సాంబమూర్తినగర్ (కాకినాడ) : స్వైన్ఫ్లూ నియంత్రణ కోసం కాకినాడ ప్రభుత్వాస్పత్రి అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఇప్పటికే టీబీ వార్డులో ప్రత్యేక వార్డు ఏర్పాటు చేసినా అక్కడ తగినంతగా సౌకర్యాలు లేకపోవడంతో సోమవారం ఈఎన్టీ బ్లాకు మూడో అంతస్తులోకి వార్డును మార్చారు 16 పడకలు, ఆధునిక వెంటిలేటర్లు ఏర్పాటు చేశారు. మందులు, 24 గంటలూ పనిచేసేలా సిబ్బందిని అందుబాటులో ఉంచారు. ఈ మేరకు సూపరింటెండెంట్ డాక్టర్ పి. వెంకట బుద్ధ, ఏఎస్ఆర్ఎంఓ డాక్టర్ కె.లక్ష్మోజీనాయుడు ఏర్పాట్లను పరిశీలించారు. సుమారు రెండేళ్ల క్రితం జిల్లాలో స్వైన్ఫ్లూ మరణాలు సంభవించడంతో అప్పట్లో దాదాపు 20 వేల మంది అనుమానితులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. వారిలో కొందరికి స్వైన్ఫ్లూ సోకినట్లు నిర్ధారణ కావడంతో నయం చేసి ఇంటికి పంపారు.
ఇటీవల చిత్తూరుకు చెందిన ఓ యువతి, రాజమండ్రికి చెందిన యువకుడు స్వైన్ఫ్లూ బారిన పడి ఇక్కడికి రావడంతో వారికి కూడా పూర్తి స్థాయిలో వైద్యం అందించారు. ఆ అనుభవంతో స్వైన్ఫ్లూపై పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉన్నామని జీజీహెచ్ వైద్యులు చెబుతున్నారు. రెండు రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ వైద్యవిధాన పరిషత్ డిప్యూటీ కమిషనర్ డాక్టర్ లోక్నాయక్ జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయంలో వివిధ శాఖల అధికారులు, పీఎంపీలతో సమావేశం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఆయన సూచనల మేరకు జీజీహెచ్లో కూడా అన్ని సౌకర్యాలతో కూడిన ఈఎన్టీ బ్లాకులోని ఆప్తాల్మిక్ విభాగంలో ప్రత్యేక వార్డును ఏర్పాటు చేశారు. రోగులను తరలించేందుకు ర్యాంపు, వీల్ చైర్లు, స్ట్రెచర్లు, ఇతర సౌకర్యాలపై సూపరింటెండెంట్ డాక్టర్ బుద్ధ ఆరా తీశారు. ఎక్కడా ఎటువంటి సమస్యలు తలెత్తకుండా వైద్య సిబ్బంది, ఇతర విభాగాల సిబ్బంది అప్రమత్తంగాా వ్యవహరించాలని ఆదేశించారు.
పస్తుత వాతావరణ పరిస్థితుల్లో స్వైన్ఫ్లూ సోకే అవకాశం లేకపోయినా, తాము అప్రమత్తంగానే ఉన్నామని చెప్పారు. ప్రస్తుతం 16 పడకలతో ప్రత్యేక వార్డును ఏర్పాటు చేశామని, అవసరమైతే మరిన్ని పడకలు, మందులు ఏర్పాటు చేస్తామన్నారు. కలెక్టర్ హెచ్. అరుణ్ కుమార్ ఆదేశాల మేరకు వైద్య సిబ్బందిని కూడా పూర్తిస్థాయిలో నియమించామని చెప్పారు. దీనిపై జిల్లా స్వైన్ ఫ్లూ నోడల్ అధికారి డాక్టర్ కె.అనితకు సమాచారం అందించామన్నారు. అనుమానితులు ఎవరైనా జీజీహెచ్కు వస్తే వారికి వైద్య సలహాలు, పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. జాగ్రత్తలు పాటించడం ద్వారా వ్యాధి బారినపడకుండా జాగ్రత్త పడవచ్చన్నారు. అపరిచితులకు షేక్ హ్యాండ్ ఇవ్వొద్దని, తరచూ చేతులు శుభ్రం చేసుకోవాలని సూచించారు. ప్రజలు ఏ మాత్రం భయపడాల్సిన పనిలేదన్నారు. జీజీహెచ్లో అన్ని మందులూ, మాస్కులు, ఇతర సౌకర్యాలు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంచినట్లు సూపరింటెండెంట్ డాక్టర్ బుద్ధ వెల్లడించారు.
16 పడకలతో స్వైన్ఫ్లూ ప్రత్యేక వార్డు
Published Tue, Feb 3 2015 1:36 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రాహుల్ తెలంగాణ మహిళలకు క్షమాపణలు చెప్పాలి: హరీశ్రావు
కేకేఆర్తో లక్నో పోరు.. తుది జట్లు ఇవే! స్టార్ బౌలర్ దూరం
జడేజా ఆల్రౌండ్ షో.. పంజాబ్ను చిత్తు చేసిన సీఎస్కే
సీను సీతారైంది సాంబడా
సందడిగా వస్త్ర దుకాణం ప్రారంభోత్సవం (ఫొటోలు)
మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
ఆ పూలు స్టార్స్లా అందంగా ఉన్నా..వాసన మాత్రం భరించలేం!
IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
ఉద్యోగం వెతుక్కునే క్రమంలో ఇలా చెయ్యొద్దు!: గూగుల్ ఉద్యోగి
తప్పక చదవండి
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement