బైక్‌ను ఢీకొన్న ట్రాక్టర్: ఇద్దరికి గాయాలు | Sakshi
Sakshi News home page

బైక్‌ను ఢీకొన్న ట్రాక్టర్: ఇద్దరికి గాయాలు

Published Tue, May 19 2015 10:28 AM

2 injured in road accident at anantapuram

అనంతపురం: వేగంగా వెళ్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి బైక్‌ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్రంగా గాయాలయ్యాయి. ఈ సంఘటన మంగళవారం అనంతపురం జిల్లా గోరెంట్ల మండలం రెడ్డి చెరువుకట్ట గ్రామం సమీపంలో జరిగింది. వివరాలు.. మండలంలోని రాగిమేకలపల్లి గ్రామానికి చెందిన శంకర్‌నాయక్(30) లక్ష్మీపతి(15)లు బైక్‌పై పుట్టపర్తికి వెళ్తున్నారు. ఈ క్రమంలో మార్గ మధ్యలో రెడ్డి చెరువుకట్ట వద్ద ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ వీరు ప్రయాణిస్తున్న బైక్‌ను ఢీ కొట్టింది. దీంతో ఇద్దరికి తీవ్రంగా గాయాలయ్యాయి. స్థానికుల సహాయంతో గాయపడిన వారిని హిందూపురం ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కాగా, ట్రాక్టర్ హిందూపురం ఎంపీ నిమ్మల కిష్టప్పకు చెందినదిగా స్థానికులు చెబుతున్నారు.
(గోరెంట్ల)

Advertisement
Advertisement