చెరువులో పడి విద్యార్థిని గల్లంతు | Sakshi
Sakshi News home page

చెరువులో పడి విద్యార్థిని గల్లంతు

Published Mon, Nov 16 2015 6:41 PM

10th class student drowns in pond

బెరైడ్డిపల్లి (చిత్తూరు) : జలకళతో నిండుకుండలా ఉన్న చెరువును చూడటానికి వెళ్లిన విద్యార్థిని ప్రమాదవశాత్తూ కాలు జారి అందులో పడి గల్లంతయ్యింది. ఈ సంఘటన చిత్తూరు జిల్లా బెరైడ్డిపల్లి మండలం గొల్లచేమనపల్లిలో సోమవారం సాయంత్రం జరిగింది. గ్రామానికి చెందిన లీనా(15) స్థానిక పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. ఈ క్రమంలో గ్రామ చెరువు నిండటంతో స్నేహితులతో కలిసి చూడటానికి వెళ్లింది. ప్రమాదవశాత్తూ కాలు జారి చెరువులో పడి గల్లంతైంది. సమాచారం అందుకున్న గ్రామస్థులు విద్యార్థిని కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు.

Advertisement
Advertisement