కుటుంబాన్ని బలిగొన్న రోడ్డుప్రమాదం | Sakshi
Sakshi News home page

కుటుంబాన్ని బలిగొన్న రోడ్డుప్రమాదం

Published Wed, Mar 25 2015 4:36 PM

4 died in road accident

అనంతపురం : అనంతపురం జిల్లా డీ హీరేలాల్ మండలంలోని లింగమన్‌హల్లి గ్రామ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు చనిపోయారు. కర్ణాటకలోని బళ్లారికి చెందిన ఓ కుటుంబం బళ్లారి నుంచి బెంగుళూరుకు కారులో వెళ్తుండగా.. లింగమన్‌హల్లి గ్రామ సమీపంలో ఎదురుగా వస్తున్న కంటైనర్ ను కారు ఢీ కొట్టింది.

ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన రవిశంకర్(53), వీరేష్(25) అక్కడిక్కడే మృతి చెందగా, సుగుణ(45), సుమంత్(20)లు బళ్లారి ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మరణించారు. మృతులంతా కర్ణాటకలోని బళ్లారికి చెందినవారు.పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement