100 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత | Sakshi
Sakshi News home page

100 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత

Published Fri, Jun 12 2015 8:49 AM

10000 kg ration rice caught by villegers

సంతమాగునూరు: అక్రమంగా తరలిస్తున్న 100 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని గ్రామస్తులు పట్టుకున్నారు. ఈ ఘటన ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం తోటపాలెం వద్ద జరిగింది. రేషన్ బియ్యాన్ని అక్రమంగా లారీలో తరలిస్తున్నట్లు తెలుసుకున్న గ్రామస్తులు అక్కడికి చేరుకుని అక్రమ రవాణాను అడ్డుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని బియ్యాన్ని స్వాధీనం చేసుకుని, అక్రమాలకు పాల్పడుతున్న వారిని అదుపులోనికి తీసుకుని విచారణ చేస్తున్నారు. పూర్తివివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement