టీడీపీ సభకు ముందు చేనేత కార్మికుల అరెస్ట్ | Sakshi
Sakshi News home page

టీడీపీ సభకు ముందు చేనేత కార్మికుల అరెస్ట్

Published Sat, May 23 2015 12:06 PM

200 Handlooms weavers arrested before starts TDP mini mahanadu at Anathapuram district

అనంతపురం: అనంతపురం జిల్లాలోని ధర్మవరంలో శనివారం టీడీపీ మినీ మహానాడు సభ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రులు పల్లె రఘనాథ రెడ్డి, పరిటాల సునీతా, ఎమ్మెల్యే బాలకృష్ణ హాజరయ్యారు.

అయితే ఈ సభను అక్కడి చేనేత కార్మికులు అడ్డుకుంటారనే కారణంగా ముందస్తుగా 200 మంది చేనేత కార్మికులను పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా, టీడీపీ నేత గడ్డం సాయి వేధింపులు అరికట్టాలంటూ గత మూడు రోజులుగా చేనేత కార్మికులు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే.
 

Advertisement
Advertisement