ఆర్టీసీ బస్సు బోల్తా: 18 మందికి గాయాలు | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ బస్సు బోల్తా: 18 మందికి గాయాలు

Published Tue, Jun 24 2014 7:55 AM

18 passengers injured in bus overturned in SPSR Nellore district

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సీతారామపురం మండలం చిన్ననాగంపల్లి వద్ద మంగళవారం ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఆ ప్రమాదంలో 18 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రయాణికులు పోలీసులకు వెల్లడించారు.

Advertisement
Advertisement