194 కిలోల ఎర్రచందనం దుంగలు స్వాధీనం | Sakshi
Sakshi News home page

194 కిలోల ఎర్రచందనం దుంగలు స్వాధీనం

Published Sat, Aug 15 2015 5:57 PM

194 kg of Red sandalwood logs seized

వళ్లూరు (వైఎస్సార్ జిల్లా) : అక్రమంగా చెరువులో నిల్వ ఉంచిన 10 ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన శనివారం వైఎస్సార్ జిల్లా వళ్లూరు మండలం గొటూరు గ్రామంలో జరిగింది. వివరాల ప్రకారం.. గతంలో జూన్15 న ఎర్రచందనం దుంగలను అక్రమంగా తరలిస్తున్న 8 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిని విచారించగా సుబ్బారాజు అనే మరో వ్యక్తి పేరు బయటకు వచ్చింది. దీంతో పోలీసులు అప్పటి నుంచి సుబ్బరాజు ఆచూకీ కోసం గాలిస్తున్నారు.

కాగా శనివారం మండల కేంద్రంలో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అతడిని విచారించగా గొటూరు చెరువులోని కంప చెట్లలో 194 కిలోల బరువైన 10 ఎర్రచందనం దుంగలను దాచి ఉంచినట్లు తెలిపాడు. దీంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దుంగలను స్వాధీనం చేసుకున్నారు. 10 దుంగల విలువ సుమారు రూ. 9లక్షల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు. నిందితుడిపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement