డెంగీతో చిన్నారి మృతి | Sakshi
Sakshi News home page

డెంగీతో చిన్నారి మృతి

Published Mon, Sep 7 2015 12:23 PM

4 years old children died due to dengue

చిన్నమండెం: డెంగీ జ్వరంతో బాధపడుతున్న చిన్నారి చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన సోమవారం తిరుపతి ఆస్పత్రిలో జరిగింది. వివరాలు.. వైఎస్సార్‌జిల్లా చిన్నమండెం మండలం దిగువసత్తివీడు గ్రామపంచాయతి పరిధిలోని రామపురంకు చెందిన గీతాశ్రీ(4) గత వారం రోజులుగా జ్వరంతో బాధపడుతోంది. దీంతో ఆమెను తిరుపతి ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందింది. కాగా.. గీతాశ్రీ సొదరి.. కావ్యశ్రీ(6) కూడా డెంగితో బాధపడుతూ అదే ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.
 

Advertisement
Advertisement