ఇటు తల్లి మృతి...అటు10వ తరగతి పరీక్ష | Sakshi
Sakshi News home page

ఇటు తల్లి మృతి...అటు10వ తరగతి పరీక్ష

Published Thu, Mar 26 2015 8:30 PM

ఇటు తల్లి మృతి...అటు10వ తరగతి పరీక్ష - Sakshi

గోపవరం: తెల్లవారితే10వ తరగతి పరీక్ష... అంతలో తల్లీ మృతి చెందింది. దీంతో 10వ తరగతి విద్యార్థి వసంత తీవ్ర దుఖంలో మునిగిపోయింది. అమ్మా.... నువ్వు బాగా చదువుకోవాలమ్మా.. అంటూ అమ్మ ఎప్పుడూ చెప్పేదని.. ఆ మాటలు పదేపదే పలువరిస్తుంది. అమ్మ మాట నిలబెట్టేందుకు పరీక్ష రాస్తానంటూ ఆ బాలిక పుట్టెడు దుఃఖాన్ని దిగమింగి గురువారం పరీక్షకు హాజరైంది. 

వైఎస్ఆర్ కడప జిల్లా గోపవరం మండలం నీరుబ్దుల్లాయపల్లె గ్రామానికి చెందిన వెంకటమ్మ బుధవారం రాత్రి గుండెపోటుతో మృతి చెందింది. ఆమె కుమార్తె వసంతం స్థానిక పాఠశాలలో 10వ తరగతి చదువుతోంది. 
 

Advertisement
Advertisement