ఆర్టీసీ విజిలెన్స్ ఆఫీసులో 40 లక్షల పట్టివేత | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ విజిలెన్స్ ఆఫీసులో 40 లక్షల పట్టివేత

Published Wed, Apr 2 2014 9:33 AM

40 lakhs seized in rtc vigillance office of nellore

నెల్లూరులోని ఆర్టీసీ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ కార్యాలయంలో ఏసీబీ అధికారులు తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా ఆ కార్యాలయం నుంచి 40 లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. ఆర్టీసీ డీఎస్పీ చెంచురెడ్డిని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

సాధారణంగా ఆర్టీసీలో ఎలాంటి అక్రమాలు, అవకతవకలు జరగకుండా ఉండేలా చూసేందుకే ఈ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ విభాగం ఉంటుంది. అయితే కంచే చేను మేసినట్లు ఇక్కడే భారీ ఎత్తున సొమ్ము పట్టుబడటంతో జనం విస్తుపోతున్నారు.

Advertisement
Advertisement