గ్రామంలో విషజ్వరాలు: 50 మంది ఆస్పత్రి పాలు | Sakshi
Sakshi News home page

గ్రామంలో విషజ్వరాలు: 50 మంది ఆస్పత్రి పాలు

Published Sun, Sep 6 2015 6:59 PM

50 admitted to hospital of fever

దర్శి: ప్రకాశం జిల్లా దర్శి మండలం కిష్టాపురం గ్రామంలో విష జ్వరాలతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఆదివారం ఒక్కరోజే సుమారు 50 మంది జ్వరాలతో బాధపడుతూ దర్శి ప్రభుత్వ ఆస్పత్రిలో చేరారు. నాలుగు గంటలకోసారి జ్వరం వచ్చిపోతున్నట్టు వారు చెబుతున్నారు. మలేరియా లక్షణాలు లేకపోవడంతో వైరల్ జ్వరాలుగా వైద్యులు పరిగణించి చికిత్స ప్రారంభించారు.

Advertisement
Advertisement