Sakshi News home page

ఏపీలో మరో 3963 పాజిటివ్‌ కేసులు

Published Sat, Jul 18 2020 4:24 PM

3963 New Corona Positive Cases Reported In AP - Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 3,963 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా వైరస్‌ సోకిన వారి సంఖ్య 44,609కి చేరుకుంది. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. గత 24 గంటల్లో కరోనా నుంచి కోలుకుని 1,411 మంది బాధితులు క్షేమంగా డిశ్చార్జ్‌ కాగా, ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం 21763 మంది డిశ్చార్జ్‌  అయ్యారు. (కరోనాను జయించిన పోలీసులపై పూలవర్షం)

గత 24 గంటల్లో కరోనా బారినపడి తూర్పుగోదావరిలో 12, గుంటూరులో 8, కృష్ణాలో 8, అనంతపురంలో ఏడుగురు, పశ్చిమ గోదావరిలో ఐదుగురు, ప్రకాశంలో నలుగురు, నెల్లూరులో ముగ్గురు, విశాఖపట్నంలో ఇద్దరు, చిత్తూరు, కడప, విజయనగరంలో ఒక్కరు చొప్పున 52 మరణించారు. ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం 586 మంది మృతిచెందారు. గడిచిన 24 గంటల్లో 23,872 శాంపిల్స్‌ పరీక్షించగా, ఇప్పటివరకు ఏపీలో 12,84,384 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. రాష్ట్రంలో మొత్తం 22,260 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. (తూర్పు గోదావ‌రిలో 24 గంట‌ల పాటు కర్ఫ్యూ)

Advertisement

తప్పక చదవండి

Advertisement