కాలువలోకి దూసుకెళ్లిన కారు: ఒకరి మృతి | Sakshi
Sakshi News home page

కాలువలోకి దూసుకెళ్లిన కారు: ఒకరి మృతి

Published Fri, Aug 14 2015 12:27 PM

1 died in road accident

గుంటూరు(తెనాలి): గుంటూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. ఈ ఘటన జిల్లాలోని తెనాలి మండలంలో శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. మండలంలోని సంగం జాగర్లముడి వద్ద ఓ కారు అదుపు తప్పి కాల్వలోకి దూసుకెళ్లింది. దీంతో కారులో ఉన్న ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. కాగా మరో నలుగురు వ్యక్తులు గాయపడ్డారు. స్థానికులు గమనించి క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement