మినీ లారీ - ప్రైవేటు బస్సు ఢీ | Sakshi
Sakshi News home page

మినీ లారీ - ప్రైవేటు బస్సు ఢీ

Published Sat, Jun 27 2015 3:55 PM

6 injured in Road accident

చిత్తూరు (వి.కోట) : చిత్తూరు జిల్లా వి.కోట మండలం నాయకనేరి ఘాట్ వద్ద శనివారం మధ్యాహ్నం ఓ మినీ లారీ, ప్రైవేటు బస్సు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను హుటాహుటిన వి.కోట ప్రభుత్వాసుపత్రికి తరలిస్తున్నారు.

కాగా ప్రమాద సమయంలో ప్రైవేటు బస్సు వి.కోట నుంచి తమిళనాడు వెళ్తుండగా, మినీ లారీ తమిళనాడు నుంచి వి.కోట వైపు వస్తుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
Advertisement