అరకులోయ, న్యూస్లైన్: జిల్లాలో 4281 మం ది క్షయ వ్యాధితో చికిత్స పొందుతున్నారని జిల్లా క్షయ వ్యాధి నివారణ అధికారి(డీటీసీవో) డాక్టర్ వసుంధరాదేవి తెలిపారు. అరకులోయ క్లస్టర్ పరిధిలోని అరకులోయ, అనంతగిరి, మాడగడ, సుంకరమెట్ట పీహెచ్సీలను మంగళవారం ఆమె సందర్శించారు. క్షయ వ్యాధి కేసులపై ఆరా తీశారు. అరకులోయ కొండవీధి, పానిరంగిని గ్రామాలకు వెళ్లి టీబీ వ్యాధిగ్రస్తులను పరామర్శించారు. వైద్యం అందుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. మాడగడ పీహెచ్సీలో ఆశ వర్కర్లతో సమావేశమై టీబీ వ్యాధిపై అవగాహన కల్పించారు. టీబీ లక్షణాలు, ఎలా సోకుతుందో వివరిం చారు.
అనంతరం అరకులోయ ఏరియా ఆస్పత్రిలోని టీబీ కంట్రోల్ యూనిట్ ను సందర్శించి రికార్డులు పరిశీలించారు. ఈ సందర్భంగా తనను కలిసిన విలేకరులతో ఆమె మాట్లాడుతూ ప్రతి లక్ష మంది జనాభాలో 203 టీబీ కేసులు నమోదవుతాయని చెప్పారు. వ్యాధిగ్రస్తులకు ఉచితం గా పూర్తి వైద్య సాయం అందిస్తున్నట్టు తెలిపారు. ఈ వ్యాధికి సంబంధించి ఎటువంటి మందుల కొరత లేదన్నారు. క్షయ వ్యాధి నివారణ కోసం జిల్లాలో 59 డీఎంసీ సెంటర్లు పని చేస్తున్నాయని చెప్పారు. ఆమె వెంట జిల్లా క్షయ నివారణ అధికారులు శ్రీను, సాయిరాం, అరకులోయ క్లస్టర్ టీబీ యూనిట్ సూపర్వైజర్లు జగన్, వాసు పాల్గొన్నారు.
టీబీపై గిరిజనుకు అవగాహన కల్పించాలి
అనంతగిరి రూరల్: జిల్లా క్షయ వ్యాధి నివారణ అధికారి వసుంధ రాదేవి మంగళవారం స్థానిక పీహెచ్సీని సందర్శించారు. రికార్డులు పరిశీలించారు. క్షయ వ్యాధిపై అప్రమత్తంగా ఉండాలని, రోగులకు సకాలంలో వైద్య సేవలందించాలని స్థానిక వైద్యాధికారి మారుతి రావు, సిబ్బందికి సూచించారు. జిల్లాలో 90 శాతం టీబీ వ్యాధి తగ్గుముఖం పట్టిందని చె ప్పారు. టీబీపై గిరిజనులకు సరైన అవగాహన లేకపోవడంతో చాలా మంది ఈ వ్యాధితో బాధపడుతున్నారని తెలిపారు. సిబ్బంది మారుమూల గిరిజన గ్రామాలను సందర్శించి ఈ వ్యాధిపై అవగాహన కల్పించి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించాలని కోరారు.
జిల్లాలో 4281 మందికి క్షయ
Published Wed, Nov 6 2013 2:49 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
ఆ పూలు స్టార్స్లా అందంగా ఉన్నా..వాసన మాత్రం భరించలేం!
IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
ఉద్యోగం వెతుక్కునే క్రమంలో ఇలా చెయ్యొద్దు!: గూగుల్ ఉద్యోగి
ఇజ్రాయెల్ ప్రధాని కీలక నిర్ణయం.. అల్ జజీరా ఛానెల్పై నిషేధం
‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను ఆపాలని భూకజ్జాదారులు యత్నిస్తున్నారు’
'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
రాణించిన జడేజా.. పంజాబ్ కింగ్స్ టార్గెట్ ఎంతంటే?
బీజేపీ ‘ప్యూన్’ విమర్శలు.. కిశోరి లాల్ శర్మ కౌంటర్
అలాంటి కార్లను ఇష్టపడే వ్యక్తుల్లో శాడిజం ఎక్కువగా ఉంటుందట!
తప్పక చదవండి
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్గా..!
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement