300 మంది ఆశా వర్కర్లు అరెస్టు | Sakshi
Sakshi News home page

300 మంది ఆశా వర్కర్లు అరెస్టు

Published Fri, Mar 4 2016 10:08 AM

300 మంది ఆశా వర్కర్లు అరెస్టు - Sakshi

ఇంద్రకీలాద్రి: ఆశా వర్కర్లు తమ సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన చలో విజయవాడ ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. భారీగా కార్యకర్తలు తరలివస్తుండటంతో.. అప్రమత్తమైన పోలీసులు వారిని ముందస్తుగా అరెస్ట్ చేశారు. విజయవాడలోనితుమ్మలపల్లి కళాక్షేత్రం నుంచి శుక్రవారం తెల్లవారుజామున 300 మంది ఆశా వర్కర్లు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్తుండటంతో.. రంగంలోకి దిగిన పోలీసులు వారిని అరెస్ట్ చేసి కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ఫంక్షన్ హాల్ లో నిర్బంధించారు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement