ఇంట్లోకి దూసుకెళ్లిన లారీ, ఐదుగురు మృతి | Sakshi
Sakshi News home page

ఇంట్లోకి దూసుకెళ్లిన లారీ, ఐదుగురు మృతి

Published Sat, Dec 28 2013 8:11 PM

5 killed, several injured in lorry accident at Vizianagaram district

విజయనగరం: జిల్లాలో చింతలవలసలో శనివారం సాయంత్రం ఓ విషాదం చోటుచేసుకుంది. ఏపీఎస్పీ బెటాలియన్ వద్ద లారీ అదుపుతప్పి ఓ ఇంట్లోకి దూసుకెళ్లడంతో ఐదుగురు  అక్కడిక్కడే మృతిచెందారు. ఈ ఘటనలో పలువురికి గాయాలయినట్టు తెలిసింది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. లారీ అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement