లారీ, ఆటో ఢీ: ఒకరి మృతి | Sakshi
Sakshi News home page

లారీ, ఆటో ఢీ: ఒకరి మృతి

Published Fri, May 15 2015 10:03 AM

1 died in road accident ay prakasam distirict

సింగరాయకొండ : ఆగి ఉన్న లారీని వెనుక నుంచి వచ్చిన ఆటో ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలుయ్యాయి. ఈ సంఘటన శుక్రవారం ఉదయం ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండల కేంద్రంలో జాతీయ రహదారిపై జరిగింది. ఈ ప్రమాదంలో చిత్తూరు జిల్లా నగరికి చెందిన ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడటంతో మెరుగైన వైద్యం కోసం ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement