మినీ బస్సు బోల్తా: నలుగురికి గాయాలు | Sakshi
Sakshi News home page

మినీ బస్సు బోల్తా: నలుగురికి గాయాలు

Published Fri, Jan 22 2016 12:05 PM

4 injured in road accident

నకరికల్లు: గుంటూరు జిల్లాలో మినీ బస్సు బోల్తా పడిన ఘటనలో నల్లగొండ జిల్లా వాసులు గాయపడ్డారు. నల్లగొండ జిల్లా కోదాడకు చెందిన 13 మంది అయ్యప్పభక్తులు మినీ బస్సులో శబరిమలై నుంచి వస్తున్నారు. వారి వాహనం శనివారం ఉదయం అద్దంకి- నార్కట్‌పల్లి రహదారిపై గుంటూరు జిల్లా నకరికల్లు మండలం చల్లగుండ్లవారిపాలెం గ్రామం వద్ద అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో బస్సులోని నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.

Advertisement
Advertisement