= సక్సెస్ పాఠశాలలకు వెళ్లేందుకు ససేమిరా
= ఇంగ్లిష్లో బోధించాల్సి ఉండటమే కారణం
= ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంలుగా వెళ్లేందుకు ఎక్కువమంది ఆసక్తి
మచిలీపట్నం, న్యూస్లైన్ : ఉపాధ్యాయుల పదోన్నతి కౌన్సెలింగ్ డీఈవో కార్యాలయంలో శనివారం ప్రశాంతంగా ముగిసింది. సెకండరీ గ్రేడ్ టీచర్లుగా పనిచేస్తున్నవారికి స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి కౌన్సెలింగ్ ప్రక్రియను డీఈవో డీ దేవానందరెడ్డి నేతృత్వంలో నిర్వహించారు. శనివారం మొత్తం 44 మందికి పదోన్నతి కల్పించారు. వారిలో స్కూల్ అసిస్టెంట్లుగా 22 మంది, ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంలుగా మరో 22 మంది పదోన్నతులు పొందారు.
ఉదయం 9 గంటలకు ప్రారంభించాల్సిన కౌన్సెలింగ్ ప్రక్రియ మధ్యాహ్నం ఒంటిగంటకు ప్రారంభమైంది. తొలుత డీఈవో కార్యాలయం వద్ద పదోన్నతి కోసం వచ్చిన ఉపాధ్యాయుల సర్టిఫికెట్లు పరిశీలించారు. తూర్పు కృష్ణా ప్రాంతంలో పదోన్నతి పొందే ఉపాధ్యాయుల సంఖ్య ఎక్కువగా ఉండటం, పశ్చిమకృష్ణా ప్రాంతంలో పోస్టుల ఖాళీలు ఎక్కువగా ఉండటంతో దూర ప్రాంతానికి వెళ్లేందుకు ఉపాధ్యాయులు అంతగా ఆసక్తి చూపలేదు.
సక్సెస్ పాఠశాలల్లోనే అధికం...
1994 నుంచి 2004 వరకు ఉపాధ్యాయులుగా ఎంపికైన వారంతా తెలుగు మీడియంలోనే బీఈడీ చదివినవారు. అప్పట్లో బీఈడీ తెలుగు మీడియం చదివినవారికే పోస్టులు కేటాయించారు. కాలక్రమేణా విద్యావ్యవస్థలో సక్సెస్ పాఠశాలలు వచ్చాయి. వీటిలో ఇంగ్లిష్ మీడియంలో పాఠ్యాంశాలు బోధించాల్సి ఉంది. తెలుగు మీడియంలో డిగ్రీ, బీఈడీ చదివిన ఉపాధ్యాయులకు ఇంగ్లిష్ మీడియంలో పాఠ్యాంశాల బోధన కష్టమైన పనే.
ప్రస్తుతం జరుగుతున్న పదోన్నతి కౌన్సెలింగ్లో పెనుమల్లి, గుడ్లవల్లేరు, చినముత్తేవి, వడ్లమన్నాడు, మొవ్వ పాఠశాలలు సక్సెస్ స్కూళ్లుగా ఉన్నాయి. వీటిలోనే అధిక శాతం పోస్టులు ఖాళీగా ఉండటంతో పదోన్నతిపై ఈ పాఠశాలలకు వెళ్లేందుకు చాలామంది ఉపాధ్యాయులు వెనుకంజ వేశారు. కొంతమంది ఉపాధ్యాయులు పదోన్నతిని సైతం వదులుకున్నారు. ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంలుగా వెళ్లేందుకు అధిక శాతం ఉపాధ్యాయులు ప్రయత్నాలు చేశారు. కౌన్సెలింగ్లో డీఈవో కార్యాలయ ఏడీ రత్నకుమారి, రాజీవ్ విద్యామిషన్ కార్యాలయ సూపరింటెండెంట్ సుబ్బారావు పాల్గొన్నారు.
టీచర్ల కౌన్సెలింగ్ ప్రశాంతం 44 మందికి పదోన్నతి
Published Sun, Dec 29 2013 1:12 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
‘గుమ్మనూరు’ను అనర్హుడిగా ప్రకటించాలి
Lok Sabha Election 2024: పేలేది మళ్లీ షాట్ గన్నే!
శ్రీకాంత్ కథలో నటించడం గౌరవంగా ఉంది: జ్యోతిక
సజావుగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట బందోబస్తు
హత్యలు టు నాటుసారా వయా పేకాట
ఎన్నికల విధులకు వెళ్తూ గుండెపోటుతో మృతి
ఆర్టీసీ బస్సు– బైక్ ఢీ ●
వీడిన మహిళ హత్య కేసు మిస్టరీ
అంబేడ్కర్ కళాశాలలో దొడ్డమణి గోల్మాల్
తప్పక చదవండి
- ఏబీసీ పార్టీలది ముస్లిం లీగ్ ఎజెండా: జేపీ నడ్డా
- డీజీపీగా హరీష్కుమార్ గుప్తా
- ‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
Advertisement