రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు

Published Thu, Jul 30 2015 9:18 AM

2 injured in road accident

కొడవలూరు : నెల్లూరు జిల్లా కొడవలూరు సమీపంలో గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. తిరుపతికి చెందిన రామచందర్‌రాజు(38) విజయవాడ నుంచి కారులో వస్తూ కొడవలూరు సమీపంలో ముందున్న లారీని ఢీకొట్టాడు. ఈ ఘటనలో కారు లారీ కిందికి దూసుకుపోయింది. కారులో ఉన్న రామచందర్ రాజు, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.  క్షతగాత్రులను స్థానికులు నెల్లూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. రామచందర్ రాజు పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది.
 

Advertisement
Advertisement