- 16 ఏళ్లు గడిచినా కాల్పుల దుర్ఘటన మరువలేను..
- ప్రదర్శనకు అనుమతి ఇచ్చిన బాబు ప్రభుత్వం పొట్టనపెట్టుకుంది
- బషీర్బాగ్ కాల్పులపై సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు వైవీ
సాక్షి, అమరావతి: ‘చంద్రబాబు హయాంలో పెంచిన విద్యుత్ చార్జీలను ఉపసంహరించుకోవాలని మాతోపాటు నినదించిన వారిలో ముగ్గురు మా కళ్లముందే పోలీస్ తూటాలకు కుప్పకూలిపోయారు.. 16 ఏళ్లు గడిచినా ఆ విషాద ఘటన గుర్తొస్తే గుండె బాధతో బరువెక్కుతోంది..’ అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు వై.వెంకటేశ్వరరావు (వైవీ) ఆవేదన వ్యక్తం చేశారు. 2000లో బషీర్బాగ్లో పోలీసులు జరిపిన కాల్పుల్లో మృతిచెందిన వి.బాలస్వామి, సత్తెనపల్లి రామకృష్ణ, విష్ణువర్ధన్రెడ్డిల సంస్మరణ సభను ఆదివారం విజయవాడలోని సీపీఎం రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించారు. ఆ దుర్ఘటనను ప్రత్యక్షంగా చూసిన వైవీ మాట్లాడుతూ పోలీసులు హెచ్చరికలు లేకుండా కాల్పులకు దిగడంతో ఉద్యమకారులను కోల్పోయామని చెప్పారు.
విద్యుత్ చార్జీలు తగ్గించాలని పది వామపక్షాలు, కాంగ్రెస్ వేర్వేరుగా మూడు నెలలపాటు ఆందోళన నిర్వహించిన అనంతరం 2000 ఆగస్టు 28న చలో హైదరాబాద్కు పిలుపునిచ్చాయన్నారు. శాంతియుత ర్యాలీకి అనుమతి ఇచ్చిన చంద్రబాబు ప్రభుత్వం పోలీసులను ప్రయోగించి బషీర్బాగ్లో అకస్మాత్తుగా కాల్పులకు పురిగొల్పిందని చెప్పారు. తాను మారానని ప్రజలను నమ్మించి 2014 ఎన్నికల్లో గద్దెనెక్కిన చంద్రబాబు మళ్లీ అన్ని రంగాల్లోను సంస్కరణలు వేగంగా అమలు చేస్తున్నారని విమర్శించారు. ప్రత్యేక హోదా కోసం పవన్కల్యాణ్ పోరాడతానని ప్రకటించడం అభినందనీయమన్నారు.
మా ముందే ముగ్గురు నేలకొరిగారు
Published Mon, Aug 29 2016 1:13 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement