లారీ, టాటా ఏస్ ఢీ: ముగ్గురి మృతి | Sakshi
Sakshi News home page

లారీ, టాటా ఏస్ ఢీ: ముగ్గురి మృతి

Published Fri, Jun 12 2015 11:58 AM

3 died in road accident

నాగలాపురం: వేగంగా వెళ్తున్న లారీ , టాటా ఏస్ వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో 16 మంది గాయపడ్డారు. ఈ సంఘటన శుక్రవారం చిత్తూరు జిల్లా నాగలాపురం మండలం చిన్నపట్టు గ్రామం సమీపంలో జరిగింది. గాయపడిన వారిని మెరుగైన వైద్యం కోసం స్థానిక ఆస్పత్రికి తరలించారు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, బాధితులు చెన్నైకి వలసకూలీలుగా వెళ్తున్నట్లు సమాచారం.

Advertisement
Advertisement