ఆర్టీసీ బస్సు బోల్తా : ముగ్గురికి గాయాలు | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ బస్సు బోల్తా : ముగ్గురికి గాయాలు

Published Mon, May 18 2015 11:29 AM

3 injured ij road accident

ముదినేపల్లి : కృష్ణా జిల్లా ముదినేపల్లి సమీపంలో సోమవారం ఉదయం ఆర్టీసీ బస్సు బోల్తాపడి డ్రైవర్ సహా ముగ్గురు గాయపడ్డారు. భీమవరం నుంచి విజయవాడకు వెళుతున్న ఆర్టీసీ బస్సు విశ్వనాథపాళెం వద్ద జాతీయ రహదారిపై ఎదురుగా వస్తున్న గేదెను తప్పించబోయి రోడ్డుపక్కన గోతిలో బోల్తాపడింది. ఈ సంఘటనలో డ్రైవర్ సహా ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.

Advertisement
Advertisement