28న ‘వాక్‌ విత్‌ జగనన్న’ | Sakshi
Sakshi News home page

28న ‘వాక్‌ విత్‌ జగనన్న’

Published Mon, Jan 22 2018 1:13 AM

Walk with jagananna on 28th - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రజల కష్టాలను తెలుసుకుని, వారి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేయడం కోసం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్న ప్రజా సంకల్పం పాదయాత్ర ఈ నెల 28వ తేదీన నెల్లూరులో 1,000 కిలో మీటర్ల మైలురాయిని అధిగమిస్తున్న సందర్భంగా ‘వాక్‌ విత్‌ జగనన్న’ (జగనన్నతో నడుద్దాం) అనే కార్యక్రమం చేపట్టాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పిలుపు నిచ్చింది.

ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకూ 13 జిల్లాల్లో 3,000 కిలోమీటర్లు చేస్తున్న వైఎస్‌ జగన్‌ పాదయాత్ర మూడో వంతు పూర్తి కానుండటంతో పార్టీ వర్గాల్లో, అభిమానుల్లో మరింత ఉత్సాహం నింపేందుకు ‘జగనన్నతో నడుద్దాం’ అనే కార్యక్రమాన్ని పార్టీ రూపొందించింది. దేశ, విదేశాల్లోని తెలుగు ప్రజలు 700కు పైగా ప్రదేశాల్లో ఏక కాలంలో వైఎస్‌ జగన్‌కు సంఘీభావం తెలుపుతూ ఆరోజున పాదయాత్రను చేపట్టనున్నారు.రాష్ట్రంలోని 25 పార్లమెంటరీ జిల్లా కేంద్రాల్లోనూ, 664 మండల కేంద్రాల్లోనూ ఈ కార్యక్రమాన్ని  నిర్వహించను న్నారు. 28న దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డికి నివాళులర్పించి పాదయాత్ర ప్రారంభించాలని నేతలకు పార్టీ పిలుపు నిచ్చింది. 

విదేశాల్లో..: పదిహేను దేశాల్లోని సుమారు 25 నగరాల్లో కూడా జగన్‌కు సంఘీభావంగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ఎన్నారై విభాగం సభ్యులు పాదయాత్ర కార్యక్రమాన్ని చేపట్టబోతున్నారు.  విదేశాల్లో ఉన్న తెలుగు సంఘాలు, ఎన్నారై విభాగం సభ్యులు ఈ యాత్ర సమన్వయ బాధ్యతలు చేపడతారు.

Advertisement
Advertisement