రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి,15మందికి గాయాలు | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి,15మందికి గాయాలు

Published Thu, Aug 8 2013 10:42 AM

2 killed, 15 injured in separate road accidents

హైదరాబాద్ : రెండు వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందగా, మరో 15మంది గాయపడ్డారు. శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మండలం రేగులపాడు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వృద్దులు మృతి చెందగా, మరో ఆరుగురికి గాయాలయ్యాయి. డీసీఎం ఢీకొనటంతో ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు.

కాగా చిత్తూరు జిల్లా నిమ్మనపల్లి మండలం పిత్తవార్లపల్లిలో ఆటో బోల్తాపడిన సంఘటనలో తొమ్మిదిమంది గాయపడ్డారు. మరో ఇద్దరి  పరిస్థితి విషమంగా ఉంది.

Advertisement
Advertisement