్లాలో రోడ్డుపైనే ధాన్యం ఆరబోయడంతో తరుచు రోడ్డు ప్రమాదాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. రంగుమారిన, నాణ్యత దబ్బెతిన్న ధాన్యాన్ని కొనేందుకు మిల్లర్లు మొగ్గుచూపకపోవడంతో తప్పని పరిస్థితుల్లో తారురోడ్లే కల్లాలుగా మారిపోయాయి. కల్లాల నిర్మాణానికి రైతులు మందుకువస్తున్నా కొత్త సాఫ్ట్వేర్లో కల్లాల నిర్మాణాలకు సంబంధించిన ఎలాంటి అప్షన్లు లేకపోవడంతో నిరాశ చెందుతున్నారు. -
మైలారం గుట్టపై మైనింగ్ అధికారుల విచారణ
బల్మూర్: మండలంలోని మైలారం గుట్ట వాస్తవ పరిస్థితులపై శుక్రవారం మైనింగ్ అధికారులు మరోసారి విచారణ జరిపారు. ఈ సందర్భంగా మైనింగ్ ఆర్ఐ నాగచైతన్య, సర్వేయర్ సుజాత గుట్టపై కలియతిరిగి అక్కడ సంచరించే నెమళ్లు, గ్రామస్తులకు గుట్ట వల్ల కలిగే వనరులను పరిశీలించారు. గ్రామస్తులతో వారు మాట్లాడి గుట్టపై ఉన్న నివాస గృహాలు మైనింగ్ తవ్వకాల వల్ల కలిగే నష్టంపై అభిప్రాయాలను సేకరించారు. గుట్టపై సమగ్ర వాస్తవాలపై విచారణ జరిపి తమకు నివేదిక అందజేయాలని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు విచారణ చేసినట్లు ఆర్ఐ తెలిపారు. కాగా ఇటీవల గుట్టపై మైనింగ్ తవ్వకాల అనుమతులు రద్దు చేయాలని గ్రామస్తులు పార్లమెంట్ ఎన్నిక పోలింగ్ను బహిష్కరించడంతో రెవెన్యూ అధికారుల నివేదిక ఆధారంగా మై నింగ్ శాఖ వారు రెండోసారి విచారణ జరిపారు. -
నాణ్యమైన విత్తనాలు విక్రయించాలి
మరికల్: వానాకాలం సమీపిస్తున్న తరుణంలో రైతులకు ఫర్టిలైజర్ దుకాణాల్లో నాణ్యమైన విత్తనాలు విక్రయించాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జాన్ సుధాకర్ డీలర్లకు సూచించారు. మరికల్ రైతు వేదికలో శుక్రవారం ఫర్టిలైజర్ డీలర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వానాకాలం సీజన్లో రైతులకు బిజీ–3 పత్తి విత్తనాలను విక్రయించవద్దని తెలిపారు. ఒకవేళ విక్రయిస్తే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. వానలు పడుతున్న నేపథ్యంలో రైతులకు కావాల్సిన అన్ని రకల విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచుకోవాలని వారికి సూచించారు. విత్తనాలు, ఎరువులు పొందిన రైతులకు తప్పకుండా బిల్లులు ఇవ్వాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఏఓ శివకుమార్, ఫర్టీలైజర్ డిలర్లు పాల్గొన్నారు. -
పాఠశాల మరమ్మతులు త్వరగా పూర్తి చేయాలి
ఊట్కూరు: పాఠశాల భవన మరమ్మతు పనులు వెంటనే పూర్తి చెయ్యాలని అడిషనల్ కలెక్టర్ మయాంక్ మిట్టల్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం మండలంలోని చిన్నపొర్లలో ఉర్దూ మీడియం, ఉన్నతపాఠశాల, ప్రాథమిక పాఠశాలలను సందర్శించారు. పాఠశాలలో కొనసాగుతున్న మరమ్మతు పనులను పరిశీలించారు. మరుగుదొడ్లు, స్లాబ్, తాగునీటి వసతి, ఫ్లోరింగ్ తదితర పనులను పరిశీలించి పక్షం రోజుల్లో పనులను పూర్తి చెయ్యాలన్నారు. ఈ పనులకు రూ.7 లక్షలు నిధులు మంజూరయ్యాయని, నాణ్యతతో పనులు చెయ్యాలని ఆదేశించారు. అనంతరం గ్రామశివారులోని నర్సరీని పరిశీలించి వివరాలు ఆరా తీశారు. కార్యక్రమంలో ఎంపీడీఓ ధనుంజయగౌడ్, జగత్చంద్ర, ఎంపీఓ నర్సింహరాజు తదితరులు పాల్గొన్నారు. 21 నుంచి సదరం క్యాంపులు : డీఆర్డీఓజెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): వికలత్వ పరీక్షల కోసం ఈ నెల 21 నుంచి 29 వరకు సదరం క్యాంపులు నిర్వహించనున్నట్లు డీఆర్డీఓ నర్సింహులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇందుకు గాను శనివారం మధ్యాహ్నం ఒంటిగంట నుంచి మీ సేవలో స్లాట్లు బుక్ చేసుకోవాలని సూచించారు. అందులో వచ్చే తేదీ ఆధారంగా జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో నిర్వహించే సదరం శిబిరానికి హాజరుకావాలని సూచించారు. -
చదువుతోపాటు క్రీడలు అవసరం
నారాయణపేట రూరల్: జిల్లా యువజన సర్వీసుల శాఖ ఆద్వర్యంలో జిల్లాలో ఏర్పాటు చేసిన వేసవి క్రీడా శిక్షణ శిభిరాలను సద్వినియోగం చేసుకోవాలని డీఈఓ కార్యాలయ సెక్టోరియల్ అధికారి శ్రీనివాసులు అన్నారు. మండలంలోని జాజాపూర్ జడ్పీస్కూల్ గ్రౌండ్లో నిర్వహిస్తున్న వాలీబాల్ శిబిరాన్ని శుక్రవారం సాయంత్రం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా క్రీడాకారులను పరిచయం చేసుకుని వారితో కలిసి కొంత సమయం ఆటలో పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రతి విద్యార్థి చదువుతో పాటు ఆటలకు సమయం కేటాయించాలన్నారు. క్రీడల వల్ల శారీరక దృఢత్వం, మానసిక ప్రశాంతత లభిస్తుందన్నారు. ఉన్నత విద్య, ప్రభుత్వ ఉద్యోగాల్లో క్రీడా కోటలో సీటు సంపాదించవచ్చన్నారు. మరో 15 రోజుల శిక్షణను సద్వినియోగం చేసుకోవాలన్నారు. శిక్షకులు సైతం నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా తగు విధంగా తర్ఫీదు ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో ఎస్జీఎఫ్ సెక్రెటరీ నర్సింహులు, కోచ్ రమేష్, పీఈటీ సాయినాథ్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. -
డెంగీ నివారణకు కృషిచేద్దాం
నారాయణపేట రూరల్: ప్రాణాంతకమైన డెంగీ వ్యాధి నివారించేందుకు ప్రతి ఒక్కరు కలిసికట్టుగా ముందుకురావాలని డీఎంహెచ్ఓ డాక్టర్ సౌభాగ్యలక్ష్మి అన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో గురువారం జాతీయ డెంగీ నివారణ దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ఆర్డీఓ కార్యాలయం దగ్గర ఆమె జెండా ఊపి అవగాహన ర్యాలీని ప్రారంభించగా వైద్య సిబ్బంది వీరసవార్కార్ చౌరస్తా వరకు నినాదాలు చేస్తూ వెళ్లి అక్కడ ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు తమను తాము శుభ్రంగా ఉంచుకోవడంతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ఎక్కువగా సోకే ప్రమాదం ఉంటుందని, తద్వారా హ్యుమినిటీ పవర్ తగ్గిపోతుందని ఆమె అన్నారు. దోమల నియంత్రణతో చాలా రకాల రోగాలను రాకుండా చర్యలు చేపట్టవచ్చని, ముఖ్యంగా వర్షాకాలంలో ఎక్కువగా విస్తరించే అవకాశం ఉండటంతో ముందస్తుగా జాగ్రత్త చర్యలు చేపట్టాలన్నారు. వ్యాధి సోకిన వారు నిర్ధారణ అయిన వెంటనే అవసరమైన చికిత్సను తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్ఠర్ శైలజ, ప్రోగ్రామ్ అధికారి డాక్టర్ రాఘవేందర్, డాక్టర్ సాయిరాం, డీపీఓ బిక్షపతి, డాక్టర్ బాలాజిరావు, నర్సింహారావు సగరి, శృతి, నవ్యదీప్తి, చందన, విజయ్ప్రకాష్, గోవింద్రాజు, అశోక్ పాల్గొన్నారు. -
పాఠశాలల్లో ప్రగతి పనులు వేగవంతం
నారాయణపేట: జిల్లాలోని అన్ని ప్రభుత్వ ప్రాథమిక, మాద్యమిక, ఉన్నత పాఠశాలల్లో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ఆధ్వర్యంలో చేపట్టిన మౌలిక వసతుల నిర్మాణ పనులను నెలాఖరులోగా పూర్తి చేయాలని కలెక్టర్ కోయ శ్రీ హర్ష సూచించారు. గురువారం కలెక్టరేట్లో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలకు సంబంధించిన అభివృద్ధి నిర్మాణ పనులపై అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. జూన్ 30 లోపు పాఠశాలలో వివిధ నిర్మాణ, అవసరమైన మరమ్మతు పనులను పూర్తి చేస్తే, జూన్ మొదటి వారంలో పాఠశాలలకు రంగులు వేయించాలన్నారు. మరికల్లోని పాఠశాలలను పరిశీలించి, అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు ఎస్టిమేట్ తయారు చేసి ఇవ్వాలని, అలాగే మద్దూరు, కోస్గి మండలాల్లో నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయించాలన్నారు. కేజీబీవీ పాఠశాల ప్రహరీల పనులకు ఊట్కూరు మండలంలోని కొల్లూరు, పెద్దపొర్ల , మొగ్దూంపూర్ పాఠశాలల్లో ప్రతిపాదించిన నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించాలన్నారు. మాగనూర్ మండలంలోని వడ్వాట్ గ్రామ పాఠశాలలో ఎందుకు పనులు నిలిచిపోయాయని ప్రశ్నించారు. సమావేశంలో స్థానిక సంస్థల జిల్లా అడిషనల్ కలెక్టర్ మయాంక్ మిత్తల్, డిఆర్డిఓ రాజేశ్వరి, సిపిఓ జివరత్నం, అడిషనల్ డీఆర్డీఓ అంజయ్య, విద్యా శాఖ అధికారులు శ్రీనివాస్ పాల్గొన్నారు. విద్యార్థులకు యూనిఫామ్లు సిద్ధం చేయాలి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు కొత్త యూనిఫామ్లను తయారు చేయాలని కలెక్టర్ కోయశ్రీ హర్ష సూచించారు. కలెక్టరేట్లో మహిళా సంఘాల ద్వారా స్కూల్ యూనిఫామ్ల తయారీపై డీఆర్డీఏ, విద్యాశాఖ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా బల్క్ క్లాత్ శుక్రవారం వస్తుందని, నెల 20 నుంచి యూనిఫాంల స్టిచ్చింగ్ (కుట్టే) ప్రక్రియను ప్రారంభించాలన్నారు. రోజూ ఎన్ని జతల యూనిఫామ్లు కుట్టారనే వివరాలను ఎప్పటికప్పుడు తెలియజేయాలన్నారు. జిల్లాలోని మహిళా సంఘాలలో ఎంతమంది మహిళా టైలర్లు ఉన్నారు, వారి వద్ద కుట్టు మిషన్లు, సామగ్రి అందుబాటులో ఉందా ఆరా తీశారు. అడిషనల్ డిఆర్డిఓ అంజయ్య, విద్యాశాఖ అధికారి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. వరి ధాన్యం సేకరణ లక్ష్యాన్ని చేరుకోవాలి ప్రభుత్వం జిల్లాకు నిర్దేశించిన వరి ధాన్యం సేకరణ లక్ష్యాన్ని చేరుకోవాలని కలెక్టర్ శ్రీ హర్ష ఆదేశించారు. కలెక్టరేట్లో సివిల్ సప్లై, డీఆర్డిఏ, పిఎస్ఈఎస్, మార్కెటింగ్ శాఖ అధికారులతో మాట్లాడారు. జిల్లాలో వరి కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటి వరకు ఎన్ని మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించారు, ఇంకా ఎంత సేకరించాల్సి ఉందని అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో ఇంకా 4 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని జిల్లా వ్యవసాయ అధికారి జాన్ సుధాకర్ కలెక్టర్కు తెలిపారు. మద్దూరు, కోస్గి మండలాల నుంచి ఇంకా ధాన్యం రావాల్సి ఉందని వ్యవసాయాధికారి తెలిపారు. కొనుగోలు కేంద్రాలకు ఇచ్చిన తేమ శాతం యంత్రాలు, టార్ఫాలిన్లను కేంద్రాలు మూసిన తర్వాత తిరిగి తీసుకోవాలని ఆదేశించారు. రైస్ మిల్లర్ల సీఎంఆర్ లక్ష్యం ఎంత వరకు వచ్చిందని, నిర్లక్ష్యం చేసే రైస్ మిల్లర్లపై చర్యలు తీసుకోవాలని, పది శాతం కంటే తక్కువ ఏసికె ఉన్న రైస్ మిల్లర్లకు నోటీసులు ఇవ్వాలన్నారు. ఈసమావేశంలో సివిల్ సప్లై డిఎం దేవదాస్, డీఎస్ఓ సుదర్శన్, డిఆర్డిఓ రాజేశ్వరి, డీటీ కాళప్పలు పాల్గొన్నారు. కలెక్టర్ కోయ శ్రీహర్ష అమ్మ ఆదర్శ కమిటీలపై సమీక్ష -
4,63,983 మంది ఓటుకు దూరం
మహబూబ్నగర్ న్యూటౌన్: ప్రజాస్వామ్యంలో ఓటు చాలా కీలకమైంది. ఓటు బ్రహ్మాస్త్రంతో దేశ భవితను మార్చే అవకాశముంది. ఓటుతో మంచి నాయకుడిని ఎన్నుకోవడం ద్వారా మన ప్రాంతమే కాకుండా దేశ దశ దిశను మార్చే శక్తి ఓటుకే ఉంది. ఒక్క ఓటు తేడాతో ఓడిన వారి చాలా మందే ఉన్నారు. అందుకే ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలని కేంద్ర ఎన్నికల కమిషన్తో పాటు జిల్లా అధికార యంత్రాంగం విస్తృతంగా చైతన్య కార్యక్రమాలు నిర్వహించారు. ఓటు ప్రాధాన్యతపై పలు స్వచ్ఛంద సంస్థలు అవగాహన కల్పించాయి. పోస్టర్లు, కరపత్రాలు ఆవిష్కరించి పంపిణీ చేశారు. ఈ నెల 13న నిర్వహించిన లోక్సభ ఎన్నికల్లో చాలా మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోకుండా నిర్లక్ష్యాన్ని ప్రదర్శించారు. మహబూబ్నగర్ పార్లమెంట్ పరిధిలో మొత్తం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో 16,82,470 మంది ఓటర్లు ఉండగా, అందులో 12,18,487 మంది తమ ఓటుహక్కును వినియోగించున్నారు. మిగతా 4,63,983 మంది ఓటు వేయలేదు. పార్లమెంట్ నియోజకవర్గంలో 72.42 శాతం పోలింగ్ కావడం గమనార్హం. 2019 లోక్సభ ఎన్నికల్లో మొత్తం 13, 68,868 మంది ఓటర్లు ఉండగా అప్పట్లో 9,26,516 (67.68శాతం) ఓట్లు పోల య్యాయి. అప్పటికి ఇప్పటికీ చూస్తే 3,13,602 మంది ఓటర్లు పెరిగినప్పటికీ పోలింగ్ శాతం తక్కువగా నమోదు కావడం, ఓటుకు దూరంగా ఉన్నవారి సంఖ్య ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. గుర్తింపు కార్డు కోసమే.. ఓటరు జాబితాలో పేరు నమోదుకు ఎంతో శ్రద్ద చూపెట్టారు. 18 ఏళ్లు నిండిన వెంటనే ఓటు నమోదు చేయిస్తారు. ఎన్నికల గుర్తింపు కార్డు రాకుంటే అధికారులతో మాట్లాడి తీసుకుంటారు. ఓట్ల పండగ వచ్చే సరికే దూరంగా ఉంటున్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ఇతర ప్రాంతాల్లో ఉంటే పిలవడం లేదు. దూరభారం అవుతుందని ఎందుకు ఇంతదూరమని చెప్పడంతో వారు కూడా వచ్చేందుకు ఆసక్తి చూపడంలేదు. ఓటరు కార్డును ఒక గుర్తింపు కార్డు కోసమే వాడుతున్నారు. ● పట్టణాల్లో ఓటు వేసేందుకు చాలా మంది వెనుకడుగు వేశారు. ప్రతి ఎన్నికల్లో ఇదే పరిస్థితి. మహబూబ్నగర్ అర్బన్, జడ్చర్ల, నారాయణపేట, షాద్నగర్ పట్టణ ప్రాంతాల్లో కొత్త ఓటర్లు వేలల్లో పెరుగుతున్నారు. ఓటింగ్ శాతం చూస్తే తక్కువగా ఉంటుంది. -
సేవల సౌలభ్యానికి సర్వే
నర్వ: అంగన్వాడీ కేంద్రాల నిర్వాహణ, గర్భిణులు, బాలింతలతో పాటు చిన్నారులకు అందించే సేవల్లో మార్పులు తీసుకొచ్చేందుకు అంగన్వాడీ కుటుంబ సర్వే మొదలుపెట్టారు. జిల్లా వ్యాప్తంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో అంగన్వాడీ టీచర్లు సర్వే నిర్వహిస్తున్నారు. కేంద్రం ఒక చోట ఉంటే లబ్ధిదారుల ఇళ్లు ఇంకో చోట ఉండటంతో చిన్నారులకు పోషకాహారం, గర్భిణులు, బాలింతలకు సేవలందించడంలోనూ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. లబ్ధిదారులు కేంద్రాన్ని చేరుకోవడానికి అవసస్థలు పడాల్సి వస్తోంది. సమీపంలో ఉన్న కేంద్రాన్ని వదిలిపెట్టి దూరాన ఉన్న కేంద్రానికి కేటాయించడంతోనే ఇలాంటి పరిస్థితి తలెత్తింది. వీటన్నింటినిదృష్టిలో ఉంచకోని పరిష్కారం దిశగా మార్పులు తీసుకొచ్చే ప్రయత్నమే ఈ సర్వే అని అధికారులు అంటున్నారు. జిల్లా వ్యాప్తంగా 704 కేంద్రాల పరిధిలో ఉన్న ఇళ్ళను పరిగణలోకి తీసుకోని ఈ సర్వే చేస్తున్నారు. నర్వ మండలం పెద్దకడ్మూర్లోకుటుంబ సర్వే చేస్తున్న అంగన్వాడీ సిబ్బంది వివరాలు ఆన్లైన్లో నమోదు.. సర్వే ఆధారంగా వివరాలు సేకరించిన సిబ్బంది ఆన్లైన్లో నమోదు చేస్తారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబందించిన రెండు రకాల యాప్లలో సర్వేను ఒకే సారి పొందుపరుస్తున్నారు. కేంద్రాన్ని ఆధారంగా చేసుకొని ఇంటి నెంబర్, కాలనీ పేరు, చిన్నారులు, తల్లిదండ్రులు గర్భిణులు, బాలింతలు, జనన, మరణాలు, ఇల్లు ప్రస్థుతం ఉన్న కేంద్రం తదితర అంశాలను పరిగణలోకి తీసుకుంటున్నారు. సర్వే రెండు విధాలుగా ఉంది. ఒకటి రాష్ట్ర ప్రభుత్వానికి సంబందించి, మరోటి కేంద్రప్రభుత్వానిది. సర్వే అనంతరం కేంద్రాలకు సంబందించి ఇళ్ల సర్దుబాటు ప్రక్రియ చేపడతారు. కేంద్రానికి దూరంగా ఉండే ఇళ్లను సమీపంలో ఉన్న కేంద్రానికి దూరంగా ఉండే ఇళ్ళను సమీపంలో ఉన్న కేంద్రానికి బదిలీ చేస్తారు. ఒక కేంద్రానికి 250 ఇళ్ళ నుంచి 300 ఇళ్ళు ఉండేలా సర్దుబాటు చేయనున్నారు. అంగన్వాడీల కుటుంబ సర్వే వివరాలు సేకరించి ఆన్లైన్లో నమోదు రెండు యాప్లలో వివరాలు క్రోడీకరణ సర్వేతో దొంగ రిజిస్ట్రేషన్ల నివారణ పకడ్బందీగా చేపడుతున్నాం కుటుంబ సర్వే నిబంధనల ప్రకారం పకడ్బందీగా చేపడుతున్నాం. జిల్లాలోని ప్రతి గ్రామంలో అంగన్వాడీ సిబ్బంది సర్వే చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో లబ్ధిదారులకు పోషకాహారం పంపిణి సక్రమంగా జరిగేందుకు, అక్రమ రిజిస్ట్రేషన్ల తొలగింపు, మేగ్రేషన్ తది అంశాలను సర్వేలో చేపట్టనున్నారు. ఈ సర్వేతో లబ్ధిదారుల ఉత్తమ సేవలకు ఉపయోపగడనుంది. చాలా మంది పట్టణాల్లో లబవ్ధిదారులు అద్దె ఇళ్లల్లో మారుతుంటారు. అలాంటి వారికి ప్రాధాన్యమిస్తూ సర్వే చేస్తున్నారు. సర్వే పూర్తిస్థాయిలో పకడ్భందీగా జరిగేలా చర్యలు తీసుకుంటాం. – నర్సింగ్రావు, డీడబ్ల్యూఓ, నారాయణపేట -
దోపిడీ వ్యవస్థపై పోరాటం చేయాలి
నారాయణపేట: దోపిడీ, పెట్టుబడిదారి వ్యవస్థపై పోరాటం చేయాలని అప్పుడే సామాన్య ప్రజలకు న్యాయం జరుగుతుందని సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ రాష్ట్ర నాయకుడు ఎం.హన్మేస్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఆ పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన రాజకీయ శిక్షణా తరగతులకు రెండవ రోజు డివిజన్ కార్యదర్శ కె.కాశీనాథ్ అధ్యక్షత వహించగా ఆయన జాతీయ, అంతర్జాతీయ రాజకీయ పరిస్థితులపై శిక్షణనిచ్చారు. హన్మేస్ మాట్లాడుతూ అంతర్జాతీయంగా సామ్రాజ్యవాద దేశాలు తమ మార్కెట్ కోసం కొట్లాడుతున్నాయన్నారు. మనం కార్పొరేటు పెట్టుబడి దారి విధానానికై సామ్రాజ్యవాదానికి, యుద్ధాలకు వ్యతిరేకంగా కొట్లాడాలన్నారు. దేశంలో నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి విషయాన్ని దేశభక్తి, మతంతో ముడిపెట్టి పాలన కొనసాగిస్తున్నారని, దేశ సంపదను, ప్రభుత్వ సంస్థలను ఆదానీ, అంబానీ లాంటి పెద్ద పెట్టుబడిదారులకు అప్పజెబుతున్నాడన్నారు. మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత భారత్ ప్రపంచ ఆకలి పట్టికలో 94 స్థానానికి ఎగబాకిందన్నారు. వీటిని ప్రశ్నించిన వారిని దేశద్రోహులంటూ జైల్లో వేస్తున్నారని, మోదీ పెంచి పోషిస్తున్న మూడవిశ్వాసాలను, కార్పొరేట్ శక్తులను మట్టి కల్పించాల్సిన బాధ్యత మనపై ఉందని అన్నారు. జిల్లా కార్యదర్శి బి.రాము, సలీం, జయలక్ష్మి ,బోయిన్పల్లి రాము, కిరణ్ కాలేశ్వర్ యాదగిరి తో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
జొన్నలు @ రూ.4,715
నారాయణపేట: స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో గురువారం జొన్నలు క్వింటా గరిష్టంగా రూ.4,715, కనిష్టంగా రూ.3,355 ధర పలికింది. అలాగే, వడ్లు హంస గరిష్ట, కనిష్టంగా రూ.1,930, వడ్లు సోనా గరిష్టంగా రూ.2,505, కనిష్టంగా రూ.1,821 ధరలు పలికాయి. సోనామసూరి ధర రూ. 2,382.. దేవరకద్ర: స్థానిక వ్యవసాయ మార్కెట్లో గురువారం జరిగిన టెండర్లలో సోనామసూరి ధాన్యం క్వింటాల్కు గరిష్టంగా రూ. 2,382, కనిష్టంగా రూ. 2,243 ధర పలికింది. ధాన్యం సీజన్ ముగుస్తుండటంతో మార్కెట్కు 500 బస్తాల ధాన్యం అమ్మకానికి వచ్చింది. స్కాలర్షిప్కు దరఖాస్తుల స్వీకరణ వనపర్తిటౌన్: గిరిజన వ్యవహారాల మంత్రి శాఖ ఆధ్వర్యంలో ఎస్టీ అభ్యర్థుల నుంచి నేషనల్ ఓవర్సిస్ స్కాలర్షిప్ పథకానికి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి ఎం. శ్రీనివాస్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 2024–25 విద్యా సంవత్సరానికి స్కాలర్షిప్ పొందాలనుకునే విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలన్నారు. మాస్టర్స్, పీహెచ్డీ రీసెర్చ్ ప్రోగ్రాం కోసం విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే వారికి కేంద్ర ప్రభుత్వం స్కాలర్షిప్ అందిస్తుందని వెల్లడించారు. ఆసక్తి ఉన్నవారు ఈ నెల 31వ, తేదీలోగా overseas.tribal.gov.inలో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. -
సైబర్ నేరగాళ్లతో అప్రమత్తంగా ఉండాలి
నారాయణపేట రూరల్: సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతుండటంతో సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ యోగేష్గౌతమ్ ఒక ప్రకటనలో సూచించారు. అపరిచితులపై అప్రమత్తంగా ఉండాలని, తెలియని వారికి సెల్ ఫోన్ ఇవ్వడం చేయరాదని, అనవసరమైన లింకులు మైబెల్కు వస్తే ఓపెన్ చేయరాదని, లాటరీ తగిలిందని, తక్కువ ధరలకు అన్లైన్లో వస్తువులు అమ్ముతున్నట్లు ప్రకటనలు చూసి మోసపోవద్దని తెలిపారు. బ్యాంకు నుంచి ఫోన్ చేస్తున్నామని,ఓటీపీ వివరాలు చెప్పాలని అడిగినా ఎట్టిపరిస్థితుల్లో చెప్పవద్దని, తమ వ్యక్తిగత వివరాలు ఎవరికి షేర్ చేయరాదని, ఎక్కడైన అనుమానం వస్తే వెంటనే టోల్ఫ్రీ నం. 193కుగాని డయల్ 100, 112లకు ఫోన్చేసి సమాచారం ఇవ్వాలని సూచించారు. డిగ్రీ సెమిస్టర్ పరీక్షల్లో ముగ్గురు డిబార్ మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీ పరిధిలో గురువారం డిగ్రీ 2, 6వ సెమిస్టర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. పరీక్షల నిర్వహణకు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 49 కేంద్రాలను ఏర్పాటుచేశారు. ఉదయం జరిగిన రెండో సెమిస్టర్ పరీక్షకు 11,848 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా.. 11,227 మంది హాజరయ్యారు. ఇక మధ్యాహ్నం జరిగిన ఆరో సెమిస్టర్ పరీక్షకు 11,448 మందికిగాను 11,108 మంది హాజరైనట్లు అధికారులు పేర్కొన్నారు. కాగా, కొండనాగులలో ఇద్దరు, నాగర్కర్నూల్లో ఒక విద్యార్థి మాల్ ప్రాక్టిస్కు పాల్పడుతూ అధికారులకు పట్టుబడగా.. డిబార్ చేసినట్లు పీయూ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ రాజ్కుమార్ తెలిపారు. పంటల రక్షణకు చర్యలు తీసుకోవాలి నారాయణపేట: ఈ నెల 17 నుండి 31 వరకు జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉన్న దృష్ట్యా పండించిన వరిని రక్షించుకోవడానికి రైతులు రక్షణ చర్యలు చేపట్టాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఒక ప్రకటనలతో తెలిపారు. పండించిన వరి గింజలు తడవకుండా నిల్వ చేసుకోవాలని, వరి గింజలను కప్పడానికి టార్పాలిన్లు ఉపయోగించాలని, ఆరుబయట ఆరవేయద్దని సూచించారు. జూరాలకు 2,451క్యూసెక్కుల ఇన్ఫ్లో ధరూరు: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతం నుంచి స్వల్పంగా ఇన్ఫ్లోలు వస్తున్నట్లు పీజేపీ అధికారులు తెలిపారు. లోకల్ వర్షాలతో పాటు ప్రాజెక్టు ఎగువన ఉన్న నారాయణపూర్ ప్రాజెక్టు నుంచి గురువారం జూరాల ప్రాజెక్టుకు 2,451 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. జూరాల ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 2.907 టీఎంసీల నీరు నిల్వ ఉండగా.. ప్రాజెక్టు నుంచి 125 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు చెప్పారు. -
క్వింటా ఉల్లి రూ. 2,600
దేవరకద్ర/నారాయణపేట: కొన్ని రోజుల కిందటి వరకు రూ. వెయ్యి నుంచి రూ. 1,500 వరకు ఉన్న ఉల్లి ధరలు.. రెండు వారాల నుంచి ౖపైపెకి ఎగబాకుతున్నాయి. ప్రస్తుతం దిగుబడులు తగ్గి, సీజన్ ముగుస్తున్న క్రమంలో ఉల్లి ధరలు రెండింతలు పెరిగాయి. దేవరకద్ర మార్కెట్లో బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉల్లి వ్యాపారం జోరుగా సాగింది. వ్యాపారులు వేలం లేకుండానే నేరుగా కొనుగోలుచేశారు. క్వింటా ఉల్లి గరిష్టంగా రూ. 2,600, కనిష్టంగా రూ. 2,200 ధర పలికింది. తూకం చేసిన ఉల్లిని అప్పటికప్పుడు 45 కేజీల బస్తాల్లో నింపి, రూ. 1,300 నుంచి రూ. 1,100 వరకు విక్రయాలు సాగించారు. ఇక చిన్నపేడు ఉల్లి బస్తాలను రూ. 600 నుంచి రూ. 500 వరకు విక్రయించారు. కాగా, కొందరు రైతులు ట్రాక్టర్లపై ఉల్లి బస్తాలను పెట్టుకొని అమ్ముకున్నారు. నాణ్యమైన ఉల్లి బస్తా ధర రూ. 1,300 నుంచి రూ. 1,100 వరకు అమ్మకాలు సాగించారు. రూ. 2,319 పలికిన సోనామసూరి ధాన్యం దేవరకద్ర మార్కెట్లో జరిగిన టెండర్లలో సోనామసూరి ధాన్యం క్వింటాకు గరిష్టంగా రూ. 2,319, కనిష్టంగా రూ. 2,062 ధర పలికింది. మార్కెట్కు 300 బస్తాల ధాన్యం అమ్మకానికి వచ్చింది. పెసర క్వింటా రూ.7,639 స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో బుధవారం పెసర క్వింటా గరిష్టంగా రూ.7,639, కనిష్టంగా రూ.7,050 ధర పలికింది. అలాగే, జొన్నలు గరిష్టంగా రూ.4,555, కనిష్టంగా రూ.3,725, వడ్లు హంస గరిష్టం, కనిష్టంగా రూ.1,871, వడ్లుసోన గరిష్టంగా రూ.2,472, కనిష్టంగా రూ.1,301 ధరలు పలికాయి. -
సాగుకు సన్నద్ధం
నారాయణపేట: జిల్లాలో వానాకాలం సాగు ప్రణాళికను వ్యవసాయశాఖ సిద్ధంచేసింది. కలెక్టర్ కోయ శ్రీహర్ష దిశానిర్దేశం.. డీఏఓ జాన్సుధాకర్ సూచనలతో పక్కా ప్రణాళిక రూపొందించి ప్రభుత్వానికి నివేదించింది. గత సీజన్తో పోలిస్తే, ఈసారి వరిసాగు విస్తీర్ణం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈఏడాది వర్షాలు అధికంగా కురుస్తాయన్న వాతావరణశాఖ శాస్త్రవేత్తల అంచనాలకు తోడు.. కొత్త ప్రభుత్వం ప్రకటించిన క్వింటా ధాన్యానికి రూ.500 బోనస్తో రైతులు వరిసాగుపై మొగ్గు చూపుతున్నారని చెప్పవచ్చు. జిల్లాలోని సంగంబండ, భూత్పూర్ రిజార్వాయర్లతో పాటు కృష్ణా పరివాహక ప్రాంతం, చెరువులు, బోరుబావుల కింద వానాకాలం సాగుకు రైతులు సిద్ధమవుతున్నారు. ప్రధానంగా వరిపంట 1.69 లక్షలు, పత్తిపంట 1.85 లక్షల ఎకరాల్లో సాగయ్యే అవకాశం ఉందని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. గతేడాది కంది పంటకు దిగుబడి తగ్గినా.. ధరలు పెరగడంతో ఈసారి మరో 5 వేల ఎకరాల్లో కందిసాగు అధికంగా అయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈమేరకు వరి విత్తనాలతో పాటు ప్రధాన వాణిజ్య పంటల డిమాండ్కు తగిన విధంగా విత్తనాల సరఫరాకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. 52,720 టన్నుల ఎరువులు.. ఈఏడాది వానాకాలంలో 4,20, 550 ఎకరాల్లో పంటసాగు అంచనా మేరకు 52,720 టన్నుల ఎరువులు అవసరమవుతున్నాయ ని ప్రభుత్వానికి నివేదించినట్లు అధికారులు చెబుతున్నారు. యూ రియా 18,150 టన్నులు, డీఏపీ 8,190, ఎంఏపీ 5,770, కాంప్లెక్స్ 16,150, ఎస్ఎస్పీ 1050, సిటీ కంపోస్ట్ 300 టన్నులు అవసరమవుతాయని అంచనా వేశారు. ఎరువులు, విత్తనాలనుఅందుబాటులో ఉంచుతాం.. వానాకాలం సాగుకు సంబంధించి రైతులకు విత్తనాలు, ఎరువుల కొరత ఏర్పడకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే వానాకాలం యాక్షన్ ప్లాన్ రెడీ చేసి, ప్రభుత్వానికి నివేదించాం. రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉండేవిధంగా చర్యలు తీసుకుంటాం. నాణ్యమైన విత్తనాలను రైతులు తీసుకోవాలి. – జాన్సుధాకర్, డీఏఓ, నారాయణపేట వానాకాలం యాక్షన్ ప్లాన్ రెడీ జిల్లాలో 4,20,550 ఎకరాల్లో సాగు అంచనా అత్యధికంగా వరిసాగుపైమొగ్గు చూపుతున్న రైతులు 52,720 టన్నుల ఎరువులుఅవసరమవుతాయని వ్యవసాయశాఖ నివేదిక -
నేటినుంచి డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీ పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు గురువారం నుంచి సెమిస్టర్ 2, 4, 6 రెగ్యులర్, బ్యాక్లాగ్ పరీక్షలు నిర్వహించనున్నారు. పీయూ పరిధిలో 49 పరీక్ష కేంద్రాలను ఏర్పాటుచేయగా.. 2వ సెమిస్టర్లో 25,575 మంది, 4వ సెమిస్టర్లో 16,902 మంది, 6వ సెమిస్టర్లో 13,751 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాటు చేయడంతో పాటు సిట్టింగ్ స్క్వాడ్, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను ఏర్పాటుచేసినట్లు పీయూ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ రాజ్కుమార్ తెలిపారు. విద్యార్థులు ఆన్లైన్లో హాల్టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాలని.. నిర్ణీత సమయంలో పరీక్షలకు హాజరు కావాలని సూచించారు. నేడు పేటలోవిద్యుత్ అంతరాయం నారాయణపేట: నారాయణపేట పట్టణంలో గురువారం ఉదయం 7 గంటల నుంచి 10 గంటల వరకు 11 కేవీ ఫీడర్ మరమ్మతుల కారణంగా విద్యుత్ అంతరాయం ఉంటుందని ఏఈ మహమ్మద్ రఫీ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. సత్యసాయి ఫీడర్ కింద పర్మారెడ్డి కాలని, అశోక్నగర్, బాబా కాలని, బీసీ కాలనీ న్యూ గంజ్, హైదరాబాద్ రోడ్, సివిల్ –2 ఫీడర్ కింద ఎస్పీ బంగ్లా, కలెక్టర్ ఆఫీస్, ఆర్.టి.సి. కాలనీ , సత్యసాయి కాలనీ, టిచర్స్ కాలనీ, బాపు నగర్ తదితర ప్రాంతాల్లో అంతరాయం ఉంటుందని తెలిపారు. నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందించాలి కోస్గి: ఎరువులు, విత్తనాల విక్రయదారులు రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందించాలని, ప్రభుత్వ నిబంధనలు పాటించని ఫెర్టిలైజర్ దుకాణాదారులపై చర్యలు తీసుకుంటామని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జాన్ సుధాకర్ హెచ్చరించారు. ఈ మేరకు బుధ వారం గుండుమాల్ రైతు వేదికలో ఉమ్మడి కోస్గి, మద్దూర్ మండలాల ఫెర్టిలైజర్ దుకాణ డీలర్లకు 2024–25 వానాకాలం పంటలకు సంబందించి సన్నాహాక సదస్సు నిర్వహించారు. డీఈఓ మాట్లాడుతూ వ్యాపారులు నాణ్యమైన విత్తనాలను మాత్రమే విక్రయించాలన్నారు. రైతులకు సరపడా యూరియా, డీఏపీ, ఇతర ఎరువులు తగినంత నిల్వలు ఉంచుకోవాలన్నారు. వ్యవసాయ రంగంలో రైతులు నేటికి మూస పద్ధతులు అవలంభించి నష్టపోతుంటారని, వ్యవసాయ శాఖ అధికారుల సూచనలు, సలహాలు పాటిస్తూ అధునాతన పద్ధతులు అవలంభిస్తే అధిక దిగుబడులు సాధించవచ్చు నని సూచించారు. రైతులు తగినంత వర్షాలు పడిన తర్వాతనే విత్తనాలు విత్తుకోవాలన్నారు. ఇందులో ఏఓ రామకృష్ణ, ఏఈఓలు, ఫెర్టిలైజర్ దుకాణ యజమానులు పాల్గొన్నారు. డిజిటల్ విద్యకు ప్రోత్సాహం మహబూబ్నగర్ ఎడ్యకేషన్: దివ్యాంగ విద్యార్థులు డిజిటల్ విద్యలో రాణించేందుకు ప్రభు త్వం ప్రోత్సాహం అందిస్తుందని పాలమూరు యూనివర్సిటీ వైస్చాన్స్లర్ లక్ష్మీకాంత్ రాథోడ్ అన్నారు. పీయూ పీజీ కళాశాల, పీజీ సెంటర్లో చదువుతున్న 12 మంది దివ్యాంగ విద్యార్థులకు బుధవారం ట్యాబ్లను పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ దివ్యాంగ విద్యార్థులు పోటీ పరీక్షలకు సిద్ధం కావడానికి, అన్ని అంశాలను తెలుసుకోవడానికి ట్యాబ్లు ఎంతో ఉపయోగపడుతాయ ని అన్నారు. ఒక్కో ట్యాబ్కు రూ. 16వేల చొప్పున రూ. 3.50 లక్షలు వెచ్చించినట్లు తెలిపారు. డిజిటల్ లైబ్రరీ ప్రారంభం.. పాలమూరు యూనివర్సిటీలో ఉన్న లైబ్రరీని ఆన్లైన్ విధానంలోకి తీసుకువచ్చేందుకు జెనిసిస్ టెక్ సిస్టం సంస్థతో అధికారులు ఒప్పందం చేసుకున్నారు. ఈమేరకు డిజిటల్ లైబ్రరీ కార్యక్రమాన్ని పీయూ వీసీ లక్ష్మీకాంత్ రాథోడ్ బటన్ నొక్కి ప్రారంభించారు. పీయూ లైబ్రరీలోని పుస్తకాలు ఏ ర్యాక్లో ఉన్నాయి.. ఎన్ని ఉన్నాయి.. విద్యార్థుల సబ్జెక్టు పుస్తకాలు ఉన్నాయా.. లేదా అనే అంశాలను ఆన్లైన్లో తెలుసుకునే వెసులుబాటు కలగనుంది. కార్యక్రమాల్లో రిజిస్ట్రార్ మధుసూదన్రెడ్డి, ప్రిన్సిపాల్ చంద్రకిరణ్, లైబ్రరీ కోఆర్డినేటర్ అనురాధ, బషీర్ అహ్మద్, అంకం భాస్కర్ పాల్గొన్నారు. -
దరఖాస్తుల ఆహ్వానం
మహబూబ్నగర్ న్యూటౌన్: గిరిజన వ్యవహారాల మంత్రిత్వశాఖ ద్వారా అందించే నేషనల్ ఓవర్సీస్ స్కాలర్షిప్లకు గిరిజన విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా గిరిజనాభివృద్ధి అధికారి చత్రునాయక్ బుధవారం ప్రకటనలో తెలిపారు. విదేశాల్లో మాస్టర్స్, పీహెచ్డీ, పోస్ట్ డాక్టోరల్ రీసెర్చ్ ప్రోగ్రాంలలో ఉన్నత విద్య అభ్యసించేందుకు ఎంపికై న విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం స్కాలర్షిప్ అందిస్తుందని పేర్కొన్నారు. 2024–25 విద్యా సంవత్సరానికి స్కాలర్షిప్ పొందాలనుకునే విద్యార్థులు ఈనెల 31వ తేదీలోగా http://overseas.tribal.gov.inవెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. -
బీజేపీ గెలుపును ప్రజలు నిర్ణయించారు
పాలమూరు: గత లోక్సభ ఎన్నికల కంటే ఈసారి జరిగిన ఎన్నికల్లో రాష్ట్రంలో 10 శాతం ఓటింగ్ పెరిగిందని, మహబూబ్నగర్ పార్లమెంట్ పరిధిలో కూడా 10 శాతం పెరిగిందని బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ అన్నారు. బీజేపీ జిల్లా కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే అధికంగా పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు పోలింగ్ బూత్కు వచ్చి ఓటు వేశారన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ను ఓడించాలని ప్రజలు అధికంగా ఓటు వేస్తే.. ఈసారి మోదీని మరోసారి ప్రధానిని చేయడానికి గ్రామాల్లో పెద్ద ఎత్తున ఓటర్లు తరలివచ్చారన్నారు. ఎంపీ ఎన్నికల్లో డీకే అరుణ గెలవాలని ఎన్నికల కంటే ముందు ప్రజలు నిర్ణయానికి వచ్చిన పరిస్థితి చూశామన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు కోసం సీఎం రేవంత్రెడ్డి జిల్లాకు 8 సార్లు వచ్చాడని, కాంగ్రెస్ వాళ్లు ఎంత బెదిరించిన ఆరు గ్యారంటీలు సక్రమంగా అమలు చేయలేదనే విషయం ప్రజలకు తెలుసన్నారు. మహబూబ్నగర్ పార్లమెంట్ స్థానం వంద శాతం గెలిచి తీరుతామని, 2–3 లక్షల మెజార్టీ వస్తుందన్నారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చినప్పటి నుంచి బీజేపీ కోసం పనిచేసిన ప్రతి కార్యకర్తకు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీలకతీతంగా ఈ ఎన్నికల్లో బీజేపీ గెలవాలని మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు చెప్పారు. ప్రధాని మోదీ దేశ అభివృద్ధి కోసం పనిచేస్తే పాలమూరు పార్లమెంట్ అభివృద్ధి నేను కృషిచేస్తానని వెల్లడించారు. సమావేశంలో జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి, నాయకులు పద్మజారెడ్డి, రమేష్కుమార్, కిరణ్కుమార్రెడ్డి, పద్మవేణి, అంజయ్య, రామాంజనేయులు, కిషోర్, రాములు, బుడ్డన్న తదితరులు పాల్గొన్నారు.
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
ఆ పని నాది కాదు.. వైరముత్తుకు కౌంటర్ ఇచ్చిన ఇళయరాజా!
ఇంటర్లో ప్రవేశానికి స్పాట్ కౌన్సెలింగ్
‘అధికారులు తీరు మార్చుకోవాలి’
‘కల్తీ కల్లును అరికట్టాలి’
● జిల్లాలో విందులు, వినోదాల పేరిట పెడదారిన టీనేజ్ యువత.. ● సిగరెట్లు, మద్యపానం ఫ్యాషన్గా భావిస్తున్న యువకులు ● విందులు, వినోదాల పేరుతో సెలవులు దుర్వినియోగం ● తల్లిదండ్రుల పర్యవేక్షణ తప్పనిసరి
క్లుప్తంగా
ఆంక్షలు లేకుండా జొన్న కొనుగోళ్లు చేపట్టాలి
‘సూపర్వైజర్ను విధుల నుంచి తొలగించాలి’
‘స్వగృహ’ ఆక్రమణపై ఆర్డీవో విచారణ
‘గ్రూప్–1 ప్రిలిమినరీ’కి 18 కేంద్రాలు
తప్పక చదవండి
- బీజేపీ ఎంపీ- ఆప్ ఎమ్మెల్యే వాగ్వాదం.. వీడియో వైరల్!
- ఇది మోదీ కూలర్.. లోకల్ బ్రాండ్ గురూ!
- ఏపీలో పెట్రోల్ బంకులకు ఈసీ సీరియస్ వార్నింగ్
- పెళ్లయినా సరే ఆ విషయంలో హన్సిక తగ్గేదేలే
- ప్రైవేట్ బస్సులో మంటలు.. తిరుపతిలో తప్పిన ఘోర ప్రమాదం
- వైన్స్ షాపు ముందు యువతి హల్చల్
- పోలింగ్ వేళ జమ్ములో కాల్పుల కలకలం
- Election Commission of India: 2 నెలల్లో 4.24 లక్షల ఫిర్యాదులు
- 16 ఏళ్లకే ఏఐ ఇంజనీర్! మన తెనాలి కుర్రాడే..
- Vizag: కాంబోడియాలో ఉద్యోగాల పేరిట మానవ అక్రమ రవాణా
Advertisement