సైదాపురం: నెల్లూరు జిల్లా గూడూరు రూరల్ మండలం తిప్పవరప్పాడు వద్ద వరద నీటికి ఆదివారం రాత్రి నలుగురు గల్లంతయ్యారు. వీరిలో ఒకరిని పోలీసులు ఆదివారం ఉదయం రక్షించారు. సైదాపురం మండలం అనంతమడుగు గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు టీవీఎస్ వాహనంపై వెళుతుండగా తిప్పవరప్పాడు వద్ద వాగు పొంగి పొర్లడంతో ఆ ప్రవాహంలో కొట్టుకుపోయాడు.
ఓ చెట్టును పట్టుకుని ప్రాణాలు కాపాడుకోవడంతో ఆదివారం ఉదయం స్థానికుల సమాచారంతో పోలీసులు అతడ్ని రక్షించారు. అలాగే, సైదాపురం దళితవాడకు చెందిన రమణమ్మ, సునీతమ్మతో పాటు మరొకరు కూడా ఇక్కడే వాగు ప్రవాహంలో గల్లంతయ్యారు. వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.