ట్రాక్టర్, కారు ఢీ.. ముగ్గురికి గాయాలు | Sakshi
Sakshi News home page

ట్రాక్టర్, కారు ఢీ.. ముగ్గురికి గాయాలు

Published Thu, Aug 6 2015 1:43 PM

3 injured in road accident at tirupathi

ఏర్పేడు: ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలు ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురికి గాయాలయ్యాయి. ఈ సంఘటన చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలం పాతవీరాపురం గ్రామంలో గురువారం జరిగింది. హైదరాబాద్‌కు చెందిన నలుగురు ఉద్యోగులు కారులో కానిపాకం నుంచి శ్రీకాళహస్తి వెళ్తుండగా ముసిలిపేడు ఇసుక రీచ్‌ నుంచి తిరుపతికి ఇసుక తీసుకెళ్తున్న ఓ ట్రాక్టర్ వీరాపురం సమీపంలో ఢీకొట్టింది.

దీంతో కారులో ఉన్న సెక్షన్ ఆపీసర్ బిక్షం(49), అసెంబ్లీ ఉద్యోగి మల్లికార్జున శర్మ(46), పార్ధసారధి(46)లకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను తిరుపతి ఆస్పత్రికి తరలించారు.  కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement