గుంటూరు జిల్లాలో ఘోర ప్రమాదం | Sakshi
Sakshi News home page

గుంటూరు జిల్లాలో ఘోర ప్రమాదం

Published Sat, Mar 18 2017 1:34 AM

4 died in road accident at guntur district

ఆరుగురు కూలీలను బలిగొన్న ట్రాలీ ఆటో

గురజాల/పట్నంబజారు (గుంటూరు ఈస్ట్‌)/కంభం (కనిగిరి): గుంటూరు జిల్లాలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గురజాల మండలంలోని జంగమహే శ్వరపురంలో ట్రాలీ ఆటో టైరు పగలడంతో వాహనం అదుపు తప్పి ఆరుగురు కూలీలు దుర్మరణం చెందారు. బేడ బుడ్గజంగం కాల నీ కూలీలు బొల్లాపల్లి మండలం చక్రాయ పాలెం తండాలో మిరపకాయలు కోసేం దుకు వెళ్లారు. రోజూలాగే పనులు ముగించు కుని తిరుగు ప్రయాణమయ్యారు. 10 నిమి షాల్లో ఇంటికి చేరుకుంటారనగా టైర్‌ పగి లింది. దీంతో డ్రైవర్‌ వాహనం అదుపుకాక రోడ్డు పక్కనే కరెంట్‌ స్తంభానికి ఢీకొట్టాడు.

స్తంభం ముక్కలుగా విరిగిపోగా పక్కనే చెరు వులోకి ఆటో బోల్తా కొట్టింది. ప్రమాదంలో పేర్ల మార్తమ్మ అలియాస్‌ ఇస్తారమ్మ (65), కడెం నర్సమ్మ(45), కడెం సమీక్ష (12), పస్తం కుమారి(14) అక్కడికక్కడే మృతి చెం దారు. గాయపడిన వారిని గుంటూరు తర లిస్తుండగా మార్గంమధ్యలో గంధం వెంక టమ్మ (45), కె.సమ్మక్క (16) మృతి చెందా రు. మరో 20 మందికి తీవ్ర గాయాల య్యా యి. మృతదేహాల్ని వైఎస్సార్‌సీపీ గురజాల నియోజకవర్గ సమన్వయకర్త కాసు మహేశ్‌ రెడ్డి, ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు సందర్శించి క్షతగాత్రుల్ని పరామర్శించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement