ఏపీకి 67 సేవా పతకాలు | Sakshi
Sakshi News home page

ఏపీకి 67 సేవా పతకాలు

Published Tue, Aug 15 2017 3:26 AM

67 service awards to Andhra pradesh

52 పోలీసు శౌర్య, 3 రాష్ట్రపతి విశిష్ట సేవా, 12 అత్యుత్తమ సేవా పతకాలు
సాక్షి, న్యూఢిల్లీ: విధి నిర్వహణలో అత్యుత్తమ సేవలందించిన పోలీసు అధికారులకు ఏటా స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రకటించే అత్యుత్తమ సేవా పతకాలను కేంద్రం ప్రకటించింది. గత ఏడాది 16 పతకాలతో సరిపెట్టుకున్న ఆంధ్రప్రదేశ్‌ పోలీసులు ఈ ఏడాది  67 సేవా పతకాలు దక్కించుకున్నారు. ఇందు లో 52 పోలీసు శౌర్య, 3 రాష్ట్రపతి విశిష్ట సేవ, 12 అత్యుత్తమ సేవా పతకాలు ఉన్నా యి.

గత ఏడాది ఏపీకి రాష్ట్రపతి విశిష్ట సేవా పతకాలు 2, అత్యు త్తమ సేవాపతకాలు 14 దక్కాయి. రాష్ట్ర పతి విశిష్ట సేవా పతకాలు ఈ ఏడాది కిగాను ఏపీలోని విజయవాడ ఏసీబీ జాయింట్‌ డైరెక్టర్‌  కేవీ లక్ష్మీనాయక్, కర్నూ లు ఆర్‌ఐవో ఏఎస్పీ దొడ్లా నరహరి, విజయనగరం ఏఎస్‌ఐ కొటారి ప్రసాద్‌ రావులకు దక్కాయి. రాష్ట్రపతి శౌర్య పతకం ఈ ఏడాది ఒక్కరికే ప్రకటించగా.. అది ఛత్తీస్‌గఢ్‌కు చెందిన దివంగత ప్లటూన్‌ కమాండర్‌ శంకర్‌రావుకు దక్కింది.

దేశవ్యాప్తంగా 190 మందికి పోలీసు శౌర్య పతకాలు, 93 మందికి రాష్ట్రపతి విశిష్ట సేవా పతకాలు, 706 మందికి అత్యుత్తమ సేవా పతకాలు కలుపుకొని మొత్తం 990 పతకాలను కేంద్రం ప్రకటించింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement