రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి

Published Sun, Mar 15 2015 7:13 AM

3 killed in road accident

కొయ్యలగూడెం: పశ్చిమగోదావరి జిల్లా కొయ్యలగూడెం మండలం సీతంపేట వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. ఆగివున్న లారీని మినీట్రావెల్ బస్సు ఢీకొనడంతో ఈ దుర్ఘటన జరిగింది. అన్నవరం నుంచి తిరువూరు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 15 మంది గాయపడ్డారు. వీరిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.

Advertisement
Advertisement