ఆటో బోల్తా: ఒకరి మృతి | Sakshi
Sakshi News home page

ఆటో బోల్తా: ఒకరి మృతి

Published Thu, May 7 2015 10:27 AM

1dies,4 injured as auto turns turtle

నెల్లూరు: కూలీలను తరలిస్తున్న ఆటో అడవిపందిని ఢీకొని బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి మృతిచెందగా మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన నెల్లూరు జిల్లా కోట మండలం చంద్రశేఖరపురం దగ్గర గురువారం ఉదయం చోటుచేసుకుంది. మండలంలోని చిట్టెడు గ్రామం నుంచి వంజివాత గ్రామానికి కూలీలు ఆటోలో వెళ్తున్నారు. ఆటో చంద్రశేఖరపురం గ్రామ సమీపంలోకి రాగానే ఒక్కసారిగా అడవిపంది అడ్డువచ్చింది. దీంతో దాన్ని తప్పించడానికి ప్రయత్నించడంతో అదుపుతప్పి బోల్తా కొట్టింది.

దీంతో ఆటోలో ఉన్న శ్రీనివాసులు(23) అనే యువకుడు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను గూడూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement