మహిమ గల నాణెం అంటూ మోసం | Sakshi
Sakshi News home page

మహిమ గల నాణెం అంటూ మోసం

Published Fri, Aug 28 2015 6:27 PM

మహిమ గల నాణెం అంటూ మోసం - Sakshi

విశాఖపట్నం (అల్లీపురం) : మహిమ గల నాణెం పేరిట మోసానికి పాల్పడుతున్న ముగ్గురు సభ్యుల ముఠాను విశాఖపట్నం టాస్క్‌ఫోర్స్ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. ఈ నాణాన్ని ఈస్టిండియా కంపెనీ వారు 1813 లో తయారు చేశారు. కాగా దీనికి మహిమ ఉందని చెప్పి జంగా రాజారెడ్డి అనే వ్యక్తికి అంటగట్టి రూ.20 లక్షలు తీసుకున్నారు.

తర్వాత దీనికి ఎటువంటి మహిమా లేదని నిర్ధారించుకున్న బాధితుడు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్నారు. నిందితులపై నిఘా పెట్టి శుక్రవారం పట్టుకున్నారు. వీరి నుంచి రూ.8.5 లక్షల నగదు, 5 సెల్‌ఫోన్‌లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను మీడియా ఎదుట ప్రవేశపెట్టారు.

Advertisement
Advertisement