174రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం | Sakshi
Sakshi News home page

174రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం

Published Mon, May 28 2018 8:56 AM

174Th Day Praja Sankalpa Yatra Started In West Godavari - Sakshi

సాక్షి, భీమవరం : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 174వ రోజు ప్రారంభమైంది. సోమవారం ఉదయం పశ్చిమగోదావరి జిల్లా విస్సాకోడేరు నుంచి పాదయాత్ర ప్రారంభించారు. అక్కడ నుంచి గోరనమూడి, పెన్నాడ, శృంగవృక్షం, నందమూరు గరువుల, తలతాడి తిప్ప, బొబ్బనపల్లి, మత్స్యపురి వరకూ జననేత పాదయాత్ర కొనసాగనుంది. జననేతను కలుసుకోవడానికి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. వారి సమస్యలు తెలుసుకుంటూ, భరోసానిస్తూ రాజన్న బిడ్డ పాదయాత్ర కొనసాగిస్తున్నారు. పాదయాత్ర అనంతరం ఎవరైనా నేరుగా సలహాలు, సూచనలు ఇవ్వదలచిన వారు జననేత వైఎస్‌ జగన్‌ను కలుసుకుని మాట్లాడవచ్చు.

Advertisement
Advertisement