50 ఇసుక ట్రాక్టర్లు సీజ్ | Sakshi
Sakshi News home page

50 ఇసుక ట్రాక్టర్లు సీజ్

Published Wed, Jul 29 2015 11:01 AM

50 sand tracters seized in kurnool distirict

ఎమ్మిగనూరు టౌన్: కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలంలో ఇసుక మాఫియా పెద్ద ఎత్తున నడుస్తోంది. 24 గంటలు గడవకముందే మరోసారి పోలీసులు పెద్ద మొత్తంలో అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్లను సీజ్ చేశారు. తమకు అందిన సమాచారం మేరుకు పోలీసులు బుధవారం ఉదయం ఎమ్మిగనూరు మండలం చెన్నాపూర్ గ్రామంలో తనిఖీలు చేపట్టి 50 ట్రాక్టర్ల ఇసుకను సీజ్ చేశారు. సమీపంలోని వాగుల నుంచి  ఇసుకను అక్రమంగా తీసుకొచ్చినట్టు గుర్తించారు. మంగళవారం ఉదయం ఇదే మండలం బోడబండలో 16 ట్రాక్టర్ల ఇసుకను కూడా సీజ్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisement
Advertisement