కారులో తరలిస్తున్న రూ.17.8 లక్షలు స్వాధీనం | Sakshi
Sakshi News home page

కారులో తరలిస్తున్న రూ.17.8 లక్షలు స్వాధీనం

Published Mon, Feb 2 2015 11:12 PM

17.8 lakhs seized by police in chittoor

చిత్తూరు: చిత్తూరు జిల్లాలో పూతలపట్టు-నాయుడుపేట బైపాస్ రోడ్డులో కారులో తరలిస్తున్న రూ.17.8 లక్షలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తిరుపతి ఉప ఎన్నిక నేపథ్యంలో పోలీసులు తొట్టంబేడు మండలం లింగమనాయుడుపల్లి చెక్‌పోస్ట్ వద్ద సోమవారం సాయంత్రం తనిఖీలు నిర్వహించారు.

పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సూళ్లూరుపేట నుంచి ఓ వ్యక్తి తిరుపతికి కారులో వెళుతుండగా పోలీసులు ఆపి తనిఖీ చేశారు. ఆ సమయంలో ఎలాంటి ఆధారాలు లేకుండా కారులో 17.8 లక్షలను తరలిస్తుండడంతో పోలీసులు ఆ మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు. శ్రీకాళహస్తి డీఎస్పీ వెంకటకిషోర్ ఆధ్వర్యంలో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement